Political News

టాలీవుడ్ కదలికతో జనసేన టీడీపీకి బలం

ఎన్నికలు ఇంకో వారం రోజుల్లో జరగనుండగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీ అధికారి పార్టీని గద్దె దించి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న టిడిపి జనసేన కూటమికి మద్దతు దక్కుతున్న వైనాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవే స్వయంగా పిఠాపురంలో తన తమ్ముడికి ఓటు వేయమని వీడియో మెసేజ్ రూపంలో పిలుపు ఇవ్వడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయిదు కోట్ల విరాళం ఇచ్చినప్పటి కన్నా ఇప్పుడీ బహిరంగ మద్దతు మరింత బలాన్ని అందించడం ఖాయం. 

న్యాచురల్ స్టార్ నాని తన సపోర్ట్ ని పవన్ కళ్యాణ్ కి ట్వీట్ రూపంలో అందివ్వడం మరో విశేషం. గతంలో నాని చేసిన కొన్ని వ్యాఖ్యలను అనవసరంగా అపార్థం చేసుకుని ఒక వర్గం రాద్ధాంతం సృష్టించిన వైనం అభిమానులు మర్చిపోలేరు. నిత్యం పిఠాపురంలో జరుగుతున్న సెలబ్రిటీ ప్రచారం ఓటర్లలో మంచి కదలిక తీసుకొస్తోంది.

సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ ఎండల్లో తిరిగి క్యాంపైన్ చేశారు. హైపర్ ఆది, గెటప్ శీను, సుడిగాలి సుధీర్ తదితర హాస్య నటులు, హీరోలు వాడవాడలా తిరుగుతూ పబ్లిసిటీలో భాగమయ్యారు. జనసేన నుంచి పిలుపు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము పవన్ కోసమే పని చేస్తామని తేల్చి చెప్పారు. 

రాబోయే నాలుగైదు రోజుల్లో మరెన్నో మలుపులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకెందరో సినీ సెలబ్రిటీలు వివిధ రూపాల్లో జనసేన టిడిపికి మద్దతు ప్రకటించబోతున్నట్టు అంతర్గత వర్గాల సమాచారం. జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తేనే అసెంబ్లీలో అడుగు పెట్టగలడు.

అందుకే రాజకీయం మొత్తం అక్కడే కేంద్రీకృతమయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు నటులు, స్టార్లు క్రమంగా ఒక్కొక్కరు ముందుకొచ్చి టీడీపీ జనసేనకు మద్దతుగా నిలవడం చూస్తే అనూహ్యమైన ఫలితాలు చూడబోతున్నామనే అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. 

This post was last modified on May 7, 2024 12:42 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago