దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి.. ఆదివారం ఒకింత సేదదీరారు. ఎన్నికల టెన్షన్ నుంచి రిలాక్స్ అయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొందరితో కలిసి ఆయన ఫుట్ బాల్ ఆడడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిత్రం ఏంటంటే.. ఆట మధ్యలో సీఎం వేసుకున్న షూ(బూట్లు) పాడైపోయాయి. దీంతో వాటిని పూర్తిగా వదిలేసి మరీ చాలా ఇంట్రస్ట్ గా ఆయన ఫుడ్ బాల్ ఆడారు.
కాగా.. ఎన్నికల ప్రచారం అనంతరం.. నాయకులు ఒక్కొక్క రీతిలో విశ్రాంతి పొందుతారు. మరికొందరు అదే బిజీలో కూడా గడిపేస్తుంటారు. తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం.. ఒకింత రిలాక్స్ కోసం ఫుట్బాల్ ట్రై చేశారు. ఇదిలావుంటే.. ఎన్నికల ప్రచారం అనంతరం.. నాయకులు వ్యవహరించే తీరు కూడా.. మరుసటి రోజు జరిగే పోలింగ్పై ప్రభావం చూపిస్తుందని అంటారు. ఎందుకంటే.. ఎన్నికల ప్రచారంలో వారు అనేక మందిని కలుస్తారు. తమకు అనుకూలమా.. ప్రతికూలమా.. అనేది వారికి తెలిసిపోతుంది.
తదుపరి రోజు వారి ముఖంలో ఈ ఛాయలు స్పష్టంగా తెలుస్తాయి. ఇది సైకాలజీ చెప్పే విషయం. నాయ కులు హ్యాపీగా ఉన్నారని కనుక సంకేతాలు వస్తే.. ఫలితం కూడా వారికి అనుకూలంగా ఉంటుందనే అర్ధ మవుతుంది. అలా కాకుండా.. నాయకులు ఇంకా టెన్షన్ పడుతుంటే.. వారి పరిస్తితి అటు ఇటుగా ఉందని అంచనా వేసుకుంటారు. అయితే. ఇప్పుడు నాయకులు.. క్షేత్రస్థాయిలో పరిస్తితి ఎలా ఉన్నప్పటికీ నాయకులు మాత్రం ధీమా సంకేతాలనే పంపిస్తున్నారు.
తాజాగా సీఎం రేవంత్ కూడా ఫలితంతో సంబంధం లేకుండా. ప్రజలకు మాత్రం సానుకూల సంకేతాలు పంపించడం గమనార్హం. రేవంత్తో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హెచ్సీయూ విద్యార్థులు పాల్గొన్నారు.
This post was last modified on May 12, 2024 3:19 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…