Political News

కూటమిలో వైసీపీకి మింగుపడని రీతిలో కో ఆర్డినేషన్

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదురకూడదని వైసీపీ ఎంత బలంగా కోరుకుందో తెలిసిందే. కానీ అది జరగలేదు. పైగా ఈ రెండు పార్టీలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేజీ కూడా తోడవడంతో కూటమి బలం ఇంకా పెరిగింది. ఇది వైసీపీలో గుబులు పుట్టిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ వల్ల ఓట్ల పరంగా జరిగే లాభం కంటే.. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు చేయకుండా అడ్డుకోవడం ద్వారా జరిగే మేలు ఎక్కువని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి.

ఈ సంగతిలా ఉంచితే.. పొత్తు కుదురుతున్న సమయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులను రెచ్చగొట్టడానికి వైసీపీ వాళ్లు చేయని ప్రయత్నం లేదు. ఎలాగైనా పొత్తును విచ్ఛిన్నం చేయాలని చూశారు. పొత్తు కుదిరాక కూడా సీట్ల పంపిణీ విషయంలో జనసేనకు అన్యాయం జరిగిందంటూ మొసలి కన్నీరు కారుస్తూ జనసైనికులను ఎగతాళి చేయడం, రెచ్చగొట్టడం లాంటివి గట్టిగా చేశారు. ఈ క్రమంలో జనసైనికులు కొందరు ఆవేశపడడం.. టీడీపీ వాళ్లు వారిని కౌంటర్ చేయడం లాంటి పరిణామాలు జరిగాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ప్రచారంలో, ఎన్నికల్లో సఖ్యతతో మెలుగుతాయా లేదా అన్న సందేహాలు కలిగాయి.

మరోవైపు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే టీడీపీ వాళ్లు ఆ పార్టీతో ఎలా వ్యవహరిస్తారో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పొత్తు కుదిరినా మూడు పార్టీల మధ్య ఓటు బదిలీ అనుకున్న స్థాయిలో జరగదని.. ఇది తమకు మేలు చేస్తుందని వైసీపీ శ్రేణులు ఆశించాయి. కానీ ఇటు సోషల్ మీడియాలో, అటు గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య గొడవలు, వాగ్వాదాలు కొన్ని రోజుల వరకే సాగాయి.

ఎన్నికలకు మూడు వారాల ముందు నుంచి మొత్తం వ్యవహారం సద్దుమణిగిన పరిస్థితే కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో మూడు పార్టీల వాళ్లు కలిసి సమన్వయంతో సాగుతున్నారు. సోషల్ మీడియాలో కూడా యుద్ధాలు ఆగిపోయాయి. తమలో తాము కలహించుకుంటే వైసీపీకే మేలు చేసినట్లు అవుతుందని.. అందరి లక్ష్యం జగన్‌ను ఓడించడమే కావాలని మూడు పార్టీల వాళ్లు ఒక లక్ష్యంతో పని చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే ఎన్నికల్లో కూడా ప్రతిఫలించి సమన్వయంతో సాగితే కూటమి కోరుకున్న ఫలితాలు రాబట్టడం తథ్యం.

This post was last modified on May 10, 2024 7:38 am

Share
Show comments

Recent Posts

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

43 minutes ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

1 hour ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

4 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

5 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

6 hours ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

8 hours ago