Political News

జగన్‌ సీట్లపై పీకే లేటెస్ట్ అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ పాత్ర కూడా కీలకమే. ఆయన వ్యూహాలను అనుసరించే ఎన్నికల్లో పోటీ పడింది వైసీపీ. చంద్రబాబు ప్రభుత్వం మీద జనాల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచడంలో, వైసీపీ గ్రాఫ్ పెరగడంలో పీకే అండ్ టీం వేసిన ప్రణాళికలు బాగా పని చేశాయి.

ఐతే అప్పట్లో ఐప్యాక్ టీంకు ప్రశాంత్ కిశోరే సారథ్యం వహించేవారు. కానీ తర్వాత ఆ సంస్థకు ప్రశాంత్ దూరమయ్యారు. ఇప్పుడు ఆయనకు ఏపీ రాజకీయాలకు సంబంధం లేదు. ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో జగన్ ఓడిపోతున్నాడనే అంచనా వేశారు పీకే. దీంతో వైసీపీ ఆయన్ని ఎటాక్ చేసింది కూడా. తాజాగా ఒక టీవీ ఛానెల్ ఏపీ రాజకీయాలపై ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది.

ఈ సందర్భంగా జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పీకే. జగన్‌తో తనకు శతృత్వం ఏమీ లేదని.. ఆయన ఇప్పటికీ తనకు మంచి మిత్రుడే అని పీకే అన్నాడు. ఢిల్లీలో ఏడాదిన్నర కిందట జగన్‌ను కలిశానని.. ఆ సందర్భంగా తాను రెండోసారి విజయం సాధించడమై చాలా ధీమాగా కనిపించారని.. తనకు పోటీయే లేదని వ్యాఖ్యానించారని పీకే చెప్పాడు. ఆ సమయంలో తన పార్టీకి 155 సీట్లు రాబోతున్నట్లుగా తనతో చెప్పినట్లు వెల్లడించాడు.

ఐతే తన అంచనా ప్రకారం వైసీపీ 151 సీట్ల నుంచి 51 సీట్లకు పడిపోనుందని పీకే వ్యాఖ్యానించాడు. 2019లో జగన్ ఎలా మొదలుపెట్టాడో ఆ స్థితికి ఇప్పుడు రాబోతున్నట్లు పీకే చెప్పాడు. కేవలం జనాలకు పథకాల డబ్బులు మాత్రమే ఇస్తే సరిపోదని.. పాలన, అభివృద్ధి కూడా ఉండాలని, అది లేకే జగన్ ఓడిపోతున్నాడని పీకే విశ్లేషించాడు.

This post was last modified on May 12, 2024 6:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సన్ రైజర్స్ గెలుపు : ప్రేమంటే ఇదేరా లింకు

నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ చూసి క్రికెట్ అభిమానులు ఊగిపోయారు. ముఖ్యంగా అభిషేక్…

10 minutes ago

విశ్వంభర టీజర్లో చూసింది సినిమాలో లేదా

గత ఏడాది విశ్వంభర టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ ఏ స్థాయిదో మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. అందుకే నెలల తరబడి…

37 minutes ago

హిట్ 3 హింస అంచనాలకు మించి

ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…

3 hours ago

‘టాప్’ లేపిన తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…

5 hours ago

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్.. చైనా అద్భుత సృష్టి!

ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…

8 hours ago

మంచి నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ

తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…

9 hours ago