Political News

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట హాట్ టాపిక్‌గా మారింది. ఈ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని.. ఈ చట్టంలోని లొసుగలను ఉపయోగించుకుని వైకాపా నాయకులు భూములు దోచేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశం వేగంగా జనాల్లోకి వెళ్లిపోతోంది. జగన్ సర్కారు ఓటమికి కారణమయ్యే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.

ఐతే ఈ చట్టం విషయంలో ప్రతిపక్షాల మీద జగన్ అండ్ కో ఎదురు దాడి చేస్తోంది. అసలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే ఈ చట్టాన్ని ప్రతిపాదించిందని.. మరి బీజేపీతో జట్టు కట్టి ఎన్నికలకు వస్తున్న టీడీపీ, జనసేన తమ మీద ఆరోఫణలు ఎలా చేస్తాయని వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఐతే కేంద్రం ప్రతిపాదించిన చట్టం వేరని.. దాన్ని ఇష్టానుసారం, తమకు అనుకూలంగా మార్చుకుని ప్రమాదకరంగా ఈ చట్టాన్ని రూపొందించారని ప్రతిపక్షాలు తిప్పి కొడుతున్నాయి. నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారం అయితే.. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ (టీఆర్‌వో)గా ఒక అధికారిని నియమించాలని.. కానీ వైసీపీ చట్టం ప్రకారం ఏ వ్యక్తినైనా టీఆర్‌వోగా నియమించవచ్చని.. ఇందులోనే పెద్ద కుట్ర ఉందని అంటున్నారు.

తమకు నచ్చిన వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టడం ద్వారా భూ వివాదాల్లో తమకు అనుకూలంగా వ్యవహరించేలా వైసీపీ నాయకులు చూసుకుంటారని ఆరోపిస్తున్నారు. ఇక రికార్డుల్లో భూ యజమానికి పేరును చేర్చి నోటిఫై చేశాక అభ్యంతరాలు చెప్పడానికి మూడేళ్ల గడువు ఉండాలని నీతి ఆయోర్ పేర్కొంటే.. ఆ గడువును వైసీపీ రెండేళ్లకు తగ్గించింది.

మరోవైపు టైట్లింగ్ వివాదం ఉన్నట్లు టీఆర్‌వో గుర్తిస్తే సెక్షన్ 10 కింద వివాదాల రిజిస్టర్లో వివరాలు నమోదు చేసి ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్ (ఎల్డీఆర్వో) వద్దకు పంపాలని నీతి ఆయోగ్ పేర్కొనగా.. జగన్ ప్రభుత్వం తెచ్చిన చట్టంలో ఎల్డీఆర్వో ప్రస్తావనే లేదు. వివాదం ఉంటే ల్యాండ్ టైట్లింగ్ అప్పీలేట్ ఆఫీసర్‌ని ఆశ్రయించాలని పేర్కొన్నారు. ఇలా కేంద్ర ప్రతిపాదించిన చట్టానికి.. జగన్ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి చాలా తేడాలున్నాయని..అందుకే ఇది ప్రమాదకరమని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ జనాల్లోకి ఈ విషయాలను బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నాయి.,

This post was last modified on May 6, 2024 3:56 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…

22 mins ago

పుష్ప 2 పోటీ – తగ్గనంటున్న శివన్న

ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు…

28 mins ago

లవ్ మీ మీద బండెడు బరువు

సింగల్ స్క్రీన్లు అధిక శాతం తాత్కాలికంగా మూతబడి, కుంటినడనన మల్టీప్లెక్సులను నెట్టుకొస్తున్న టైంలో ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్ లవ్…

2 hours ago

భైరవ బుజ్జిలను తక్కువంచనా వేయొద్దు

నిన్న ఊరించి ఊరించి ఆలస్యంగా విడుదల చేసిన కల్కి 2898 ఏడిలోని బుజ్జి మేకింగ్ వీడియో చూసి అభిమానుల నుంచి…

3 hours ago

కుప్పం బాబుకు లక్ష ‘కప్పం’ చెల్లిస్తుందా ?

కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడుకు పెట్టని కోట. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ టీడీపీ తప్ప…

3 hours ago

మీడియం హీరోల డిజిటల్ కష్టాలు

స్టార్ ఇమేజ్ ఎంత ఉన్నా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్న డిజిటల్ మార్కెట్ వాళ్ళకో సవాల్ గా మారిపోయింది. కరోనా…

4 hours ago