Political News

ప‌వ‌న్‌తో పొత్తుకు జ‌గ‌న్ ఆరాటం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌రం హోరాహోరీగా సాగుతోంది. మే 13న జ‌రిగే పోలింగ్‌తో పార్టీల రాజ‌కీయ జీవితాలు ముడిప‌డి ఉన్నాయి. అధికారం నిల‌బెట్టుకోవ‌డం కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. కుటుంబ విష‌యాల‌నూ ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శిస్తున్నారు. ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై హ‌ద్దు మీరి మ‌రీ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇప్పుడు ప‌వ‌న్‌పై ఇన్ని మాట‌లంటున్న జ‌గ‌న్‌.. ఒక‌ప్పుడు ఆయ‌న‌తో పొత్తు కోసం ప్రయ‌త్నించారు. 2019 ఎన్నిక‌లకు ముందు జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్దామ‌ని అనుకున్నారు. కానీ అందుకు ప‌వ‌న్ ఒప్పుకోలేదు. ఈ విష‌యాన్ని తాజాగా ప‌వ‌న్ బ‌య‌ట‌పెట్టారు. ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ మాట్లాడుతూ ఈ విష‌యాలు వెల్ల‌డించారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌తో పొత్తు కోసం వైసీపీ నేత‌లు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని ప‌వ‌న్ చెప్పారు. పొత్తు కుదుర్చేందుకు చాలా మంది మ‌ధ్య‌వ‌ర్తులు ప్ర‌య‌త్నించార‌న్నారు. కానీ తాను ఆ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించాన‌ని తెలిపారు. వైసీపీతో పొత్తుకు స‌సేమీరా అన్న‌ట్లు పేర్కొన్నారు.

అంతే కాకుండా ఈ ఎన్నిక‌ల నేప‌థ్యంలోనూ ప‌వ‌న్‌తో పొత్తు కోసం జ‌గ‌న్ ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిసింది. ఈ ఎన్నిక‌ల‌కు ముందు కూడా ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని, కానీ తానే దేనికీ స్పందించ‌లేద‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. దీంతో ప‌వ‌న్‌తో పొత్తుకు జ‌గ‌న్ ఎంత‌లా ఆరాట‌ప‌డ్డారో అనేది అర్థ‌మ‌వుతోంది. అధికారంలోకి రావ‌డం కోసం ప‌వ‌న్‌తో క‌లిసి న‌డవాల‌ని జ‌గ‌న్ ఆశ‌ప‌డ్డ‌ట్లు తెలిసింది. కానీ కుద‌ర‌లేదు. 2019లో ఒంట‌రిగానే పోటీ చేసిన జ‌గ‌న్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. కానీ ఈ సారి మాత్రం వైసీపీకి ఓట‌మి త‌ప్ప‌ద‌నే అంచ‌నాలున్నాయి. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిదే విజ‌య‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

This post was last modified on May 10, 2024 5:41 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

1 hour ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

1 hour ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

1 hour ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

2 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

2 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

2 hours ago