Political News

అక్కడ 20 ఏళ్ల తర్వాత ఓటేశారు !

జార్ఖండ్ రాష్ట్రంలోని సరంద, కొల్హన్ లోని దట్టమైన అడవులు మావోయిస్టుల కంచుకోటలు. మావోల ఆదేశాల మేరకు గత 20 ఏళ్లుగా ఆ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఈ సారి అక్కడ నిరంతర అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్లతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సిబ్బందిని హెలికాప్టర్‌లో ఒకరోజు ముందుగానే తీసుకెళ్లారు. దీంతో అక్కడి ప్రజలు ఈ ఎన్నికలలో ఉత్సాహంగా ఓట్లు వేశారు.

దట్టమైన అడవిలో ఉన్న రెంగ్‌దహటు గ్రామంలో నాలుగు బూత్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో రెంగదహతు, స్వయంభ, టెన్సారా, ముర్ముర పోలింగ్ కేంద్రాలను తయారు చేశారు. ఓటర్ల భద్రత కోసం 174 బెటాలియన్ల సైనికులను ఇక్కడ మోహరించారు. సర్జాంబూరు, తుంబహాక, పాతతరోబ్ గ్రామాలకు చెందిన ఓటర్లు ఈ కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. ఇక్కడ మొత్తం నాలుగు బూత్‌లతో కలిపి 4 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగగా, రెంగ్‌దహటు బూత్‌లో 68.51 శాతం, ముర్ముర బూత్‌లో 62 శాతం, టెన్సారా బూత్‌లో 62.3 శాతం, స్వయంభ బూత్‌లో 66.94 శాతం ఓటింగ్ నమోదైంది. నక్సల్ ప్రభావిత బూత్‌లలో ఓటింగ్ శాతం దాదాపు 65 శాతానికి చేరుకుంది.

గోయిల్‌కెరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కుయిడా, ఛోటా కుయిడా, మరదిరి, మేరల్‌గడ, హతిబురు, తిలయాబెడ, బోయ్‌పైసాంగ్‌ సరిహద్దు ప్రాంతాలు, కటంబ, బయ్‌హతు, బోరై, లెంసడిహ్‌ గ్రామాలు, టోంటో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హుసిపి, రాజబాస, తుంబహక, రెగడ, పట్టోరాబ్, గోబురు, లుయా గ్రామాలలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. గతంలో ఈ గ్రామాలకు వెళ్లే దారిలో నక్సలైట్లు భారీ సంఖ్యలో ఐఈడీలను అమర్చారు. భద్రతా దళాలు 700 కంటే ఎక్కువ ఐఈడీలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ గ్రామాలకు వెళ్లే రహదారులను సురక్షితంగా చేశారు. దీంతో ప్రజలు నిర్భయంగా ఈసారి ఓటువేశారు.

This post was last modified on May 14, 2024 11:18 am

Share

Recent Posts

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

51 minutes ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

2 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

2 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

3 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

5 hours ago

బాలయ్య చెప్పేదాకా నమ్మలేని విషయమది

నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…

7 hours ago