ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులకు షాక్లు ఇస్తోంది. ఇప్పటికే రెండంకెల సంఖ్యలో అధికారులు బదిలీ అయ్యారు. వారిలో చాలామంది అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్షాలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. వారిలో ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొన్నది రెండేళ్లుగా డీజీపీగా వ్యవహరిస్తున్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డినే. ఈయనపై చర్యలు చేపట్టాలని చాలా రోజులుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎట్టకేలకు ఆదివారం నాడు రాజేంద్రనాథ్ను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక్క రోజు వ్యవధలోనే కొత్త డీజీపీ నియామకం కూడా జరిగిపోయింది. ప్రభుత్వం ద్వారకా తిరుమల రావు (ఆర్టీసీ ఎండీ), మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తాల పేర్లను సిఫారసు చేయగా.. 1992 బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా పేరును ఎన్నికల సంఘం డీజీపీగా ఖరారు చేసింది.
కాగా ఇదే సమయంలో అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి మీద ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయన మీద ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇలా గత మూడు వారాల్లో చాలామంది వివాదాస్పద అధికారులపై ఈసీ వేటు వేసింది. ఇక ప్రతిపక్షాలు కోరుకుంటున్న బదిలీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిదే. ఆయన మీద కూడా అనేక ఆరోపణలున్నాయి. రాబోయే రోజుల్లో ఆయన మీద కూడా వేటు పడితే ఎన్డీయే కూటమి ప్రశాంతంగా ఎన్నికలకు వెళ్లొచ్చు.
This post was last modified on May 6, 2024 6:06 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…