ఏపీలో ఉద్యోగులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటెత్తారు. మొత్తం లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగులు.. ఏకంగా 4.32 లక్షల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ఒకరకంగా.. 98 శాతం మంది ఉద్యోగులు ఓటేశారు. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అయితే.. ఏపీలో ముగిసింది. మిగిలిన ఒకటి అరా ఉంటే.. తర్వాత.. వేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఇంత మంది పోటెత్తడం అంటే.. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత అనేది విపక్షం మాట.
ఇది నిజమే కావొచ్చు. ఒక్కొక్కసారి ప్రభుత్వంపై వ్యతిరకత ఉన్నప్పుడు.. ఇలానే పోటెత్తుతారు. అయితే.. అలాగని ఇది పూర్తిగా నిజమని కూడా చెప్పలేం. ఎందుకంటే.. జగన్ హయాంలోనూ.. వివిధ రూపాల్లో ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎడ్మిన్లుగా.. కార్యదర్శులుగా ఏకంగా 1.32 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వైద్య, విద్య రంగాల్లోనూ 22 వేల మంది ఉద్యోగాలు పొందారు. ఇతర శాఖల్లోనూ మొత్తంగా 40 వేల మంది ఉద్యోగాలు పొందారు.
వీరంతా కూడా.. వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారా? ఆ అవసరంఉందా? అనేది ప్రశ్న. ఉందని కొందరు చెబుతున్నారు. సమయానికి జీతాలు ఇవ్వకపోవడం ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇది అయ్యే అవకాశం ఉంది. ఇక, ఉపాధ్యాయులు పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులు తమ పింఛను రద్దు చేయలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఈ రెండు వర్గాల వారు కూడా.. పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అయితే.. ఎవరికి అనుకూలంగా వేశారనేది ఇప్పటి వరకు ఇతమిత్థంగా తెలియడం లేదు. అయితే.. సీపీఎస్ రద్దు విషయంలో కొంత మేరకు సానుకూలంగా స్పందించిన జనసేన వైపు ఎక్కువగా ఉన్నారని ఒక టాక్. అదేవిధంగా చంద్రబాబు వస్తే.. తమకు రాజధాని ఏర్పడుతుందని.. తమ వారికి ఉపాధి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్న ఉద్యోగులు ఈ వైపు నిలబడ్డారనే అంచనాలు ఉన్నాయి. ఏదేమైనా.. భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ నమోదు కావడం మాత్రం ఆసక్తిగా మారింది. జూన్ 4న వీటిని లెక్కించనున్నారు.
This post was last modified on May 10, 2024 3:39 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…