ఏపీలోని జగన్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సంచలన లేఖ రాసింది. ఒక్కసారిగా ప్రభుత్వానికి ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? అని ప్రశ్నించింది. అంతేకాదు.. దీనికి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలలోగా సమాధానం చెప్పాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ మళ్లీ లేఖ రాయడం సంచలనంగా మారింది. అంతేకాదు.. లబ్ధి దారులకు ఈ రోజే(శుక్రవారం) నగదు ఇవ్వకపోతే ఏం అవుతుందో వివరించాలని కోరింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాదీవెన.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, చేయూత, ఆసరా పధకాలకు సంబంధించిన నిధుల పంపణీ వ్యవహారం.. ప్రభుత్వానికి-కేంద్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ నిధులు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే.. ఇవి ఎప్పటి నుంచో అమలవుతున్న పథకాలని.. కాబట్టి పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ తర్వాత.. కేంద్ర ఎన్నికల సంఘం తన మనసు మార్చుకుని.. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత.. పంపిణీ చేయొచ్చని తేల్చి చెప్పింది. అయితే.. ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు.. 10వ తేదీ ఒక్కరోజు వరకు సర్కారుకు అనుమతి ఇస్తూ.. తీర్పు వెలువరించింది. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి పథకాల లబ్ధి దారులకు 14 వేల కోట్ల రూపాయల పంపిణీ ప్రారంభమైంది. దీంతో వైసీపీ కొంత సంతోషం వ్యక్తం చేసింది.
అయితే.. ఇంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మరో లేఖ వచ్చింది. జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు ఇప్పటి వరకు నగదు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తూ.. సుదీర్ఘ లేఖ రాసింది. అంతేకాదు.. సర్కారు.. ఆర్థిక పరిస్థితి చెప్పండని కూడా ఈసీ ప్రశ్నించింది. మరి దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.
This post was last modified on May 10, 2024 6:42 pm
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…