ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లగడపాటి రాజగోపాల్ ది ప్రత్యేక స్థానం. 2004, 2009 లోక్ సభ ఎన్నికలలో విజయవాడ నుండి పోటీ చేసి విజయం సాధించిన లగడపాటి 2014 ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిరసిస్తూ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూనే వస్తున్నాడు. ప్రతి సారి ఎన్నికలప్పుడు, ఎన్నికలకు ముందు లగడపాటి తిరిగి రాజకీయాల్లో వస్తారని ప్రచారం నడుస్తుండేది. కానీ ఈ సారి ఆంధ్రా రాజకీయాలలో కనీసం లగడపాటి ప్రస్తావన రాకపోవడం చర్చానీయాంశంగా మారింది.
రాజకీయాలకు దూరంగా ఉన్నా 2018 తెలంగాణ ఎన్నికలలో, 2019 ఏపీ లోక్ సభ, శాసనసభ ఎన్నికలపై లగడపాటి సర్వే ఫలితాలు విడుదుల చేశాడు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు కూటమికి 65 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 35, ఇతరులకు 14 స్థానాలు వస్తాయని లగడపాటి ప్రకటించాడు. అతని అంచనాలను తలకిందులు చేస్తూ 88 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అంతకుముందు 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని లగడపాటి చెప్పిన జోస్యం నిజమయింది. అదే విధంగా ఆంధ్రాలో టీడీపీ – బీజేపీ కూటమి 115 స్థానాలతో అధికారంలోకి వస్తుందని చెప్పాడు. దానికి కొంచె తక్కువగా 103 టీడీపీ, 4 స్థానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చాయి.
2019 ఏపీ ఎన్నికలలో టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని లగడపాటి జోస్యం చెప్పాడు. టీడీపీ 90 నుండి 100 స్థానాలు గెలుచుకుంటుందని, వైసీపీ 72 స్థానాల వరకు విజయం సాధిస్తుందని అంచనా వేశాడు. దానికి భిన్నంగా వైసీపీ 151 స్థానాలు గెలవగా, టీడీపీ 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.
తన సంచలన సర్వేలతో ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ ఈ ఏడాది జనవరిలో కాకినాడ శుభకార్యానికి వెళ్తూ మీడియాతో చివరిసారిగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం మూలంగా తాను రాజీనామా చేశానని, భవిష్యత్ లో తాను రాజకీయాలలోకి రానని లగడపాటి ఉద్ఘాటించాడు. అదే సమయంలో మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ లు ఇద్దరూ తనకు సన్నిహితులు అని, వారు ఎక్కడ పోటీ చేసినా రాజకీయాలకు అతీతంగా తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు. ఆ తర్వాత అతను మళ్లీ వార్తలలోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో ఎన్నికలు కేవలం మూడు రోజుల దూరంలో ఉన్న నేపథ్యంలో లగడపాటి ఎక్కడ అన్న చర్చ రాజకీయ వర్గాలలో వస్తున్నది.
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…