టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దంపతులు.. తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. అయితే.. ఇందులో స్పెషల్ ఏంటంటే.. చంద్రబాబు దంపతులు తమ కుమారుడు, పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ కోసం తొలి ఓటు వేయాలని అనుకున్నారు. కానీ, స్వల్ప ఆలస్యంతో మూడో ఓటు వేయాల్సి వచ్చింది. మొత్తానికి సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారం భం కావడంతో ఇక్కడ భారీ స్పందన కనిపించింది.
ఉండవల్లిలోని 16వ నెంబరు పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారా లోకేష్ దంప తులు కూడా ఇక్కడే ఓటేశారు. అయితే.. అప్పటికే ఓటర్లు భారీగా క్యూలైన్లోకి రావడంతో ఇబ్బంది ఏర్పడింది. దీంతో ప్రత్యేకంగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, మంగళగిరిలో ఎటు చూసినా పోలింగ్ కేంద్రాలు ఉదయాన్నే కిక్కిరిసి పోయాయి. ముఖ్యంగా మహిళలు బారులు తీరారు. కేంద్రాల ముందు వేసిన టెంట్లు కూడా.. సరిపోనంతగా బారులు తీరడం గమనార్హం.
మొత్తానికి ఏపీలో ఎటు చూసినా.. ఉదయం 7 గంటలకే బూతుల్లో ఓటర్లు బారులు తీరారు. గతంలో ఇలాం టి పరిస్థితి కనిపించలేదు. అయితే.. దీనికి ప్రదాన కారణం..ఎండలు తీవ్రంగా ఉండడంతోపాటు కూలి పనులు చేసుకునేవారు త్వరగా ఓటేసి వెళ్లిపోవచ్చన్న ఉద్దేశం కూడా ఉండి ఉంటుందని ఒక అంచనా. లేకపోతే.. తొలి ఓటు వేయాలన్న కసి కూడా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 13, 2024 11:23 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…