ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో చిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రదాన పార్టీ జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును.. ఆ పార్టీ పోటీలో లేని చోట దాదాపు 18 మంది స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తునే కేటాయించారు. ఇది కేంద్ర ఎన్నికల సంఘ చేసిన పని. ఆయా అభ్యర్థుల వెనుక ఎవరు ఉన్నారనేది పక్కన పెడితే.. ఒక రాష్ట్రంలో ఒక కీలక పార్టీకి కేటాయించిన గుర్తును.. ప్రత్యర్థులకు కేటాయించ కూడదనేది సూత్రం.
కానీ, రిజిస్టర్డ్ పార్టీ కాదనే కారణంగా.. జనసేనకు కేటాయించి గాజు గ్లాసు గుర్తునే.. స్వతంత్రులకు కేటాయించింది. చిత్రం ఏంటంటే.. వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు.. తనయుడు కళ్యాణ్ చక్రవర్తి స్వతంత్రంగా పోటీ చేస్తున్న పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా.. ఆయనకు గాజు గ్లాసు గుర్తునే కేటాయించారు. ఇక, చంద్రబాబు పోటీలో ఉన్న కుప్పలో నవరంగ్ పార్టీ తరఫున స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మహిళా నాయకురాలికి కూడా.. ఈ గుర్తునే ఇచ్చారు.
దీంతో కీలక పార్టీ అధ్యర్థుల ఓట్లు చీలిపోతాయనే బెంగ కూటమి పార్టీలను వెంటాడుతోంది. ఈ నేపథ్యం లో జనసేన హుటాహుటిన హైకోర్టు తలుపు తట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. పిటిషన్ వేసింది. దీనిని తాజాగావిచారించిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే గుర్తును ఇంత మందికి ఎలా కేటాయిస్తారని నిలదీసింది. దీనిని తక్షణమే మార్చకపోతే.. తామే ఆదేశాలు ఇస్తామని తెలిపింది. అయితే.. దీనిపై మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందన్న కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
This post was last modified on April 30, 2024 3:56 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…