2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఈ క్రమంలో కూటమి గెలుపు ఖాయమని కూటమి నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. ఆల్రెడీ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయగా ఈ రోజు కూటమి మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ స్థాయి నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ లు సంయుక్తంగా విడుదల చేశారు.
“ఏపీ ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం…రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం” అనే నినాదంతో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది.
టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం, బీజేపీ పేర్కొన్న అంశాలను కలగలిపి మేనిఫెస్టో రూపొందించామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే సీట్ల సర్దుబాటు చేసుకున్నామని, ప్రజలను గెలిపించేందుకే తాము కలిశామని చంద్రబాబు అన్నారు. కూటమికి రాష్ట్రంలో బీజేపీ సహకారం ఉందని, అందుకే సిద్ధార్థ నాథ్ సింగ్ నేరుగా వచ్చి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. బీజేపీ కూడా మేనిఫెస్టోకు కొన్ని సూచనలు చేసిందని, బీజేపీ కూడా ఈ మేనిఫెస్టోను ఎండార్స్ చేసిందని చెప్పారు.
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
మేనిఫెస్టోలోని కీలక అంశాలు
బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు
బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు
బీసీ కార్పోరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేయడం
బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ. 10 వేల కోట్లు
ఆధునిక పనిముట్లతో ఆదరణ పథకం అమలు
పవర్ లూం, హ్యాండ్ లూంలకు కొంత మేర ఉచిత విద్యుత్
మత్స్యకారులను ఆదుకునే కార్యక్రమాలు
డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పంచుతాం
20 లక్షల మంది యువతకు ఉపాధి
నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు
స్కిల్ గణన చేపడతాం
ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు
10 శాతం EWS రిజర్వేషన్ల అమలు
సమగ్ర ఇసుక విధానం
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు
కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడతాం
This post was last modified on April 30, 2024 7:27 pm
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…