Political News

ప‌వ‌న్‌కు రిలీఫ్… చంద్ర‌బాబుకు తిప్పలు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు  ఎన్నిక‌ల గుర్తుల కేటాయింపు విష‌యంలో కొంత రిలీఫ్ ద‌క్కింది. కానీ, ఇదేస‌మ‌యంలో కూట‌మి పార్టీల అధినేత చంద్ర‌బాబుకు మాత్రం తిప్ప‌లు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. స్వతంత్ర అభ్య‌ర్థుల‌కు కేటాయించిన గ్లాసు గుర్తును వెన‌క్కి తీసుకునేది లేద‌ని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్ర‌స్తుత సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో గుర్తింపు పొంద‌న పార్టీగా ఉన్న జ‌న‌సేన‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాసు గుర్తును ఇచ్చింది.

అయితే.. దీనినే చాలా మంది స్వ‌తంత్రులు కూడా కోరుకున్నారు. దీంతో జ‌న‌సేన పోటీలో లేని 18 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయా అభ్య‌ర్థుల‌కు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసును ఇచ్చింది. అదేవిధంగా రెండు పార్ల‌మెంటు స్థానాలైన మ‌చిలీప‌ట్నం, కాకినాడ‌లోనూ స్వ‌తంత్రుల‌కు ఇదే గుర్తు కేటాయించింది. అయితే.. ఇది త‌మ‌కు ఇబ్బంది అని.. త‌మ గుర్తును వేరేవారికి ఇవ్వ‌రాద‌ని కోరుతూ.. జ‌న‌సేన హైకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా అపిడ‌విట్ దాఖ‌లు చేసింది.

దీనిలో జ‌న‌సేన పోటీ చేస్తున్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆ పార్టీ కి మాత్ర‌మే గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తామ‌ని.. మిగిలిన వారికి కేటాయించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రెండు పార్ల‌మెంటు స్థానాల్లో ఇత‌రుల‌కు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును వెన‌క్కి తీసుకుంది. ఇది కొంత వ‌ర‌కు ప‌వ‌న్‌కు రిలీఫ్ ఇచ్చే అవ‌కాశ‌మే. అయితే.. ఇత‌ర అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యానికి వ‌స్తే మాత్రం.. ఈ ప‌రిస్థితి లేదు. అక్క‌డ గాజు గ్లాసు గుర్తును వెన‌క్కి తీసుకునేది లేద‌ని పేర్కొంది. ఈ ప‌రిణామం కూట‌మి ప్ర‌ధాన పార్టీ టీడీపీకి తిప్పలు పెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిపై తుది తీర్పు ఎలా వ‌స్తుందో చూడాలి. 

This post was last modified on May 1, 2024 3:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

33 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

41 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago