ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో చిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రదాన పార్టీ జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును.. ఆ పార్టీ పోటీలో లేని చోట దాదాపు 18 మంది స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తునే కేటాయించారు. ఇది కేంద్ర ఎన్నికల సంఘ చేసిన పని. ఆయా అభ్యర్థుల వెనుక ఎవరు ఉన్నారనేది పక్కన పెడితే.. ఒక రాష్ట్రంలో ఒక కీలక పార్టీకి కేటాయించిన గుర్తును.. ప్రత్యర్థులకు కేటాయించ కూడదనేది సూత్రం.
కానీ, రిజిస్టర్డ్ పార్టీ కాదనే కారణంగా.. జనసేనకు కేటాయించి గాజు గ్లాసు గుర్తునే.. స్వతంత్రులకు కేటాయించింది. చిత్రం ఏంటంటే.. వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు.. తనయుడు కళ్యాణ్ చక్రవర్తి స్వతంత్రంగా పోటీ చేస్తున్న పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా.. ఆయనకు గాజు గ్లాసు గుర్తునే కేటాయించారు. ఇక, చంద్రబాబు పోటీలో ఉన్న కుప్పలో నవరంగ్ పార్టీ తరఫున స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మహిళా నాయకురాలికి కూడా.. ఈ గుర్తునే ఇచ్చారు.
దీంతో కీలక పార్టీ అధ్యర్థుల ఓట్లు చీలిపోతాయనే బెంగ కూటమి పార్టీలను వెంటాడుతోంది. ఈ నేపథ్యం లో జనసేన హుటాహుటిన హైకోర్టు తలుపు తట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. పిటిషన్ వేసింది. దీనిని తాజాగావిచారించిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే గుర్తును ఇంత మందికి ఎలా కేటాయిస్తారని నిలదీసింది. దీనిని తక్షణమే మార్చకపోతే.. తామే ఆదేశాలు ఇస్తామని తెలిపింది. అయితే.. దీనిపై మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందన్న కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
This post was last modified on April 30, 2024 3:56 pm
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…