గోనె ప్రకాశరావు. తరచుగా సీఎం జగన్పైనా.. వైసీపీపైనా నిప్పులు చెరిగే మాజీ వైసీపీ నాయకుడు.. ఒకప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డికి మిత్రుడు. తాజాగా ఈయన ఏపీ పాలిటిక్స్పై సంచలన సర్వే అంటూ ఒకటి విడుదల చేశారు. ప్రస్తుతం ఈయన తెలంగాణలో ఉంటున్నారు. మరి ఆయనకు ఏపీలో ఎక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ.. తాను మాత్రం తెలుసుకున్నట్టు వివరించారు. సరే.. ఎన్నికల వేళ ఏదైనా హాట్ టాపిక్కే కదా! సో.. ఇప్పుడు గోనెవారి సర్వే కూడా.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇంతకీ గోనె ప్రకాశ రావు చెప్పిన లెక్క ప్రకారం.. ఏపీలో కూటమికి తిరుగులేదు.. వైసీపీకి గెలుపు లేదనే! వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని గోనె తెలిపారు. ముఖ్యంగా వైసీపీకి కంచుకోట వంటి సీమలో 52 స్థానాలు(అసెంబ్లీ) ఉంటే.. ఇక్కడ.. ఆ పార్టీకి కేవలం 22-28 సీట్లు వస్తాయని కూటమికి ఏకంగా 24-26 సీట్లు వస్తాయని చెప్పారు. నిజానికి ఇక్కడ కనుక కూటమి ఇన్ని సీట్లు తెచ్చకుంటే.. మిగిలిన రెండు ప్రాంతాల్లో ఆ పార్టీకి తిరుగులేదు.
ఇదే విషయాన్ని గోనె చెప్పారు. కూటమి కొన్నికొన్నిజిల్లాలను క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదన్నారు. అంతేకాదు.. ఏకంగా భారీ మెజారిటీ కూడా దక్కించుకునే స్థానాలు ఉన్నాయన్నారు. విజయవాడ వెస్ట్లో లక్ష మెజారిటీ వచ్చినా.. బీజేపీ ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. విజయవాడ ఎంపీ సీటు టీడీపీదేనన్నారు. కడపలో షర్మిల గెలుపు పక్కా అని తేల్చేశారు. మొత్తంగా కూటమికి 19-21 పార్లమెంటు స్థానాలు, 125-143 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని గోనె చెప్పారు.
జిల్లాల వారీగా ఇలా..
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…