లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేకత సంపాదించుకున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రత్యేక హోదా కోసం లోక్సభలో రామ్మోహన్ నాయుడు పోరాడారు. సభలో ఆయన స్పీచ్లు ఏపీలో జనాలను ఉర్రూతలూగించాయి. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, అరాచకం మీద.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళం వినిపించారు. ఇలాంటి యంగ్ అండ్ డేరింగ్ నేత ఎంపీగా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు.
వరుసగా మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా గెలిచేందుకు టీడీపీ నాయకుడు రామ్మోహన్ నాయుడు రంగం సిద్ధం చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన విజయాన్ని వైసీపీ అడ్డుకోలేదని టాక్.
రామ్మోహన్ నాయుడికి పోటీగా వైసీపీ నుంచి పేరాడ తిలక్, కాంగ్రెస్ తరపున పేడాడ పరమేశ్వరరావు బరిలో ఉన్నారు. కానీ వీళ్లిద్దరూ రామ్మోహన్కు అసలు పోటీనే కాదని చెప్పాలి. వైసీపీపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత రామ్మోహన్కు మరింతగా కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
2019లో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అయిదు చోట్ల గెలిచింది. అయినా జగన్ వేవ్ను తట్టుకుని రామ్మోహన్ ఎంపీ సీటు నిలబెట్టుకున్నారు. అలాంటిది ఈ సారి వైసీపీకి ఓటమి తప్పదనే అంచనాల నేపథ్యంలో రామ్మోహన్ విజయం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ సీట్లు దక్కకపోవడంతో కాస్త అసంతృప్తితో ఉన్న ఇక్కడి టీడీపీ నాయకులను బుజ్జగించి రామ్మోహన్ దారిలోకి తెచ్చుకున్నారు. మరోవైపు వైసీపీలో వర్గపోరు కూడా ఆయనకు కలిసి రానుంది. ముఖ్యంగా ధర్మాన కుటుంబంలో వైసీపీ నాయకులున్నా.. లోలోపల మాత్రం రామ్మోహన్కు మద్దతు ఉందనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on May 11, 2024 2:17 pm
గత ఏడాది డిసెంబర్ లో అఖండ 2 తాండవం తర్వాత బాలకృష్ణ నుంచి కొత్త సినిమా రాలేదు. ముందు పీరియాడిక్…
వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న రవితేజకు.. ‘ఇరుముడి’ రూపంలో ఒక మోస్తరు విజయం దక్కినా చాలని చూశారు అభిమానులు. కానీ…
ఇటీవల ఇద్దరు ఫోక్ డ్యాన్సర్లకు సంబంధించిన వ్యక్తిగత వివాదం సోషల్ మీడియాలో, మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే…
ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పుకూలిన ఘటన షాకింగ్…
మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది…
పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ…