దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి.. ఆదివారం ఒకింత సేదదీరారు. ఎన్నికల టెన్షన్ నుంచి రిలాక్స్ అయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొందరితో కలిసి ఆయన ఫుట్ బాల్ ఆడడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిత్రం ఏంటంటే.. ఆట మధ్యలో సీఎం వేసుకున్న షూ(బూట్లు) పాడైపోయాయి. దీంతో వాటిని పూర్తిగా వదిలేసి మరీ చాలా ఇంట్రస్ట్ గా ఆయన ఫుడ్ బాల్ ఆడారు.
కాగా.. ఎన్నికల ప్రచారం అనంతరం.. నాయకులు ఒక్కొక్క రీతిలో విశ్రాంతి పొందుతారు. మరికొందరు అదే బిజీలో కూడా గడిపేస్తుంటారు. తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం.. ఒకింత రిలాక్స్ కోసం ఫుట్బాల్ ట్రై చేశారు. ఇదిలావుంటే.. ఎన్నికల ప్రచారం అనంతరం.. నాయకులు వ్యవహరించే తీరు కూడా.. మరుసటి రోజు జరిగే పోలింగ్పై ప్రభావం చూపిస్తుందని అంటారు. ఎందుకంటే.. ఎన్నికల ప్రచారంలో వారు అనేక మందిని కలుస్తారు. తమకు అనుకూలమా.. ప్రతికూలమా.. అనేది వారికి తెలిసిపోతుంది.
తదుపరి రోజు వారి ముఖంలో ఈ ఛాయలు స్పష్టంగా తెలుస్తాయి. ఇది సైకాలజీ చెప్పే విషయం. నాయ కులు హ్యాపీగా ఉన్నారని కనుక సంకేతాలు వస్తే.. ఫలితం కూడా వారికి అనుకూలంగా ఉంటుందనే అర్ధ మవుతుంది. అలా కాకుండా.. నాయకులు ఇంకా టెన్షన్ పడుతుంటే.. వారి పరిస్తితి అటు ఇటుగా ఉందని అంచనా వేసుకుంటారు. అయితే. ఇప్పుడు నాయకులు.. క్షేత్రస్థాయిలో పరిస్తితి ఎలా ఉన్నప్పటికీ నాయకులు మాత్రం ధీమా సంకేతాలనే పంపిస్తున్నారు.
తాజాగా సీఎం రేవంత్ కూడా ఫలితంతో సంబంధం లేకుండా. ప్రజలకు మాత్రం సానుకూల సంకేతాలు పంపించడం గమనార్హం. రేవంత్తో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హెచ్సీయూ విద్యార్థులు పాల్గొన్నారు.
This post was last modified on May 12, 2024 3:19 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…