లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేకత సంపాదించుకున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రత్యేక హోదా కోసం లోక్సభలో రామ్మోహన్ నాయుడు పోరాడారు. సభలో ఆయన స్పీచ్లు ఏపీలో జనాలను ఉర్రూతలూగించాయి. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, అరాచకం మీద.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళం వినిపించారు. ఇలాంటి యంగ్ అండ్ డేరింగ్ నేత ఎంపీగా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు.
వరుసగా మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా గెలిచేందుకు టీడీపీ నాయకుడు రామ్మోహన్ నాయుడు రంగం సిద్ధం చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన విజయాన్ని వైసీపీ అడ్డుకోలేదని టాక్.
రామ్మోహన్ నాయుడికి పోటీగా వైసీపీ నుంచి పేరాడ తిలక్, కాంగ్రెస్ తరపున పేడాడ పరమేశ్వరరావు బరిలో ఉన్నారు. కానీ వీళ్లిద్దరూ రామ్మోహన్కు అసలు పోటీనే కాదని చెప్పాలి. వైసీపీపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత రామ్మోహన్కు మరింతగా కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
2019లో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అయిదు చోట్ల గెలిచింది. అయినా జగన్ వేవ్ను తట్టుకుని రామ్మోహన్ ఎంపీ సీటు నిలబెట్టుకున్నారు. అలాంటిది ఈ సారి వైసీపీకి ఓటమి తప్పదనే అంచనాల నేపథ్యంలో రామ్మోహన్ విజయం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ సీట్లు దక్కకపోవడంతో కాస్త అసంతృప్తితో ఉన్న ఇక్కడి టీడీపీ నాయకులను బుజ్జగించి రామ్మోహన్ దారిలోకి తెచ్చుకున్నారు. మరోవైపు వైసీపీలో వర్గపోరు కూడా ఆయనకు కలిసి రానుంది. ముఖ్యంగా ధర్మాన కుటుంబంలో వైసీపీ నాయకులున్నా.. లోలోపల మాత్రం రామ్మోహన్కు మద్దతు ఉందనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on May 11, 2024 2:17 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…