ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో చిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రదాన పార్టీ జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును.. ఆ పార్టీ పోటీలో లేని చోట దాదాపు 18 మంది స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తునే కేటాయించారు. ఇది కేంద్ర ఎన్నికల సంఘ చేసిన పని. ఆయా అభ్యర్థుల వెనుక ఎవరు ఉన్నారనేది పక్కన పెడితే.. ఒక రాష్ట్రంలో ఒక కీలక పార్టీకి కేటాయించిన గుర్తును.. ప్రత్యర్థులకు కేటాయించ కూడదనేది సూత్రం.
కానీ, రిజిస్టర్డ్ పార్టీ కాదనే కారణంగా.. జనసేనకు కేటాయించి గాజు గ్లాసు గుర్తునే.. స్వతంత్రులకు కేటాయించింది. చిత్రం ఏంటంటే.. వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు.. తనయుడు కళ్యాణ్ చక్రవర్తి స్వతంత్రంగా పోటీ చేస్తున్న పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా.. ఆయనకు గాజు గ్లాసు గుర్తునే కేటాయించారు. ఇక, చంద్రబాబు పోటీలో ఉన్న కుప్పలో నవరంగ్ పార్టీ తరఫున స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మహిళా నాయకురాలికి కూడా.. ఈ గుర్తునే ఇచ్చారు.
దీంతో కీలక పార్టీ అధ్యర్థుల ఓట్లు చీలిపోతాయనే బెంగ కూటమి పార్టీలను వెంటాడుతోంది. ఈ నేపథ్యం లో జనసేన హుటాహుటిన హైకోర్టు తలుపు తట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. పిటిషన్ వేసింది. దీనిని తాజాగావిచారించిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే గుర్తును ఇంత మందికి ఎలా కేటాయిస్తారని నిలదీసింది. దీనిని తక్షణమే మార్చకపోతే.. తామే ఆదేశాలు ఇస్తామని తెలిపింది. అయితే.. దీనిపై మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందన్న కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
This post was last modified on April 30, 2024 3:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురై.. దాదాపు ఐదేళ్లపాటు సస్పెన్షన్ లో ఉన్న…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రధానంగా నాలుగు యాంగిల్స్ కనిపించాయి. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర…
ఇప్పుడంతా డిజిటల్ మయం. ప్రతిదీ హార్డ్ డిస్కుల్లోకి వెళ్ళిపోతుంది. చిన్న డేటాతో మొదలుపెట్టి వందల జిబి డిమాండ్ చేసే సినిమా…
సినిమాల పరంగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్కు ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరుంది. కానీ వ్యక్తిగా తాను పర్ఫెక్ట్…
తెలంగాణలో శనివారం ఒక్కసారిగా పెను కలకలమే రేగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగినట్లుగా భావిస్తున్న…
కేంద్రం ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్పై ఏపీ సీఎం, కేంద్రంలోని ఎన్డీయే సర్కారు భాగస్వామి చంద్రబాబు హర్షం వ్యక్తం…