లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేకత సంపాదించుకున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రత్యేక హోదా కోసం లోక్సభలో రామ్మోహన్ నాయుడు పోరాడారు. సభలో ఆయన స్పీచ్లు ఏపీలో జనాలను ఉర్రూతలూగించాయి. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, అరాచకం మీద.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళం వినిపించారు. ఇలాంటి యంగ్ అండ్ డేరింగ్ నేత ఎంపీగా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు.
వరుసగా మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా గెలిచేందుకు టీడీపీ నాయకుడు రామ్మోహన్ నాయుడు రంగం సిద్ధం చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన విజయాన్ని వైసీపీ అడ్డుకోలేదని టాక్.
రామ్మోహన్ నాయుడికి పోటీగా వైసీపీ నుంచి పేరాడ తిలక్, కాంగ్రెస్ తరపున పేడాడ పరమేశ్వరరావు బరిలో ఉన్నారు. కానీ వీళ్లిద్దరూ రామ్మోహన్కు అసలు పోటీనే కాదని చెప్పాలి. వైసీపీపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత రామ్మోహన్కు మరింతగా కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
2019లో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అయిదు చోట్ల గెలిచింది. అయినా జగన్ వేవ్ను తట్టుకుని రామ్మోహన్ ఎంపీ సీటు నిలబెట్టుకున్నారు. అలాంటిది ఈ సారి వైసీపీకి ఓటమి తప్పదనే అంచనాల నేపథ్యంలో రామ్మోహన్ విజయం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ సీట్లు దక్కకపోవడంతో కాస్త అసంతృప్తితో ఉన్న ఇక్కడి టీడీపీ నాయకులను బుజ్జగించి రామ్మోహన్ దారిలోకి తెచ్చుకున్నారు. మరోవైపు వైసీపీలో వర్గపోరు కూడా ఆయనకు కలిసి రానుంది. ముఖ్యంగా ధర్మాన కుటుంబంలో వైసీపీ నాయకులున్నా.. లోలోపల మాత్రం రామ్మోహన్కు మద్దతు ఉందనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on May 11, 2024 2:17 pm
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…