ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరం.. ఓ రేంజ్లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పక్షాలైన.. టీడీపీ, వైసీపీ, జనసేనలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఒకవైపు కూటమి.. మరోవైపు వైసీపీలు దూకుడుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే.. ఇంత జరుగుతున్నా.. టాలీవుడ్ మాత్రం మౌనంగా ఉంది. ఒకరిద్దరు మినహా.. ఎవరూ ముందుకు రాలేదు. ఎవరికీ మద్దతు చెప్పలేదు. గతంలో అయితే.. ఎంతో కొంత మార్పు ఉండేది. కానీ, ఇప్పుడు అసలు పూ్ర్తిగా మౌనం వహించారు.
అయితే.. ఎన్నికలకు పట్టుమని ఆరు రోజులు ఉన్న సమయంలో మెగా స్టార్ స్పందించారు. తన తమ్ము డికి తాను మద్దతిస్తున్నానని చెప్పిన ఆయన పిఠాపురంలో జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న పవన్ కల్యాణ్ ను గెలిపించాలని కోరారు. వాస్తవానికి.. ఫిజికల్గానే పవన్ కోసం చిరు ప్రచారం చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, వీడియో సందేశం ఇచ్చారు. తన తమ్ముడు శ్రమ పడుతున్నాడని.. రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే.. పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పారు.
మెగా వీడియో భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వెంటనే టాలీవుడ్ కదలింది. చిన్నపాటి హీరోలు.. ముందుకు వచ్చారు. తాము పవన్కు మద్దతిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. హీరో నాని.. ట్వీట్ చేస్తూ.. రాజకీయంగా మీరు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన కుటుంబంగా మీరు అనేక విజయాలు సొంతం చేసుకున్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. మీకు రాజకీయాల్లోనూ మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను.. అని పేర్కొన్నారు.
మరి హీరో.. రాజ్ తరణ్ కూడా.. పవన్కు జైకొట్టారు. తొలి రోజు నుంచి నేను అన్నీ గమనిస్తున్నాను. మీ దూర దృష్టి, కృషి వంటివి ఏపీకి అవసరం. లక్షల మందిలో ఒకడిగా నేను కూడా మీపై పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తారని నమ్ముతున్నా. ప్రజల భవిష్యత్తు మార్చేందుకు మీరు వేసిన అడుగు నిజం కావాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నాడు. సో.. మొత్తంగా టాలీవుడ్ అయితే.. కదలింది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 7, 2024 3:39 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…