Political News

అంత డ‌బ్బు ఎలా వ‌చ్చింది?: ఈసీ ప్ర‌శ్న‌

ఏపీలోని జ‌గ‌న్‌ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా సంచ‌ల‌న లేఖ రాసింది. ఒక్క‌సారిగా ప్ర‌భుత్వానికి ఇంత డ‌బ్బు ఎక్క‌డినుంచి వ‌చ్చింది? అని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. దీనికి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌లోగా స‌మాధానం చెప్పాల‌ని కూడా ఆదేశించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ మళ్లీ లేఖ రాయడం సంచ‌ల‌నంగా మారింది. అంతేకాదు.. ల‌బ్ధి దారుల‌కు ఈ రోజే(శుక్రవారం) నగదు ఇవ్వకపోతే ఏం అవుతుందో వివ‌రించాల‌ని కోరింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విద్యాదీవెన‌.. రైతుల‌కు ఇన్‌పుట్ స‌బ్సిడీ, చేయూత‌, ఆస‌రా ప‌ధ‌కాలకు సంబంధించిన నిధుల పంప‌ణీ వ్య‌వ‌హారం.. ప్ర‌భుత్వానికి-కేంద్ర ఎన్నికల సంఘానికి మ‌ధ్య వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఈ నిధులు పంపిణీ చేయొద్ద‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. అయితే.. ఇవి ఎప్ప‌టి నుంచో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ని.. కాబ‌ట్టి పంపిణీ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం కోర్టును ఆశ్ర‌యించింది.

ఈ క్ర‌మంలో సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత‌.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌న మ‌న‌సు మార్చుకుని.. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పంపిణీ చేయొచ్చ‌ని తేల్చి చెప్పింది. అయితే.. ప్ర‌భుత్వ వాద‌న‌లు విన్న హైకోర్టు.. 10వ తేదీ ఒక్క‌రోజు వ‌ర‌కు స‌ర్కారుకు అనుమ‌తి ఇస్తూ.. తీర్పు వెలువ‌రించింది. దీంతో శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి ప‌థ‌కాల ల‌బ్ధి దారుల‌కు 14 వేల కోట్ల రూపాయ‌ల పంపిణీ ప్రారంభ‌మైంది. దీంతో వైసీపీ కొంత సంతోషం వ్య‌క్తం చేసింది.

అయితే.. ఇంత‌లోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి మ‌రో లేఖ వ‌చ్చింది. జనవరిలో బ‌ట‌న్ నొక్కిన‌ పథకాలకు ఇప్పటి వరకు నగదు ఎందుకు ఇవ్వ‌లేదు? ఇప్పుడు మీకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తూ.. సుదీర్ఘ లేఖ రాసింది. అంతేకాదు.. స‌ర్కారు.. ఆర్థిక పరిస్థితి చెప్పండని కూడా ఈసీ ప్ర‌శ్నించింది. మ‌రి దీనిపై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎలాంటి స‌మాధానం ఇస్తారో చూడాలి.

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

20 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

1 hour ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago