గోనె ప్రకాశరావు. తరచుగా సీఎం జగన్పైనా.. వైసీపీపైనా నిప్పులు చెరిగే మాజీ వైసీపీ నాయకుడు.. ఒకప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డికి మిత్రుడు. తాజాగా ఈయన ఏపీ పాలిటిక్స్పై సంచలన సర్వే అంటూ ఒకటి విడుదల చేశారు. ప్రస్తుతం ఈయన తెలంగాణలో ఉంటున్నారు. మరి ఆయనకు ఏపీలో ఎక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ.. తాను మాత్రం తెలుసుకున్నట్టు వివరించారు. సరే.. ఎన్నికల వేళ ఏదైనా హాట్ టాపిక్కే కదా! సో.. ఇప్పుడు గోనెవారి సర్వే కూడా.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇంతకీ గోనె ప్రకాశ రావు చెప్పిన లెక్క ప్రకారం.. ఏపీలో కూటమికి తిరుగులేదు.. వైసీపీకి గెలుపు లేదనే! వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని గోనె తెలిపారు. ముఖ్యంగా వైసీపీకి కంచుకోట వంటి సీమలో 52 స్థానాలు(అసెంబ్లీ) ఉంటే.. ఇక్కడ.. ఆ పార్టీకి కేవలం 22-28 సీట్లు వస్తాయని కూటమికి ఏకంగా 24-26 సీట్లు వస్తాయని చెప్పారు. నిజానికి ఇక్కడ కనుక కూటమి ఇన్ని సీట్లు తెచ్చకుంటే.. మిగిలిన రెండు ప్రాంతాల్లో ఆ పార్టీకి తిరుగులేదు.
ఇదే విషయాన్ని గోనె చెప్పారు. కూటమి కొన్నికొన్నిజిల్లాలను క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదన్నారు. అంతేకాదు.. ఏకంగా భారీ మెజారిటీ కూడా దక్కించుకునే స్థానాలు ఉన్నాయన్నారు. విజయవాడ వెస్ట్లో లక్ష మెజారిటీ వచ్చినా.. బీజేపీ ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. విజయవాడ ఎంపీ సీటు టీడీపీదేనన్నారు. కడపలో షర్మిల గెలుపు పక్కా అని తేల్చేశారు. మొత్తంగా కూటమికి 19-21 పార్లమెంటు స్థానాలు, 125-143 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని గోనె చెప్పారు.
జిల్లాల వారీగా ఇలా..
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…