Political News

అక్కడ 20 ఏళ్ల తర్వాత ఓటేశారు !

జార్ఖండ్ రాష్ట్రంలోని సరంద, కొల్హన్ లోని దట్టమైన అడవులు మావోయిస్టుల కంచుకోటలు. మావోల ఆదేశాల మేరకు గత 20 ఏళ్లుగా ఆ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఈ సారి అక్కడ నిరంతర అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్లతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సిబ్బందిని హెలికాప్టర్‌లో ఒకరోజు ముందుగానే తీసుకెళ్లారు. దీంతో అక్కడి ప్రజలు ఈ ఎన్నికలలో ఉత్సాహంగా ఓట్లు వేశారు.

దట్టమైన అడవిలో ఉన్న రెంగ్‌దహటు గ్రామంలో నాలుగు బూత్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో రెంగదహతు, స్వయంభ, టెన్సారా, ముర్ముర పోలింగ్ కేంద్రాలను తయారు చేశారు. ఓటర్ల భద్రత కోసం 174 బెటాలియన్ల సైనికులను ఇక్కడ మోహరించారు. సర్జాంబూరు, తుంబహాక, పాతతరోబ్ గ్రామాలకు చెందిన ఓటర్లు ఈ కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. ఇక్కడ మొత్తం నాలుగు బూత్‌లతో కలిపి 4 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగగా, రెంగ్‌దహటు బూత్‌లో 68.51 శాతం, ముర్ముర బూత్‌లో 62 శాతం, టెన్సారా బూత్‌లో 62.3 శాతం, స్వయంభ బూత్‌లో 66.94 శాతం ఓటింగ్ నమోదైంది. నక్సల్ ప్రభావిత బూత్‌లలో ఓటింగ్ శాతం దాదాపు 65 శాతానికి చేరుకుంది.

గోయిల్‌కెరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కుయిడా, ఛోటా కుయిడా, మరదిరి, మేరల్‌గడ, హతిబురు, తిలయాబెడ, బోయ్‌పైసాంగ్‌ సరిహద్దు ప్రాంతాలు, కటంబ, బయ్‌హతు, బోరై, లెంసడిహ్‌ గ్రామాలు, టోంటో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హుసిపి, రాజబాస, తుంబహక, రెగడ, పట్టోరాబ్, గోబురు, లుయా గ్రామాలలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. గతంలో ఈ గ్రామాలకు వెళ్లే దారిలో నక్సలైట్లు భారీ సంఖ్యలో ఐఈడీలను అమర్చారు. భద్రతా దళాలు 700 కంటే ఎక్కువ ఐఈడీలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ గ్రామాలకు వెళ్లే రహదారులను సురక్షితంగా చేశారు. దీంతో ప్రజలు నిర్భయంగా ఈసారి ఓటువేశారు.

This post was last modified on May 14, 2024 11:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago