Political News

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు కూడా కేటాయించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో జ‌న‌సేన పార్టీ తొలుత కోర్టుకు వెళ్లింది. దీనిపై ఎన్నిక‌ల సంఘం వివ‌రణ ఇస్తూ.. కొంత మార్పు చేసింది. జ‌న‌సేన పోటీ చేసే 21 అసెంబ్లీ స‌హా.. 2 పార్ల‌మెంటు స్థానాల్లోనూ.. ఎవ‌రికీ గాజు గ్లాసు గుర్తును కేటాయించ‌బోమ‌ని పేర్కొంది. దీంతో హైకోర్టు కేసును మూసేసింది.

ఇదేదో బాగుంద‌ని.. జ‌న‌సేన నాయ‌కులు త‌లూపుతూ.. బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. టీడీపీ, బీజేపీ నేత‌లు ఎదురె ళ్లారు. గాజు గ్లాసు గుర్తును టీడీపీ, బీజేపీ నాయ‌కులు పోటీ చేసే 164 అసెంబ్లీ, 23 పార్ల‌మెంటు స్థానాల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు కేటాయించార‌ని… సో.. ఓట‌రు త‌డ‌బ‌డితే అది త‌మ‌కొంప మునిగిపోయే ప‌రిస్థితికి దారితీస్తుంద‌ని ఆ రెండు పార్టీలు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఆ వెంటనే.. అంటే బుధ‌వారం రాత్రి వేళ హైకోర్టులో మ‌రో పిటిష‌న్ వేశారు.

దీనిలో టీడీపీ, బీజేపీ నేత‌లు కూడా క‌లిశారు. రాష్ట్రంలో జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ కూట‌మిగా వెళ్తున్న నేప థ్యంలో రాష్ట్రంలో ఎక్క‌డా ఎవ‌రికీ.. గాజు గ్లాసు గుర్తును కేటాయించొద్ద‌ని ఈ పార్టీలు పిటిష‌న్‌లో పేర్కొన్నా యి. తాజ‌గా దీనిపై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా.. పై వాద‌న‌నే ఈ రెండు పార్టీల త‌ర‌ఫున న్యాయ‌వాదులు వినిపించారు. అయితే.. ఎన్నిక‌ల సంఘం మాత్రం భిన్న‌మైన వాద‌న వినిపించింది. దీంతో కోర్టుకు ఏం చేయాలో తెలియ‌క‌.. శుక్ర‌వారానికి కేసును వాయిదా వేసింది.

ఈసీ ఏమందంటే..

ఎన్నిక‌ల నామినేషన్ల ప్ర‌క్రియ ప్రారంభానికి ముందే.. పార్టీలు త‌మ‌కు ఉండే అభ్యంత‌రాలు చెప్పాలి. పైగా గాజు గ్లాసు అనేది ఫ్రీ సింబ‌ల్‌. దీనిని ఎవ‌రు కోరుకున్నా.. వారికి ముందుగా ఇచ్చే నిబంధ‌న‌లు ఉన్నాయి. పోనీ.. నిలుపుద‌ల చేయాల‌న్నా.. ముందు మ‌మ్మ‌ల్ని జ‌న‌సేన సంప్ర‌దించ‌లేదు. ఇప్ప‌టికే చాలా ఆల‌స్యం అయిపోయింది. ఇప్పుడు మార్పులు చేయ‌లేం. ఇప్ప‌టికే చాలా మందికి కేటాయించాం. సో.. ఇప్పుడు మార్చేందుకు కుద‌ర‌దు… అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. 

This post was last modified on May 2, 2024 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

1 hour ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

3 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

7 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago