దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి.. ఆదివారం ఒకింత సేదదీరారు. ఎన్నికల టెన్షన్ నుంచి రిలాక్స్ అయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొందరితో కలిసి ఆయన ఫుట్ బాల్ ఆడడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిత్రం ఏంటంటే.. ఆట మధ్యలో సీఎం వేసుకున్న షూ(బూట్లు) పాడైపోయాయి. దీంతో వాటిని పూర్తిగా వదిలేసి మరీ చాలా ఇంట్రస్ట్ గా ఆయన ఫుడ్ బాల్ ఆడారు.
కాగా.. ఎన్నికల ప్రచారం అనంతరం.. నాయకులు ఒక్కొక్క రీతిలో విశ్రాంతి పొందుతారు. మరికొందరు అదే బిజీలో కూడా గడిపేస్తుంటారు. తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం.. ఒకింత రిలాక్స్ కోసం ఫుట్బాల్ ట్రై చేశారు. ఇదిలావుంటే.. ఎన్నికల ప్రచారం అనంతరం.. నాయకులు వ్యవహరించే తీరు కూడా.. మరుసటి రోజు జరిగే పోలింగ్పై ప్రభావం చూపిస్తుందని అంటారు. ఎందుకంటే.. ఎన్నికల ప్రచారంలో వారు అనేక మందిని కలుస్తారు. తమకు అనుకూలమా.. ప్రతికూలమా.. అనేది వారికి తెలిసిపోతుంది.
తదుపరి రోజు వారి ముఖంలో ఈ ఛాయలు స్పష్టంగా తెలుస్తాయి. ఇది సైకాలజీ చెప్పే విషయం. నాయ కులు హ్యాపీగా ఉన్నారని కనుక సంకేతాలు వస్తే.. ఫలితం కూడా వారికి అనుకూలంగా ఉంటుందనే అర్ధ మవుతుంది. అలా కాకుండా.. నాయకులు ఇంకా టెన్షన్ పడుతుంటే.. వారి పరిస్తితి అటు ఇటుగా ఉందని అంచనా వేసుకుంటారు. అయితే. ఇప్పుడు నాయకులు.. క్షేత్రస్థాయిలో పరిస్తితి ఎలా ఉన్నప్పటికీ నాయకులు మాత్రం ధీమా సంకేతాలనే పంపిస్తున్నారు.
తాజాగా సీఎం రేవంత్ కూడా ఫలితంతో సంబంధం లేకుండా. ప్రజలకు మాత్రం సానుకూల సంకేతాలు పంపించడం గమనార్హం. రేవంత్తో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హెచ్సీయూ విద్యార్థులు పాల్గొన్నారు.
This post was last modified on May 12, 2024 3:19 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…