Political News

కూటమిలో వైసీపీకి మింగుపడని రీతిలో కో ఆర్డినేషన్

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదురకూడదని వైసీపీ ఎంత బలంగా కోరుకుందో తెలిసిందే. కానీ అది జరగలేదు. పైగా ఈ రెండు పార్టీలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేజీ కూడా తోడవడంతో కూటమి బలం ఇంకా పెరిగింది. ఇది వైసీపీలో గుబులు పుట్టిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ వల్ల ఓట్ల పరంగా జరిగే లాభం కంటే.. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు చేయకుండా అడ్డుకోవడం ద్వారా జరిగే మేలు ఎక్కువని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి.

ఈ సంగతిలా ఉంచితే.. పొత్తు కుదురుతున్న సమయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులను రెచ్చగొట్టడానికి వైసీపీ వాళ్లు చేయని ప్రయత్నం లేదు. ఎలాగైనా పొత్తును విచ్ఛిన్నం చేయాలని చూశారు. పొత్తు కుదిరాక కూడా సీట్ల పంపిణీ విషయంలో జనసేనకు అన్యాయం జరిగిందంటూ మొసలి కన్నీరు కారుస్తూ జనసైనికులను ఎగతాళి చేయడం, రెచ్చగొట్టడం లాంటివి గట్టిగా చేశారు. ఈ క్రమంలో జనసైనికులు కొందరు ఆవేశపడడం.. టీడీపీ వాళ్లు వారిని కౌంటర్ చేయడం లాంటి పరిణామాలు జరిగాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ప్రచారంలో, ఎన్నికల్లో సఖ్యతతో మెలుగుతాయా లేదా అన్న సందేహాలు కలిగాయి.

మరోవైపు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే టీడీపీ వాళ్లు ఆ పార్టీతో ఎలా వ్యవహరిస్తారో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పొత్తు కుదిరినా మూడు పార్టీల మధ్య ఓటు బదిలీ అనుకున్న స్థాయిలో జరగదని.. ఇది తమకు మేలు చేస్తుందని వైసీపీ శ్రేణులు ఆశించాయి. కానీ ఇటు సోషల్ మీడియాలో, అటు గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య గొడవలు, వాగ్వాదాలు కొన్ని రోజుల వరకే సాగాయి.

ఎన్నికలకు మూడు వారాల ముందు నుంచి మొత్తం వ్యవహారం సద్దుమణిగిన పరిస్థితే కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో మూడు పార్టీల వాళ్లు కలిసి సమన్వయంతో సాగుతున్నారు. సోషల్ మీడియాలో కూడా యుద్ధాలు ఆగిపోయాయి. తమలో తాము కలహించుకుంటే వైసీపీకే మేలు చేసినట్లు అవుతుందని.. అందరి లక్ష్యం జగన్‌ను ఓడించడమే కావాలని మూడు పార్టీల వాళ్లు ఒక లక్ష్యంతో పని చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే ఎన్నికల్లో కూడా ప్రతిఫలించి సమన్వయంతో సాగితే కూటమి కోరుకున్న ఫలితాలు రాబట్టడం తథ్యం.

This post was last modified on May 10, 2024 7:38 am

Share
Show comments

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

4 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

15 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

16 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

16 hours ago