టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దంపతులు.. తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. అయితే.. ఇందులో స్పెషల్ ఏంటంటే.. చంద్రబాబు దంపతులు తమ కుమారుడు, పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ కోసం తొలి ఓటు వేయాలని అనుకున్నారు. కానీ, స్వల్ప ఆలస్యంతో మూడో ఓటు వేయాల్సి వచ్చింది. మొత్తానికి సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారం భం కావడంతో ఇక్కడ భారీ స్పందన కనిపించింది.
ఉండవల్లిలోని 16వ నెంబరు పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారా లోకేష్ దంప తులు కూడా ఇక్కడే ఓటేశారు. అయితే.. అప్పటికే ఓటర్లు భారీగా క్యూలైన్లోకి రావడంతో ఇబ్బంది ఏర్పడింది. దీంతో ప్రత్యేకంగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, మంగళగిరిలో ఎటు చూసినా పోలింగ్ కేంద్రాలు ఉదయాన్నే కిక్కిరిసి పోయాయి. ముఖ్యంగా మహిళలు బారులు తీరారు. కేంద్రాల ముందు వేసిన టెంట్లు కూడా.. సరిపోనంతగా బారులు తీరడం గమనార్హం.
మొత్తానికి ఏపీలో ఎటు చూసినా.. ఉదయం 7 గంటలకే బూతుల్లో ఓటర్లు బారులు తీరారు. గతంలో ఇలాం టి పరిస్థితి కనిపించలేదు. అయితే.. దీనికి ప్రదాన కారణం..ఎండలు తీవ్రంగా ఉండడంతోపాటు కూలి పనులు చేసుకునేవారు త్వరగా ఓటేసి వెళ్లిపోవచ్చన్న ఉద్దేశం కూడా ఉండి ఉంటుందని ఒక అంచనా. లేకపోతే.. తొలి ఓటు వేయాలన్న కసి కూడా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 13, 2024 11:23 am
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…