ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ దగ్గరపడుతోంది. మరొక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు.
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలోనూ పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇక్కడ సిటింగ్ వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే సిటింగ్ ఎమ్మెల్యేను ఓడించే స్థాయికిసుధీర్ ఎదిగాడని, ఇక్కడ టీడీపీకి అనుకూల పవనాలే వీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వారసుడిగా సుధీర్ రాజకీయ ప్రవేశం చేశారు. అయితే శ్రీకాళహస్తిలో సుధీర్ను కాదని ఇతరులకు టికెట్ ఇవ్వాలని బాబు మొదట అనుకున్నా.. వైసీపీ ఎమ్మెల్యేను ఢీకొట్టే సత్తా ఆయనకే ఉందని పోటీలో నిలబెట్టారు.
అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సుధీర్ విజయం దిశగా సాగుతున్నారు. సుధీర్కు మొదట కూటమి నేతల నుంచి ఆశించిన మద్దతు రాలేదు. కానీ అందరితో మాట్లాడి తనవైపు తిప్పుకున్నారు. జనసేన, బీజేపీ నేతలు కూడా ఇప్పుడు సుధీర్ గెలుపు కోసం పని చేస్తున్నారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై జనాల్లోనే కాదు సొంత పార్టీ నేతల్లోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ అయిదేళ్లలో ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రజలు అంటున్నారు.
మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోని మధుసూదన్ కోసం ఇప్పుడు ఎందుకు పని చేయాలంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రచారంలో మధుసూదన్ వెనుకబడ్డారని టాక్.
ఎంత నచ్చజెప్పినా ఆయన కోసం పని చేసేందుకు వైసీపీ శ్రేణులు ముందుకు రావడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీ విజయం ఖాయమనే అంచనాలు కలుగుతున్నాయి.
This post was last modified on May 11, 2024 2:23 pm
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…