ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కూడా కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీ తొలుత కోర్టుకు వెళ్లింది. దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ.. కొంత మార్పు చేసింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ సహా.. 2 పార్లమెంటు స్థానాల్లోనూ.. ఎవరికీ గాజు గ్లాసు గుర్తును కేటాయించబోమని పేర్కొంది. దీంతో హైకోర్టు కేసును మూసేసింది.
ఇదేదో బాగుందని.. జనసేన నాయకులు తలూపుతూ.. బయటకు వచ్చాక.. టీడీపీ, బీజేపీ నేతలు ఎదురె ళ్లారు. గాజు గ్లాసు గుర్తును టీడీపీ, బీజేపీ నాయకులు పోటీ చేసే 164 అసెంబ్లీ, 23 పార్లమెంటు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారని… సో.. ఓటరు తడబడితే అది తమకొంప మునిగిపోయే పరిస్థితికి దారితీస్తుందని ఆ రెండు పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఆ వెంటనే.. అంటే బుధవారం రాత్రి వేళ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు.
దీనిలో టీడీపీ, బీజేపీ నేతలు కూడా కలిశారు. రాష్ట్రంలో జనసేన-బీజేపీ-టీడీపీ కూటమిగా వెళ్తున్న నేప థ్యంలో రాష్ట్రంలో ఎక్కడా ఎవరికీ.. గాజు గ్లాసు గుర్తును కేటాయించొద్దని ఈ పార్టీలు పిటిషన్లో పేర్కొన్నా యి. తాజగా దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. పై వాదననే ఈ రెండు పార్టీల తరఫున న్యాయవాదులు వినిపించారు. అయితే.. ఎన్నికల సంఘం మాత్రం భిన్నమైన వాదన వినిపించింది. దీంతో కోర్టుకు ఏం చేయాలో తెలియక.. శుక్రవారానికి కేసును వాయిదా వేసింది.
ఈసీ ఏమందంటే..
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే.. పార్టీలు తమకు ఉండే అభ్యంతరాలు చెప్పాలి. పైగా గాజు గ్లాసు అనేది ఫ్రీ సింబల్. దీనిని ఎవరు కోరుకున్నా.. వారికి ముందుగా ఇచ్చే నిబంధనలు ఉన్నాయి. పోనీ.. నిలుపుదల చేయాలన్నా.. ముందు మమ్మల్ని జనసేన సంప్రదించలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు మార్పులు చేయలేం. ఇప్పటికే చాలా మందికి కేటాయించాం. సో.. ఇప్పుడు మార్చేందుకు కుదరదు… అని కుండబద్దలు కొట్టింది.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…