ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తా.. ఖాళీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలన్నీ భర్తీ చేసేస్తాం అని ఘనంగా హామీలు ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక వాటిని నిలబెట్టుకోలేకపోయారు. ఉద్యోగులు కాని వాలంటీర్లను.. ప్రభుత్వంలో విలీనం అయిన ఆర్టీసీ ఉద్యోగులను చూపించి లక్షల్లో ఉద్యోగాలు కల్పించినట్లు ఘనంగా నంబర్లు వేసుకోవడం జగన్ సర్కారుకే చెల్లింది.
ప్రభుత్వ ఉద్యోగాల సంగతి అలా ఉంచితే.. కొత్తగా ఏపీకి ఆశించిన స్థాయిలో పరిశ్రమలు రాకపోవడం, ఆల్రెడీ ఉన్న, రావాల్సిన పరిశ్రమలను వెనక్కి పంపడం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మరింత పెరిగేలా చేసిందని జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వైసీపీ సర్కారు ప్రధాన వైఫల్యాల్లో ఒకటిగా ప్రతిపక్షాలు చూపిస్తున్న ఈ అంశంపై సీఎం జగన్.. రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో స్పందించాడు.
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కల్పనకు తోడ్పాటు అందించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నట్లు ఆయన మాట్లాడ్డం గమనార్హం. ఒక ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించగలదు.. ఒక పెద్ద కంపెనీ వస్తే ఎన్ని ఉద్యోగాలు వచ్చేస్తాయి.. చాలా తక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఆర్థికాభివృద్ధి అంతా స్వయం ఉపాధిలోనే ఉందని.. దీని వల్లే ఎకానమీ ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులు, చేతి వృత్తుల వాళ్లు, ఇతర కార్మికులే ఎకానమీలో కీలకమని.. వాళ్లకు తోడ్పాటు అందిస్తే చాలని జగన్ అభిప్రాయపడ్డారు.
జగన్ చెప్పిన వర్గాలకు తోడ్పాటు అందించాల్సిన విషయం వాస్తవమే కానీ.. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన బాధ్యతను.. అలాగే సరళమైన పారిశ్రామిక విధానం ద్వారా ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరాన్ని జగన్ గుర్తించకుండా అదేమంత ముఖ్యమైన విషయం కాదన్నట్లు మాట్లాడ్డం విడ్డూరంగా అనిపిస్తోంది. దీని మీద సామాజిక మాధ్యమాల్లో జగన్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
This post was last modified on April 30, 2024 7:36 pm
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…