లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేకత సంపాదించుకున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రత్యేక హోదా కోసం లోక్సభలో రామ్మోహన్ నాయుడు పోరాడారు. సభలో ఆయన స్పీచ్లు ఏపీలో జనాలను ఉర్రూతలూగించాయి. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, అరాచకం మీద.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళం వినిపించారు. ఇలాంటి యంగ్ అండ్ డేరింగ్ నేత ఎంపీగా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు.
వరుసగా మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా గెలిచేందుకు టీడీపీ నాయకుడు రామ్మోహన్ నాయుడు రంగం సిద్ధం చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన విజయాన్ని వైసీపీ అడ్డుకోలేదని టాక్.
రామ్మోహన్ నాయుడికి పోటీగా వైసీపీ నుంచి పేరాడ తిలక్, కాంగ్రెస్ తరపున పేడాడ పరమేశ్వరరావు బరిలో ఉన్నారు. కానీ వీళ్లిద్దరూ రామ్మోహన్కు అసలు పోటీనే కాదని చెప్పాలి. వైసీపీపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత రామ్మోహన్కు మరింతగా కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
2019లో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అయిదు చోట్ల గెలిచింది. అయినా జగన్ వేవ్ను తట్టుకుని రామ్మోహన్ ఎంపీ సీటు నిలబెట్టుకున్నారు. అలాంటిది ఈ సారి వైసీపీకి ఓటమి తప్పదనే అంచనాల నేపథ్యంలో రామ్మోహన్ విజయం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ సీట్లు దక్కకపోవడంతో కాస్త అసంతృప్తితో ఉన్న ఇక్కడి టీడీపీ నాయకులను బుజ్జగించి రామ్మోహన్ దారిలోకి తెచ్చుకున్నారు. మరోవైపు వైసీపీలో వర్గపోరు కూడా ఆయనకు కలిసి రానుంది. ముఖ్యంగా ధర్మాన కుటుంబంలో వైసీపీ నాయకులున్నా.. లోలోపల మాత్రం రామ్మోహన్కు మద్దతు ఉందనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on May 11, 2024 2:17 pm
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…