మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అతను వీడియోలు చేసిన సంగతి తెలిసిందే.
కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే రాజేష్ ఆ పార్టీకి పూర్తి వ్యతిరేకిగా మారిపోయారు. వైసీపీకి వ్యతిరేకంగా బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలుస్తూ జనసేనలోకి చేరబోతున్న సంకేతాలు కూడా ఇచ్చాడు ఒక టైంలో.
కానీ తర్వాత అంచనాలకు భిన్నంగా గత ఏడాది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆ పార్టీ తరఫున పి.గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కూడా సంపాదించాడు. కానీ వైసీపీ వాళ్లు అతడి పాత వీడియోలేవో తిప్పి నెగెటివ్ ప్రచారం చేయడంతో కొన్ని రోజులకే టికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది.
ఆ తర్వాత కొన్ని రోజులకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సొంతంగా అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు రాజేష్. కానీ మళ్లీ కొన్ని రోజులకు యుటర్న్ తీసుకుని తెలుగుదేశం పార్టీకే మద్దతు, కూటమి కోసం నిలబడతానని ప్రకటించాడు. ఐతే ఇప్పుడు ఆ స్టాండ్ మీద కూడా నిలబడుతున్నట్లు కనిపించడం లేదు.
అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద యుద్ధం ప్రకటించాడు రాజేష్. పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న జనం కోసం నిలబడడని.. ఈ విషయంలో జగన్ ఎన్నో రెట్లు బెటర్ అని.. పవన్ కళ్యాణ్ వల్ల సమాజానికి నష్టమని.. ఈ విషయాన్నే వివరిస్తూ జనాల్లోకి వెళ్లబోతున్నానని మహాసేన రాజేష్ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం.
అంతేకాక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 200 శాతం ఓడిపోతాడని కూడా రాజేష్ జోస్యం చెప్పాడు. ఇలా రోజుకో మాట మాట్లాడుతూ, స్టాండ్ తీసుకుంటూ మహాసేన రాజేష్ క్రెడిబిలిటీ కోల్పోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on May 7, 2024 3:42 pm
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…