రాయ్ బరేలీ నుండి పోటీకి దిగుతుంది అనుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయలేదు ? అక్కడి నుండి ఆమె పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడినా అమె ఎందుకు బరిలోకి దిగలేదు ? ప్రియాంక స్థానంలో రాహుల్ ఎందుకు పోటీకి దిగాడు ? అంటే దీని వెనక కుట్ర ఉంది అంటున్నాడు కాంగ్రెస్ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్.
ఈ మేరకు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రియాంక గాంధీపై పార్టీలో కుట్ర జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ త్వరలో చీలి పోతుందని, రాహుల్ గాంధీ వర్గం, ప్రియాంక గాంధీ వర్గాలుగా చీలిపోవడం ఖాయమని అంటున్నారు.
రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గాన్ని వీడిన తీరు కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసిందని, ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో జూన్ 4 తర్వాత ఆమె మద్దతుదారుల గుండెల్లో ఆవేదన అగ్నిపర్వతంలా బద్దలవ్వడం ఖాయమని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ అన్నారు.
ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వరని నేను ముందే చెప్పానని, ప్రియాంక గాంధీపై కుటుంబంలో, పార్టీలో భారీ కుట్ర జరుగుతోందని ఆయన అంటున్నారు.
రాహుల్ గాంధీకి పాకిస్థాన్లో ప్రజాదరణ బాగుందని, ఆయన రాయ్బరేలీకి బదులుగా పాక్లోని రావల్పిండి నుంచి పోటీ చేస్తే బావుంటుందని ఎద్దేవా చేశాడు.
This post was last modified on May 5, 2024 11:12 am
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…
హార్రర్ సినిమాల్లో దయ్యాల పాత్రలు పోషించిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ…