బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు ముందు కేసీఆర్కు వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఒకట్రెండు సీట్లు గెలిచే అవకాశాలూ లేవనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమో.. కేసీఆర్కు అన్ని రకాలుగా స్ట్రోక్ ఇస్తోంది. తాజాగా తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరడం సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శరీరానికి నిప్పు అంటించుకుని చనిపోయిన శ్రీకాంత్ చారి తల్లి ఇప్పుడు కేసీఆర్ను కాదనడం హాట్ టాపిక్ అయింది.
ఉద్యమకారులు గుడ్బై చెబుతుండటంతో ఏకాకిగా కేసీఆర్ మిగిలిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమకారులను పట్టించుకోని కేసీఆర్కు వాళ్ల ఉసురు తగులుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2014లో తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దెనెక్కాననే అహంకారంతో ఉద్యమకారులను కేసీఆర్ అవమానించారనే విమర్శలున్నాయి. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ ద్రోహులను పిలిచి మరీ పక్కన పెట్టుకున్నారు. దీంతో ప్రొఫెసర్ కోదండరాం లాంటి అసలైన ఉద్యమ కారులు కేసీఆర్కు దూరమయ్యారు.
రెండో సారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఉద్యమాలనే అణగదొక్కారనే విమర్శలున్నాయి. దీంతో తెలంగాణ ఉద్యమ కారులు కేసీఆర్పైనే వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇక గత ఎన్నికల్లో ఓటమితో భంగపడ్డ కేసీఆర్ ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోతున్నారనే చెప్పాలి. గత కొంతకాలంగా బీఆర్ఎస్పై శంకరమ్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శ్రీకాంత్ చారి మరణానికి విలువ ఇవ్వని కేసీఆర్.. ఉద్యమ ద్రోహులకు ప్రాధాన్యత ఇవ్వడం ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించింది. భువనగిరి ఎంపీ టికెట్ ఆశించినా కేసీఆర్ తిరస్కరించారు. గతంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పట్టించుకోలేదు. దీంతో ఆమె తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్రమిచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ చేరానని చెప్పారు. శంకరమ్మకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on May 10, 2024 3:36 pm
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…