తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న `సూపర్ సిక్స్`కు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. ఇదేసమయంలో మరికొన్ని హామీలను కూడా చేర్చారు. జర్నలిస్టులకు ఇళ్లు, కురబ సహా ఇతర సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక, సూపర్ సిక్స్లో ఉన్నవాటిని మరింతగా వివరించారు. అయితే.. ఈ మేనిఫెస్టోపై సీఎం జగన్ స్పందించారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ఈ ప్రచార సభల్లోనే జగన్ స్పందిస్తూ.. కూటమి మేనిఫెస్టో అబద్ధాల కూర్పుగా ఉందని ఎద్దేవా చేశారు. పైగా కూటమి పార్టీల కు చెందిన ముగ్గురి ఫొటోలు మేనిఫెస్టోపై ఎందుకు లేవని ప్రశ్నించారు. “కూటమిగా మూడు పార్టీలు వెళ్తున్నాయి. కానీ.. మేని ఫెస్టోపై చంద్రబాబు, దత్తపుత్రిడి బొమ్మలే వేసుకున్నారు. మరి బీజేపీ తరఫున మోడీ బొమ్మను ఎందుకు వేయలేదు” అని ప్రశ్నించారు. అంతేకాదు.. దీనికి రీజన్ కూడా చెప్పారు. “ఈ మేనిఫెస్టో ఎలానూ అమలు చేసేది కాదని ప్రధాని మోడీకి తెలు సు. అందుకే తన ఫొటో వేయొద్దని చెప్పారు. అందుకే 12 గంటలకే మేనిఫెస్టో అంటూ.. ప్రకటించి మధ్యాహ్నం 3 గంటల వరకు సాగదీశారు. ఇలాంటి కూటమి రేపు ఏం చేస్తుందో మీరే ఆలోచించాలి” అని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
అంతేకాదు.. మేనిఫెస్టో విడుదల సందర్భంగా తాను గణాంకాలు వివరించానని జగన్ చెప్పారు. గతంలో ఎంత ఆదాయం ఉంది.. ఇప్పుడు ఎంత మేరకు ప్రజలకు మేలు చేశామో వివరించామని తెలిపారు. కానీ, చంద్రబాబు తనను తిట్టడంతోనూ, శాపనార్థా లు పెట్టడంతోనూ సరిపెట్టారని జగన్ వ్యాఖ్యానించారు. తాను అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మరో రూ.10 పెంచి అమలు చేస్తున్న 40 ఇయర్ ఇండస్ట్రీఅంటూ.. చంద్రబాబును ఎద్దేవా చేశారు. తనకంటూ.. ఏమీ ప్రత్యేకత లేదని.. కాపీ కొట్టి మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు. “ముగ్గురు కూటమిలో ఉండి.. ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకోలేకపోయారు. జగన్ మేనిఫెస్టో పెట్టి అమలు చేశాడు కాబట్టి వాటిపై ఓ రూపాయి ఎక్కువే ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఇవి సాధ్యమేనా?” అని జగన్ ప్రశ్నించారు.
This post was last modified on April 30, 2024 11:55 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…