Political News

ఉద్యోగులు పోటెత్తారు.. క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. !

ఏపీలో ఉద్యోగులు గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఓటెత్తారు. మొత్తం ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్న ఉద్యోగులు.. ఏకంగా 4.32 ల‌క్ష‌ల మందికి పైగా తమ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇదేమీ చిన్న విష‌యం కాదు. ఒక‌ర‌కంగా.. 98 శాతం మంది ఉద్యోగులు ఓటేశారు. మొత్తంగా పోస్ట‌ల్ బ్యాలెట్ ప్రక్రియ అయితే.. ఏపీలో ముగిసింది. మిగిలిన ఒక‌టి అరా ఉంటే.. త‌ర్వాత‌.. వేసుకునే అవ‌కాశం ఉంది. అయితే.. ఇంత మంది పోటెత్త‌డం అంటే.. ఇదంతా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త అనేది విప‌క్షం మాట‌.

ఇది నిజ‌మే కావొచ్చు. ఒక్కొక్క‌సారి ప్ర‌భుత్వంపై వ్య‌తిర‌క‌త ఉన్న‌ప్పుడు.. ఇలానే పోటెత్తుతారు. అయితే.. అలాగ‌ని ఇది పూర్తిగా నిజ‌మ‌ని కూడా చెప్ప‌లేం. ఎందుకంటే.. జ‌గ‌న్ హ‌యాంలోనూ.. వివిధ రూపాల్లో ప్ర‌భుత్వ ఉద్యోగం పొందిన వారు ఉన్నారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ఎడ్మిన్‌లుగా.. కార్య‌ద‌ర్శులుగా ఏకంగా 1.32 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వైద్య‌, విద్య రంగాల్లోనూ 22 వేల మంది ఉద్యోగాలు పొందారు. ఇతర శాఖ‌ల్లోనూ మొత్తంగా 40 వేల మంది ఉద్యోగాలు పొందారు.

వీరంతా కూడా.. వైసీపీకి వ్య‌తిరేకంగా ఓటేస్తారా? ఆ అవ‌స‌రంఉందా? అనేది ప్ర‌శ్న‌. ఉంద‌ని కొంద‌రు చెబుతున్నారు. స‌మ‌యానికి జీతాలు ఇవ్వ‌క‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఇది అయ్యే అవ‌కాశం ఉంది. ఇక‌, ఉపాధ్యాయులు పూర్తిగా వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులు త‌మ పింఛ‌ను ర‌ద్దు చేయ‌లేద‌న్న ఆగ్ర‌హంతో ఉన్నారు. దీంతో ఈ రెండు వ‌ర్గాల వారు కూడా.. పెద్ద ఎత్తున ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

అయితే.. ఎవ‌రికి అనుకూలంగా వేశార‌నేది ఇప్పటి వ‌ర‌కు ఇత‌మిత్థంగా తెలియ‌డం లేదు. అయితే.. సీపీఎస్ ర‌ద్దు విష‌యంలో కొంత మేర‌కు సానుకూలంగా స్పందించిన జ‌న‌సేన వైపు ఎక్కువ‌గా ఉన్నార‌ని ఒక టాక్‌. అదేవిధంగా చంద్ర‌బాబు వ‌స్తే.. త‌మ‌కు రాజ‌ధాని ఏర్ప‌డుతుంద‌ని.. తమ వారికి ఉపాధి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్న ఉద్యోగులు ఈ వైపు నిల‌బ‌డ్డార‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఏదేమైనా.. భారీ సంఖ్య‌లో పోస్ట‌ల్ బ్యాలెట్ న‌మోదు కావ‌డం మాత్రం ఆస‌క్తిగా మారింది. జూన్ 4న వీటిని లెక్కించ‌నున్నారు.

This post was last modified on May 10, 2024 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

30 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago