Political News

కూటమి మేనిఫెస్టో విడుదల.. తొలి సంతకం ఆ ఫైలుపైనే

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఈ క్రమంలో కూటమి గెలుపు ఖాయమని కూటమి నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. ఆల్రెడీ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయగా ఈ రోజు కూటమి మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ స్థాయి నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ లు సంయుక్తంగా విడుదల చేశారు.

“ఏపీ ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం…రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం” అనే నినాదంతో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది.

టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం, బీజేపీ పేర్కొన్న అంశాలను కలగలిపి మేనిఫెస్టో రూపొందించామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే సీట్ల సర్దుబాటు చేసుకున్నామని, ప్రజలను గెలిపించేందుకే తాము కలిశామని చంద్రబాబు అన్నారు. కూటమికి రాష్ట్రంలో బీజేపీ సహకారం ఉందని, అందుకే సిద్ధార్థ నాథ్ సింగ్ నేరుగా వచ్చి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. బీజేపీ కూడా మేనిఫెస్టోకు కొన్ని సూచనలు చేసిందని, బీజేపీ కూడా ఈ మేనిఫెస్టోను ఎండార్స్ చేసిందని చెప్పారు.

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

మేనిఫెస్టోలోని కీలక అంశాలు

బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు

బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు

బీసీ కార్పోరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేయడం

బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ. 10 వేల కోట్లు

ఆధునిక పనిముట్లతో ఆదరణ పథకం అమలు

పవర్ లూం, హ్యాండ్ లూంలకు కొంత మేర ఉచిత విద్యుత్

మత్స్యకారులను ఆదుకునే కార్యక్రమాలు

డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పంచుతాం

20 లక్షల మంది యువతకు ఉపాధి

నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి

మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు

స్కిల్ గణన చేపడతాం

ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు

10 శాతం EWS రిజర్వేషన్ల అమలు

సమగ్ర ఇసుక విధానం

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు

కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడతాం

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

2 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

3 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

4 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

4 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

5 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

5 hours ago