రాయ్ బరేలీ నుండి పోటీకి దిగుతుంది అనుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయలేదు ? అక్కడి నుండి ఆమె పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడినా అమె ఎందుకు బరిలోకి దిగలేదు ? ప్రియాంక స్థానంలో రాహుల్ ఎందుకు పోటీకి దిగాడు ? అంటే దీని వెనక కుట్ర ఉంది అంటున్నాడు కాంగ్రెస్ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్.
ఈ మేరకు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రియాంక గాంధీపై పార్టీలో కుట్ర జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ త్వరలో చీలి పోతుందని, రాహుల్ గాంధీ వర్గం, ప్రియాంక గాంధీ వర్గాలుగా చీలిపోవడం ఖాయమని అంటున్నారు.
రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గాన్ని వీడిన తీరు కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసిందని, ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో జూన్ 4 తర్వాత ఆమె మద్దతుదారుల గుండెల్లో ఆవేదన అగ్నిపర్వతంలా బద్దలవ్వడం ఖాయమని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ అన్నారు.
ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వరని నేను ముందే చెప్పానని, ప్రియాంక గాంధీపై కుటుంబంలో, పార్టీలో భారీ కుట్ర జరుగుతోందని ఆయన అంటున్నారు.
రాహుల్ గాంధీకి పాకిస్థాన్లో ప్రజాదరణ బాగుందని, ఆయన రాయ్బరేలీకి బదులుగా పాక్లోని రావల్పిండి నుంచి పోటీ చేస్తే బావుంటుందని ఎద్దేవా చేశాడు.
This post was last modified on May 5, 2024 11:12 am
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…