దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి.. ఆదివారం ఒకింత సేదదీరారు. ఎన్నికల టెన్షన్ నుంచి రిలాక్స్ అయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొందరితో కలిసి ఆయన ఫుట్ బాల్ ఆడడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిత్రం ఏంటంటే.. ఆట మధ్యలో సీఎం వేసుకున్న షూ(బూట్లు) పాడైపోయాయి. దీంతో వాటిని పూర్తిగా వదిలేసి మరీ చాలా ఇంట్రస్ట్ గా ఆయన ఫుడ్ బాల్ ఆడారు.
కాగా.. ఎన్నికల ప్రచారం అనంతరం.. నాయకులు ఒక్కొక్క రీతిలో విశ్రాంతి పొందుతారు. మరికొందరు అదే బిజీలో కూడా గడిపేస్తుంటారు. తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం.. ఒకింత రిలాక్స్ కోసం ఫుట్బాల్ ట్రై చేశారు. ఇదిలావుంటే.. ఎన్నికల ప్రచారం అనంతరం.. నాయకులు వ్యవహరించే తీరు కూడా.. మరుసటి రోజు జరిగే పోలింగ్పై ప్రభావం చూపిస్తుందని అంటారు. ఎందుకంటే.. ఎన్నికల ప్రచారంలో వారు అనేక మందిని కలుస్తారు. తమకు అనుకూలమా.. ప్రతికూలమా.. అనేది వారికి తెలిసిపోతుంది.
తదుపరి రోజు వారి ముఖంలో ఈ ఛాయలు స్పష్టంగా తెలుస్తాయి. ఇది సైకాలజీ చెప్పే విషయం. నాయ కులు హ్యాపీగా ఉన్నారని కనుక సంకేతాలు వస్తే.. ఫలితం కూడా వారికి అనుకూలంగా ఉంటుందనే అర్ధ మవుతుంది. అలా కాకుండా.. నాయకులు ఇంకా టెన్షన్ పడుతుంటే.. వారి పరిస్తితి అటు ఇటుగా ఉందని అంచనా వేసుకుంటారు. అయితే. ఇప్పుడు నాయకులు.. క్షేత్రస్థాయిలో పరిస్తితి ఎలా ఉన్నప్పటికీ నాయకులు మాత్రం ధీమా సంకేతాలనే పంపిస్తున్నారు.
తాజాగా సీఎం రేవంత్ కూడా ఫలితంతో సంబంధం లేకుండా. ప్రజలకు మాత్రం సానుకూల సంకేతాలు పంపించడం గమనార్హం. రేవంత్తో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హెచ్సీయూ విద్యార్థులు పాల్గొన్నారు.
This post was last modified on May 12, 2024 3:19 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…