Political News

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ ‘ప్ర‌జాగ‌ళం’లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో ఉండ‌డంతో ఈ స‌భ‌కు రాలేదు. అయితే.. ఈ స‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్నారు. మ‌రి కూట‌మి పార్టీల కీల‌క నేత లేక‌పోతే..ఎలా అనుకున్నారా? ఇక్క‌డే నారా లోకేష్ ఆ భ‌ర్తీ పూర్తి చేశారు. ఈ రాజ‌మండ్రి స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నారా లోకేష్ మాత్ర‌మే పాల్గొన్నారు.ఇక‌, మోడీ సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. అయితే.. సాధార‌ణంగా మోడీ స‌భ‌ల్లో చంద్ర‌బాబు పాల్గొంటేనే ఆ రంజు వేరుగా ఉంటుందని అంద‌రూ అనుకుంటారు.

అయితే.. ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా.. చంద్ర‌బాబు మాదిరిగానే ప్ర‌సంగించి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ముగ్ధుడిని చేశారు. ప్ర‌తి వాక్యంలోనూ.. ప్ర‌త్యేక‌త క‌న‌బ‌రిచారు. మోడీని పొగ‌డ్త‌ల‌తోనే కాదు.. ఆయ‌న‌కు న‌చ్చిన‌ట్టుగా కూడా మాట్లాడారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. బీజేపీ నేత‌లు కూడా ఆ రేంజ్లో ప్ర‌సంగించ‌రేమో.. అన్న‌ట్టుగా నారా లోకేష్ ప్ర‌సంగించారు. ఇది ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌సంగాల్లోనే హైలెట్‌గా నిలిచింద‌ని చెప్పాలి. మోడీకి అన‌కాప‌ల్లి, రాజ‌మండ్రి మిఠాయిలు రుచి చూపిస్తున్నాం.. అంటూ.. సుమారు 5 కిలోల విభిన్న మిఠాయిలు పంపించారు.

ఇక‌, న‌మో(NAMO) అనే నాలుగు అక్ష‌రాలు దేశాన్ని న‌డిపిస్తున్నాయ‌ని నారా లోకేష్ అన‌గానే.. ప్ర‌ధాని ముఖం.. క‌మ‌లం పువ్వు మాదిరిగా విక‌సించింది. ప్ర‌ధానిని విశ్వ‌జిత్‌( విశ్వ‌విజేత అని అర్థం) అని ప్ర‌శంసించిన‌ప్పుడు.. ప్ర‌ధాని న‌వ్వు ఆపుకోలేక పోయారు. ఆయ‌నే చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగించారు. హృద‌య పూర్వ‌క న‌మ‌స్కారాలు అని నారా లోకేష్ అన‌గానే.. ప్ర‌ధాని కూడా ప్ర‌తిన‌మ‌స్కారం చేశారు. ఇవాళ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందంటే అందుకు కారణం మోడీనే అని అన్న‌ప్పుడు.. అంద‌రూ.. నారా లోకేష్ వైపు చూశారు. ప్ర‌ధాని అయితే.. అలా ఒక్క నిమిషం పాటు చూస్తుండి పోయారు.

“మోడీ గారికి మన ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా రుచి చూపించాలి” అంటూ.. వాటివైపు చూపించారు. అప్ప‌టికే స‌భా వేదిక‌పై స్వీట్ల‌ను సిద్ధం చేశారు. కానీ, ప్ర‌ధాని వాటిని ముట్టుకోలేదు. చేయి ఊపి ఆనందించారు. “న‌మో అనే నాలుగు అక్షరాలు దేశం దశ దిశ మార్చాయి” అని నారా లోకేష్ అన్న‌ప్పుడు.. ప్ర‌ధాని ముసిముసిగా న‌వ్వుకున్నారు. భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మోడీ అని నారా లోకేష్ కొనియాడిన‌ప్పుడు కూడా.. మోడీ అదేవిధంగా స్పందించారు. “మోడీ భారతదేశానికి గర్వకారణం… మోడీ నవభారత నిర్మాత” అని నారా లోకేష్ అన్న‌ప్పుడు ప్ర‌ధాని మ‌రింత సంతోషం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 6, 2024 9:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

42 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

1 hour ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

3 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

5 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

13 hours ago