Political News

అంత డ‌బ్బు ఎలా వ‌చ్చింది?: ఈసీ ప్ర‌శ్న‌

ఏపీలోని జ‌గ‌న్‌ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా సంచ‌ల‌న లేఖ రాసింది. ఒక్క‌సారిగా ప్ర‌భుత్వానికి ఇంత డ‌బ్బు ఎక్క‌డినుంచి వ‌చ్చింది? అని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. దీనికి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌లోగా స‌మాధానం చెప్పాల‌ని కూడా ఆదేశించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ మళ్లీ లేఖ రాయడం సంచ‌ల‌నంగా మారింది. అంతేకాదు.. ల‌బ్ధి దారుల‌కు ఈ రోజే(శుక్రవారం) నగదు ఇవ్వకపోతే ఏం అవుతుందో వివ‌రించాల‌ని కోరింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విద్యాదీవెన‌.. రైతుల‌కు ఇన్‌పుట్ స‌బ్సిడీ, చేయూత‌, ఆస‌రా ప‌ధ‌కాలకు సంబంధించిన నిధుల పంప‌ణీ వ్య‌వ‌హారం.. ప్ర‌భుత్వానికి-కేంద్ర ఎన్నికల సంఘానికి మ‌ధ్య వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఈ నిధులు పంపిణీ చేయొద్ద‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. అయితే.. ఇవి ఎప్ప‌టి నుంచో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ని.. కాబ‌ట్టి పంపిణీ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం కోర్టును ఆశ్ర‌యించింది.

ఈ క్ర‌మంలో సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత‌.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌న మ‌న‌సు మార్చుకుని.. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పంపిణీ చేయొచ్చ‌ని తేల్చి చెప్పింది. అయితే.. ప్ర‌భుత్వ వాద‌న‌లు విన్న హైకోర్టు.. 10వ తేదీ ఒక్క‌రోజు వ‌ర‌కు స‌ర్కారుకు అనుమ‌తి ఇస్తూ.. తీర్పు వెలువ‌రించింది. దీంతో శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి ప‌థ‌కాల ల‌బ్ధి దారుల‌కు 14 వేల కోట్ల రూపాయ‌ల పంపిణీ ప్రారంభ‌మైంది. దీంతో వైసీపీ కొంత సంతోషం వ్య‌క్తం చేసింది.

అయితే.. ఇంత‌లోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి మ‌రో లేఖ వ‌చ్చింది. జనవరిలో బ‌ట‌న్ నొక్కిన‌ పథకాలకు ఇప్పటి వరకు నగదు ఎందుకు ఇవ్వ‌లేదు? ఇప్పుడు మీకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తూ.. సుదీర్ఘ లేఖ రాసింది. అంతేకాదు.. స‌ర్కారు.. ఆర్థిక పరిస్థితి చెప్పండని కూడా ఈసీ ప్ర‌శ్నించింది. మ‌రి దీనిపై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎలాంటి స‌మాధానం ఇస్తారో చూడాలి.

This post was last modified on May 10, 2024 6:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

2 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

3 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

3 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

4 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

4 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

8 hours ago