ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరం.. ఓ రేంజ్లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పక్షాలైన.. టీడీపీ, వైసీపీ, జనసేనలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఒకవైపు కూటమి.. మరోవైపు వైసీపీలు దూకుడుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే.. ఇంత జరుగుతున్నా.. టాలీవుడ్ మాత్రం మౌనంగా ఉంది. ఒకరిద్దరు మినహా.. ఎవరూ ముందుకు రాలేదు. ఎవరికీ మద్దతు చెప్పలేదు. గతంలో అయితే.. ఎంతో కొంత మార్పు ఉండేది. కానీ, ఇప్పుడు అసలు పూ్ర్తిగా మౌనం వహించారు.
అయితే.. ఎన్నికలకు పట్టుమని ఆరు రోజులు ఉన్న సమయంలో మెగా స్టార్ స్పందించారు. తన తమ్ము డికి తాను మద్దతిస్తున్నానని చెప్పిన ఆయన పిఠాపురంలో జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న పవన్ కల్యాణ్ ను గెలిపించాలని కోరారు. వాస్తవానికి.. ఫిజికల్గానే పవన్ కోసం చిరు ప్రచారం చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, వీడియో సందేశం ఇచ్చారు. తన తమ్ముడు శ్రమ పడుతున్నాడని.. రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే.. పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పారు.
మెగా వీడియో భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వెంటనే టాలీవుడ్ కదలింది. చిన్నపాటి హీరోలు.. ముందుకు వచ్చారు. తాము పవన్కు మద్దతిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. హీరో నాని.. ట్వీట్ చేస్తూ.. రాజకీయంగా మీరు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన కుటుంబంగా మీరు అనేక విజయాలు సొంతం చేసుకున్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. మీకు రాజకీయాల్లోనూ మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను.. అని పేర్కొన్నారు.
మరి హీరో.. రాజ్ తరణ్ కూడా.. పవన్కు జైకొట్టారు. తొలి రోజు నుంచి నేను అన్నీ గమనిస్తున్నాను. మీ దూర దృష్టి, కృషి వంటివి ఏపీకి అవసరం. లక్షల మందిలో ఒకడిగా నేను కూడా మీపై పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తారని నమ్ముతున్నా. ప్రజల భవిష్యత్తు మార్చేందుకు మీరు వేసిన అడుగు నిజం కావాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నాడు. సో.. మొత్తంగా టాలీవుడ్ అయితే.. కదలింది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…