ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల పవన్ యువతలో భారీగా క్రేజ్ సంపాదించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా యూత్లో తన క్రేజ్ ఉపయోగపడుతుందని ఆశించారు. కానీ పవన్ను చూడగానే వెర్రెత్తిపోయి కేకలు పెట్టే అభిమానులు.. ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఆశించిన స్థాయిలో అండగా నిలవలేదు.
ఈ విషయమై పవన్ స్వయంగా ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రత్యర్థులు.. పవన్ను తరచుగా దీనిపై ఎగతాళి చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక నానుడి బాగా పాపులర్ అయింది. “పవనన్నకు ప్రాణమిస్తాం.. జగనన్నకు ఓటేస్తాం” అనే బాపతు అభిమానులే పవన్కు ఎక్కువగా ఉన్నారని అంటుంటారు.
ఐతే 2019 ఎన్నికల ట్రెండ్స్ను గమనిస్తే యూత్లో చాలామంది ఈ స్లోగన్నే ఫాలో అయిన విషయం అర్థమవుతుంది. ఈ పరిస్థితి మారితేనే జనసేనకు ప్రస్తుత ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఐతే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మార్పు స్పష్టమని అర్థమవుతోంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని జగన్కు అండగా నిలిస్తే.. ఆయన ఆ విషయంలో చేసింది ఏమీ లేదనే అసంతృప్తి యువతలో చాలా ఉంది. ప్రస్తుతం ఏపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న వర్గాల్లో యువత ముందుంటుంది.
రెండు చోట్లా ఓడినా బలంగా నిలబడిన పవన్కు ఈసారి అండగా నిలవాలనే ఆలోచన యువతలో కలుగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కాపు యువత ఈసారి పవన్కు గట్టి మద్దతు ఇస్తుందని.. ఈసారి మాత్రం అభిమానులు పవన్కు ప్రాణమిస్తాం అనడమే కాదు కాదు, ఓటు కూడా వేస్తారని జనసేన ఆశిస్తోంది.
This post was last modified on May 12, 2024 3:32 pm
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…