Political News

దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గాలు !

దేశంలో 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న రాజకీయ విశ్లేషకులు, ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదనే ఉంది. ఇందులో రాహుల్ గాంధీ పోటీ చేసిన వాయనాడ్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పోటీ చేసిన కోయంబత్తూర్, తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి పోటీ చేసిన తమిళిసై చెన్నైసౌత్, ఓవైసీ మీద బీజేపీ అభ్యర్థి మాధవీలత పోటీ చేస్తున్న హైదరాబాద్ నియోజకవర్గాలతో పాటు, సంచలనం రేపిన సెక్స్ స్కాండల్ వివాదం నేపథ్యంలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ హసన్ నియోజకవర్గం చేరింది.

దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే మూడు విడ‌త‌ల్లో 283 స్థానాల‌లో పోలింగ్ ప్రక్రియ పూర్త‌యింది. మ‌రో 4 విడ‌త‌ల్లో మిగిలిన స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ నెల 13న దేశ వ్యాప్తంగా నాలుగో విడ‌తలో భాగంగా 96 లోక్ స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఒకే విడతలో ఎన్నికలు ముగియనున్నాయి. ఇందులో ఏపీలో 175 శాసనసభ, 25 లోక్ సభ స్థానాలు ఉండగా, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో హైదరాబాద్ లోక్ సభ స్థానం ఉండడం విశేషం.

రాహుల్ కేరళ నుండి పోటీ చేసిన వాయనాడ్, తమిళనాడు నుండి తమిళిసై పోటీ చేసిన చెన్నై సౌత్, అక్కడి బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పోటీ చేసిన కోయంబత్తూరు స్థానాలతో పాటు దేవెగౌడ మనవడు పోటీ చేసిన హసన్ స్థానాలలో పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. హైదరాబాద్ స్థానానికి ఈ నెల 13న ఎన్నిక జరగనుంది. ఇక్కడ భారీ ఎత్తున ఓట్లు తొలగించడం, మాధవీలత ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకర్షిస్తుండడం అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నది. నాలుగు దశబ్దాలుగా ఓవైసీల చేతిలో ఉన్న హైదరాబాద్ కంచుకోటను మాధవీలత బద్దలు కొట్టగలదా అన్న చర్చ నడుస్తున్నది.

ఇక వాయనాడ్ లో పోటీ చేసిన రాహుల్ గాంధీ తిరిగి ఈ సారి గతంలో యూపీ నుండి ఓడిపోయిన అమేథీ నుండి కాకుండా తన తల్లి ఖాళీ చేసిన రాయ్ బరేలీ నుండి పోటీ చేయడం చర్చకు దారితీసింది. మరి రెండింట్లో నెగ్గితే రాహుల్ దేన్ని ఎంచుకుంటాడు ? వాయనాడ్ లో ఇంతకు గెలుస్తాడా ? లేడా ? అన్న చర్చ నడుస్తున్నది. వాయనాడ్ లో రాహుల్ కు పోటీగా సీపీఎం నుండి అన్నీ రాజా, బీజేపీ నుండి ఆ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ లు గట్టి పోటీ ఇచ్చారు.

ఏకంగా గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళిసై పోటీ చేసిన చెన్నై సౌత్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పోటీ చేసిన కోయంబత్తూరులు అందరినీ ఆకర్షించడం ఇప్పటి వరకు తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవకపోవడమే. ఈసారైనా ప్రభావం చూపుతుందా అని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. కర్ణాటక హసన్ లో ఎన్నికలు ముగియగానే దేశం దాటిన ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం దుమారం రేపుతున్నది. ఈ నేపథ్యంలో ఇది కూడా హాట్ సీట్ గా మారింది. మరి ప్రజల తీర్పు ఎలా ఉందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

This post was last modified on May 11, 2024 8:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

51 minutes ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

52 minutes ago

‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…

1 hour ago

సమయం మించిపోతోంది స్వయంభు

ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త  రిలీజ్…

2 hours ago

డెకాయిట్ ఎత్తులు దేనికోసం?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…

3 hours ago

సామాన్యుల సమస్యలపై మాట్లాడే ఎంపీకు సొంత పార్టీ షాక్

రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…

3 hours ago