Political News

ఓటేసిన బాబు దంప‌తులు.. స్పెష‌ల్ ఏంటంటే!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి దంప‌తులు.. త‌మ ఓటు హ‌క్కును విని యోగించుకున్నారు. అయితే.. ఇందులో స్పెష‌ల్ ఏంటంటే.. చంద్ర‌బాబు దంప‌తులు త‌మ కుమారుడు, పార్టీ యువ నాయ‌కుడు నారా లోకేష్ కోసం తొలి ఓటు వేయాల‌ని అనుకున్నారు. కానీ, స్వ‌ల్ప ఆల‌స్యంతో మూడో ఓటు వేయాల్సి వ‌చ్చింది. మొత్తానికి సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కే పోలింగ్ ప్ర‌క్రియ ప్రారం భం కావ‌డంతో ఇక్కడ భారీ స్పంద‌న క‌నిపించింది.

ఉండ‌వ‌ల్లిలోని 16వ నెంబరు పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారా లోకేష్ దంప తులు కూడా ఇక్క‌డే ఓటేశారు. అయితే.. అప్ప‌టికే ఓట‌ర్లు భారీగా క్యూలైన్‌లోకి రావ‌డంతో ఇబ్బంది ఏర్ప‌డింది. దీంతో ప్ర‌త్యేకంగా వెళ్లి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. కాగా, మంగ‌ళ‌గిరిలో ఎటు చూసినా పోలింగ్ కేంద్రాలు ఉద‌యాన్నే కిక్కిరిసి పోయాయి. ముఖ్యంగా మ‌హిళ‌లు బారులు తీరారు. కేంద్రాల ముందు వేసిన టెంట్లు కూడా.. స‌రిపోనంత‌గా బారులు తీర‌డం గ‌మ‌నార్హం.

మొత్తానికి ఏపీలో ఎటు చూసినా.. ఉద‌యం 7 గంట‌ల‌కే బూతుల్లో ఓట‌ర్లు బారులు తీరారు. గ‌తంలో ఇలాం టి ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. అయితే.. దీనికి ప్ర‌దాన కార‌ణం..ఎండ‌లు తీవ్రంగా ఉండ‌డంతోపాటు కూలి ప‌నులు చేసుకునేవారు త్వ‌ర‌గా ఓటేసి వెళ్లిపోవ‌చ్చ‌న్న ఉద్దేశం కూడా ఉండి ఉంటుంద‌ని ఒక అంచ‌నా. లేక‌పోతే.. తొలి ఓటు వేయాల‌న్న క‌సి కూడా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

  • మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు దంప‌తులు నెల్లూరు జిల్లాలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.
  • శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో తోగరామ్ గ్రామంలో స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • పులివెందుల లోని భాకరాపేట లో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దంప‌తులు.

This post was last modified on May 13, 2024 11:23 am

Share

Recent Posts

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

2 minutes ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

2 minutes ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

3 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

3 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

3 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

7 hours ago