Political News

నా దగ్గర డబ్బు లేదు-జగన్

దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే అనధికార ఆస్తుల సంగతేంటో చెప్పాల్సిన పని లేదు. అలాంటి వ్యక్తి తన దగ్గర డబ్బు లేదని ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవడం విశేషం. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మాట్లాడుతూ.. డబ్బుల పంపకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“నా దగ్గర చంద్రబాబు లాగా డబ్బులు లేవు. ఆయన దగ్గర ప్రజల నుంచి దోచుకున్న డబ్బు ఉంది. ఆ డబ్బులతోనే ఓట్లు కొనాలని చూస్తున్నాడు. పోలింగ్‌కు ముందు టీడీపీ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి. అవి మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బే. రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోంది. ఎవరు అధికారంలో ఉంటే మీకు మంచి జరుగుతుతుందో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓటు వేయండి” అని పేర్కొన్నారు.

ఇక 2019 స్టయిల్లోనే ఫ్యాన్ పట్టుకుని ఇది మన గుర్తు అంటూ జనాలకు రిజిస్టర్ చేసే ప్రయత్నం చేసిన జగన్.. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల గుర్తుల గురించి ఎద్దేవా చేశారు.

ఏ తుప్పు పట్టిన సైకిల్ అడ్డు పడినా.. ఏ గాజు పెంకు అడ్డు వచ్చినా, ఎన్ని పువ్వులను కలుపుకుని వచ్చినా, ఏ చెయ్యి ఆపాలనుకున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఫ్యానుని అడ్డుకోలేరని.. ఇది పేదవాడి భవిష్యత్తు కోసం తిరుగుతున్న ఫ్యాన్ అని జగన్ వ్యాఖ్యానించారు.

తుప్పుపట్టిన సైకిల్‌కు రిపేర్ చేయాలని చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని జగన్ వ్యంగ్యాస్గ్రాలు విసిరారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ధైర్యంగా ప్రజల ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదని.. ఇప్పుడు తమదే అని జగన్ పేర్కొన్నారు.

This post was last modified on May 7, 2024 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నానిని టార్గెట్ చేయడం రైటేనా

సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…

1 hour ago

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

2 hours ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

3 hours ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

3 hours ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

6 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

6 hours ago