రాయ్ బరేలీ నుండి ప్రియాంక, అమేథి నుండి రాహుల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతారని కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో వారికి అశనిపాతం లాంటి వార్త ఎదురైంది. ఈ ఎన్నికల్లో పోటీకి దిగొద్దని ప్రియాంకాగాంధీ భావిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో అమేథి నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 55,120 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు. 2004 నుండి సోనియాగాంధీ రాయ్ బరేలీ నుండి గెలుస్తూ వస్తున్నారు.
ఇటీవల రాజస్థాన్ నుండి సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో ఈసారి గాంధీ కుటుంబం నుండి ప్రియాంక పోటీ చేస్తుందని భావించారు. ఈ మేరకు ప్రియాంక రాయ్ బరేలి, రాబర్ట్ వాద్రా అమేథి నుండి పోటీ చేయాలని పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే వాయనాడ్ లో ఎన్నికలు ముగియడంతో రాహుల్ అమేథి నుండి, ప్రియాంక రాయ్ బరేలి నుండి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి.
ప్రియాంకకు మాత్రం అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనే లేదని, ఆమె కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం కావాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు వారసత్వ విమర్శల నుండి తప్పించుకునేందుకు పోటీకి దూరంగా ఉండడమే బావుంటుందని భావిస్తున్నట్లు సమాచారం. రెండు దశాబ్దాలుగా సోనియా ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీ నుండి కాంగ్రెస్ తరపున ఎవరు బరిలోకి దిగుతారు అన్నది ఆసక్తిగా మారింది.
This post was last modified on April 30, 2024 7:17 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…