గోనె ప్రకాశరావు. తరచుగా సీఎం జగన్పైనా.. వైసీపీపైనా నిప్పులు చెరిగే మాజీ వైసీపీ నాయకుడు.. ఒకప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డికి మిత్రుడు. తాజాగా ఈయన ఏపీ పాలిటిక్స్పై సంచలన సర్వే అంటూ ఒకటి విడుదల చేశారు. ప్రస్తుతం ఈయన తెలంగాణలో ఉంటున్నారు. మరి ఆయనకు ఏపీలో ఎక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ.. తాను మాత్రం తెలుసుకున్నట్టు వివరించారు. సరే.. ఎన్నికల వేళ ఏదైనా హాట్ టాపిక్కే కదా! సో.. ఇప్పుడు గోనెవారి సర్వే కూడా.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇంతకీ గోనె ప్రకాశ రావు చెప్పిన లెక్క ప్రకారం.. ఏపీలో కూటమికి తిరుగులేదు.. వైసీపీకి గెలుపు లేదనే! వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని గోనె తెలిపారు. ముఖ్యంగా వైసీపీకి కంచుకోట వంటి సీమలో 52 స్థానాలు(అసెంబ్లీ) ఉంటే.. ఇక్కడ.. ఆ పార్టీకి కేవలం 22-28 సీట్లు వస్తాయని కూటమికి ఏకంగా 24-26 సీట్లు వస్తాయని చెప్పారు. నిజానికి ఇక్కడ కనుక కూటమి ఇన్ని సీట్లు తెచ్చకుంటే.. మిగిలిన రెండు ప్రాంతాల్లో ఆ పార్టీకి తిరుగులేదు.
ఇదే విషయాన్ని గోనె చెప్పారు. కూటమి కొన్నికొన్నిజిల్లాలను క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదన్నారు. అంతేకాదు.. ఏకంగా భారీ మెజారిటీ కూడా దక్కించుకునే స్థానాలు ఉన్నాయన్నారు. విజయవాడ వెస్ట్లో లక్ష మెజారిటీ వచ్చినా.. బీజేపీ ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. విజయవాడ ఎంపీ సీటు టీడీపీదేనన్నారు. కడపలో షర్మిల గెలుపు పక్కా అని తేల్చేశారు. మొత్తంగా కూటమికి 19-21 పార్లమెంటు స్థానాలు, 125-143 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని గోనె చెప్పారు.
జిల్లాల వారీగా ఇలా..
This post was last modified on May 9, 2024 3:41 pm
ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…
‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన…
తమిళ సినిమాల మీద తెలుగు ప్రేక్షకుల ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా అక్కడి నుంచి వచ్చే అనువాద…
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…