తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న `సూపర్ సిక్స్`కు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. ఇదేసమయంలో మరికొన్ని హామీలను కూడా చేర్చారు. జర్నలిస్టులకు ఇళ్లు, కురబ సహా ఇతర సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక, సూపర్ సిక్స్లో ఉన్నవాటిని మరింతగా వివరించారు. అయితే.. ఈ మేనిఫెస్టోపై సీఎం జగన్ స్పందించారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ఈ ప్రచార సభల్లోనే జగన్ స్పందిస్తూ.. కూటమి మేనిఫెస్టో అబద్ధాల కూర్పుగా ఉందని ఎద్దేవా చేశారు. పైగా కూటమి పార్టీల కు చెందిన ముగ్గురి ఫొటోలు మేనిఫెస్టోపై ఎందుకు లేవని ప్రశ్నించారు. “కూటమిగా మూడు పార్టీలు వెళ్తున్నాయి. కానీ.. మేని ఫెస్టోపై చంద్రబాబు, దత్తపుత్రిడి బొమ్మలే వేసుకున్నారు. మరి బీజేపీ తరఫున మోడీ బొమ్మను ఎందుకు వేయలేదు” అని ప్రశ్నించారు. అంతేకాదు.. దీనికి రీజన్ కూడా చెప్పారు. “ఈ మేనిఫెస్టో ఎలానూ అమలు చేసేది కాదని ప్రధాని మోడీకి తెలు సు. అందుకే తన ఫొటో వేయొద్దని చెప్పారు. అందుకే 12 గంటలకే మేనిఫెస్టో అంటూ.. ప్రకటించి మధ్యాహ్నం 3 గంటల వరకు సాగదీశారు. ఇలాంటి కూటమి రేపు ఏం చేస్తుందో మీరే ఆలోచించాలి” అని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
అంతేకాదు.. మేనిఫెస్టో విడుదల సందర్భంగా తాను గణాంకాలు వివరించానని జగన్ చెప్పారు. గతంలో ఎంత ఆదాయం ఉంది.. ఇప్పుడు ఎంత మేరకు ప్రజలకు మేలు చేశామో వివరించామని తెలిపారు. కానీ, చంద్రబాబు తనను తిట్టడంతోనూ, శాపనార్థా లు పెట్టడంతోనూ సరిపెట్టారని జగన్ వ్యాఖ్యానించారు. తాను అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మరో రూ.10 పెంచి అమలు చేస్తున్న 40 ఇయర్ ఇండస్ట్రీఅంటూ.. చంద్రబాబును ఎద్దేవా చేశారు. తనకంటూ.. ఏమీ ప్రత్యేకత లేదని.. కాపీ కొట్టి మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు. “ముగ్గురు కూటమిలో ఉండి.. ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకోలేకపోయారు. జగన్ మేనిఫెస్టో పెట్టి అమలు చేశాడు కాబట్టి వాటిపై ఓ రూపాయి ఎక్కువే ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఇవి సాధ్యమేనా?” అని జగన్ ప్రశ్నించారు.
This post was last modified on April 30, 2024 11:55 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…