ఏపీలోని జగన్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సంచలన లేఖ రాసింది. ఒక్కసారిగా ప్రభుత్వానికి ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? అని ప్రశ్నించింది. అంతేకాదు.. దీనికి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలలోగా సమాధానం చెప్పాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ మళ్లీ లేఖ రాయడం సంచలనంగా మారింది. అంతేకాదు.. లబ్ధి దారులకు ఈ రోజే(శుక్రవారం) నగదు ఇవ్వకపోతే ఏం అవుతుందో వివరించాలని కోరింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాదీవెన.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, చేయూత, ఆసరా పధకాలకు సంబంధించిన నిధుల పంపణీ వ్యవహారం.. ప్రభుత్వానికి-కేంద్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ నిధులు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే.. ఇవి ఎప్పటి నుంచో అమలవుతున్న పథకాలని.. కాబట్టి పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ తర్వాత.. కేంద్ర ఎన్నికల సంఘం తన మనసు మార్చుకుని.. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత.. పంపిణీ చేయొచ్చని తేల్చి చెప్పింది. అయితే.. ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు.. 10వ తేదీ ఒక్కరోజు వరకు సర్కారుకు అనుమతి ఇస్తూ.. తీర్పు వెలువరించింది. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి పథకాల లబ్ధి దారులకు 14 వేల కోట్ల రూపాయల పంపిణీ ప్రారంభమైంది. దీంతో వైసీపీ కొంత సంతోషం వ్యక్తం చేసింది.
అయితే.. ఇంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మరో లేఖ వచ్చింది. జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు ఇప్పటి వరకు నగదు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తూ.. సుదీర్ఘ లేఖ రాసింది. అంతేకాదు.. సర్కారు.. ఆర్థిక పరిస్థితి చెప్పండని కూడా ఈసీ ప్రశ్నించింది. మరి దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…