ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తా.. ఖాళీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలన్నీ భర్తీ చేసేస్తాం అని ఘనంగా హామీలు ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక వాటిని నిలబెట్టుకోలేకపోయారు. ఉద్యోగులు కాని వాలంటీర్లను.. ప్రభుత్వంలో విలీనం అయిన ఆర్టీసీ ఉద్యోగులను చూపించి లక్షల్లో ఉద్యోగాలు కల్పించినట్లు ఘనంగా నంబర్లు వేసుకోవడం జగన్ సర్కారుకే చెల్లింది.
ప్రభుత్వ ఉద్యోగాల సంగతి అలా ఉంచితే.. కొత్తగా ఏపీకి ఆశించిన స్థాయిలో పరిశ్రమలు రాకపోవడం, ఆల్రెడీ ఉన్న, రావాల్సిన పరిశ్రమలను వెనక్కి పంపడం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మరింత పెరిగేలా చేసిందని జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వైసీపీ సర్కారు ప్రధాన వైఫల్యాల్లో ఒకటిగా ప్రతిపక్షాలు చూపిస్తున్న ఈ అంశంపై సీఎం జగన్.. రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో స్పందించాడు.
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కల్పనకు తోడ్పాటు అందించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నట్లు ఆయన మాట్లాడ్డం గమనార్హం. ఒక ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించగలదు.. ఒక పెద్ద కంపెనీ వస్తే ఎన్ని ఉద్యోగాలు వచ్చేస్తాయి.. చాలా తక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఆర్థికాభివృద్ధి అంతా స్వయం ఉపాధిలోనే ఉందని.. దీని వల్లే ఎకానమీ ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులు, చేతి వృత్తుల వాళ్లు, ఇతర కార్మికులే ఎకానమీలో కీలకమని.. వాళ్లకు తోడ్పాటు అందిస్తే చాలని జగన్ అభిప్రాయపడ్డారు.
జగన్ చెప్పిన వర్గాలకు తోడ్పాటు అందించాల్సిన విషయం వాస్తవమే కానీ.. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన బాధ్యతను.. అలాగే సరళమైన పారిశ్రామిక విధానం ద్వారా ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరాన్ని జగన్ గుర్తించకుండా అదేమంత ముఖ్యమైన విషయం కాదన్నట్లు మాట్లాడ్డం విడ్డూరంగా అనిపిస్తోంది. దీని మీద సామాజిక మాధ్యమాల్లో జగన్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
This post was last modified on April 30, 2024 7:36 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…