బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు ముందు కేసీఆర్కు వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఒకట్రెండు సీట్లు గెలిచే అవకాశాలూ లేవనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమో.. కేసీఆర్కు అన్ని రకాలుగా స్ట్రోక్ ఇస్తోంది. తాజాగా తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరడం సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శరీరానికి నిప్పు అంటించుకుని చనిపోయిన శ్రీకాంత్ చారి తల్లి ఇప్పుడు కేసీఆర్ను కాదనడం హాట్ టాపిక్ అయింది.
ఉద్యమకారులు గుడ్బై చెబుతుండటంతో ఏకాకిగా కేసీఆర్ మిగిలిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమకారులను పట్టించుకోని కేసీఆర్కు వాళ్ల ఉసురు తగులుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2014లో తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దెనెక్కాననే అహంకారంతో ఉద్యమకారులను కేసీఆర్ అవమానించారనే విమర్శలున్నాయి. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ ద్రోహులను పిలిచి మరీ పక్కన పెట్టుకున్నారు. దీంతో ప్రొఫెసర్ కోదండరాం లాంటి అసలైన ఉద్యమ కారులు కేసీఆర్కు దూరమయ్యారు.
రెండో సారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఉద్యమాలనే అణగదొక్కారనే విమర్శలున్నాయి. దీంతో తెలంగాణ ఉద్యమ కారులు కేసీఆర్పైనే వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇక గత ఎన్నికల్లో ఓటమితో భంగపడ్డ కేసీఆర్ ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోతున్నారనే చెప్పాలి. గత కొంతకాలంగా బీఆర్ఎస్పై శంకరమ్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శ్రీకాంత్ చారి మరణానికి విలువ ఇవ్వని కేసీఆర్.. ఉద్యమ ద్రోహులకు ప్రాధాన్యత ఇవ్వడం ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించింది. భువనగిరి ఎంపీ టికెట్ ఆశించినా కేసీఆర్ తిరస్కరించారు. గతంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పట్టించుకోలేదు. దీంతో ఆమె తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్రమిచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ చేరానని చెప్పారు. శంకరమ్మకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on May 10, 2024 3:36 pm
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్యపై సీఎం…
ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చినది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రమోషన్ల పరంగా ఒక అడుగు ముందుకు వేస్తోంది.…
విజయవాడ ప్రస్తుత ఎంపీ.. కేశినేని చిన్ని(శివనాథ్), మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) ఇద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములు. రాజకీయంగా వైరం లేకపోయినా..…
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు…
దేశాన్ని కుదిపేసిన పెహల్గామ్ దుర్ఘటన పట్ల చిన్నా పెద్దా ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. సినీ పరిశ్రమ నుంచి…
ప్రేక్షకులను బాలీవుడ్ మేకర్స్ ఎలా ఊహించుకుంటున్నారో కానీ కొన్ని సినిమాలు ప్రకటనల స్టేజి దగ్గరే నవ్వు తెప్పిస్తున్నాయి. నిన్న కార్తీక్…