ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కూడా కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీ తొలుత కోర్టుకు వెళ్లింది. దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ.. కొంత మార్పు చేసింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ సహా.. 2 పార్లమెంటు స్థానాల్లోనూ.. ఎవరికీ గాజు గ్లాసు గుర్తును కేటాయించబోమని పేర్కొంది. దీంతో హైకోర్టు కేసును మూసేసింది.
ఇదేదో బాగుందని.. జనసేన నాయకులు తలూపుతూ.. బయటకు వచ్చాక.. టీడీపీ, బీజేపీ నేతలు ఎదురె ళ్లారు. గాజు గ్లాసు గుర్తును టీడీపీ, బీజేపీ నాయకులు పోటీ చేసే 164 అసెంబ్లీ, 23 పార్లమెంటు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారని… సో.. ఓటరు తడబడితే అది తమకొంప మునిగిపోయే పరిస్థితికి దారితీస్తుందని ఆ రెండు పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఆ వెంటనే.. అంటే బుధవారం రాత్రి వేళ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు.
దీనిలో టీడీపీ, బీజేపీ నేతలు కూడా కలిశారు. రాష్ట్రంలో జనసేన-బీజేపీ-టీడీపీ కూటమిగా వెళ్తున్న నేప థ్యంలో రాష్ట్రంలో ఎక్కడా ఎవరికీ.. గాజు గ్లాసు గుర్తును కేటాయించొద్దని ఈ పార్టీలు పిటిషన్లో పేర్కొన్నా యి. తాజగా దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. పై వాదననే ఈ రెండు పార్టీల తరఫున న్యాయవాదులు వినిపించారు. అయితే.. ఎన్నికల సంఘం మాత్రం భిన్నమైన వాదన వినిపించింది. దీంతో కోర్టుకు ఏం చేయాలో తెలియక.. శుక్రవారానికి కేసును వాయిదా వేసింది.
ఈసీ ఏమందంటే..
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే.. పార్టీలు తమకు ఉండే అభ్యంతరాలు చెప్పాలి. పైగా గాజు గ్లాసు అనేది ఫ్రీ సింబల్. దీనిని ఎవరు కోరుకున్నా.. వారికి ముందుగా ఇచ్చే నిబంధనలు ఉన్నాయి. పోనీ.. నిలుపుదల చేయాలన్నా.. ముందు మమ్మల్ని జనసేన సంప్రదించలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు మార్పులు చేయలేం. ఇప్పటికే చాలా మందికి కేటాయించాం. సో.. ఇప్పుడు మార్చేందుకు కుదరదు… అని కుండబద్దలు కొట్టింది.
This post was last modified on May 2, 2024 6:08 pm
హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…