ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కూడా కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీ తొలుత కోర్టుకు వెళ్లింది. దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ.. కొంత మార్పు చేసింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ సహా.. 2 పార్లమెంటు స్థానాల్లోనూ.. ఎవరికీ గాజు గ్లాసు గుర్తును కేటాయించబోమని పేర్కొంది. దీంతో హైకోర్టు కేసును మూసేసింది.
ఇదేదో బాగుందని.. జనసేన నాయకులు తలూపుతూ.. బయటకు వచ్చాక.. టీడీపీ, బీజేపీ నేతలు ఎదురె ళ్లారు. గాజు గ్లాసు గుర్తును టీడీపీ, బీజేపీ నాయకులు పోటీ చేసే 164 అసెంబ్లీ, 23 పార్లమెంటు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారని… సో.. ఓటరు తడబడితే అది తమకొంప మునిగిపోయే పరిస్థితికి దారితీస్తుందని ఆ రెండు పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఆ వెంటనే.. అంటే బుధవారం రాత్రి వేళ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు.
దీనిలో టీడీపీ, బీజేపీ నేతలు కూడా కలిశారు. రాష్ట్రంలో జనసేన-బీజేపీ-టీడీపీ కూటమిగా వెళ్తున్న నేప థ్యంలో రాష్ట్రంలో ఎక్కడా ఎవరికీ.. గాజు గ్లాసు గుర్తును కేటాయించొద్దని ఈ పార్టీలు పిటిషన్లో పేర్కొన్నా యి. తాజగా దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. పై వాదననే ఈ రెండు పార్టీల తరఫున న్యాయవాదులు వినిపించారు. అయితే.. ఎన్నికల సంఘం మాత్రం భిన్నమైన వాదన వినిపించింది. దీంతో కోర్టుకు ఏం చేయాలో తెలియక.. శుక్రవారానికి కేసును వాయిదా వేసింది.
ఈసీ ఏమందంటే..
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే.. పార్టీలు తమకు ఉండే అభ్యంతరాలు చెప్పాలి. పైగా గాజు గ్లాసు అనేది ఫ్రీ సింబల్. దీనిని ఎవరు కోరుకున్నా.. వారికి ముందుగా ఇచ్చే నిబంధనలు ఉన్నాయి. పోనీ.. నిలుపుదల చేయాలన్నా.. ముందు మమ్మల్ని జనసేన సంప్రదించలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు మార్పులు చేయలేం. ఇప్పటికే చాలా మందికి కేటాయించాం. సో.. ఇప్పుడు మార్చేందుకు కుదరదు… అని కుండబద్దలు కొట్టింది.
This post was last modified on May 2, 2024 6:08 pm
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…