రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే రాజకీయం కళ్ల ముందు కనిపిస్తోంది. బలమైన అభ్యర్థులు.. బలమైన ప్రచారంతో ఈ రెండు పార్టీలు కూడా.. దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. అయితే.. ఎటొచ్చీ.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ కంటే.. ఆ పార్టీ నేతల బలమే ఎక్కువగా ఉంది.
అవే.. అద్దంకి. పరుచూరు. ఈ రెండు నియోజకవర్గాలు కూడా.. గత 2019లో వైసీపీ హవాను తట్టుకుని టీడీపీ గెలుచుకున్న సునాయాస స్థానాలు కావడం గమనార్హం. ఇక్కడ ఉన్న ఇద్దరు నాయకులు.. టీడీపీ కంటే కూడా.. ఒకింత బలంగా ఉన్న నేతలేనని స్థానికులు చెబుతున్నారు. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్.. వరుసగా నాలుగోసారి పోటీలో ఉన్నారు. ఇక, పరుచూరులో ఏలూరి సాంబశివరావు.. వరుసగా మూడో సారి తలపడుతున్నారు. కానీ, ఇద్దరూకూడా గెలుపు గుర్రం ఎక్కుతారనడంలో సందేహం లేదని చెబుతు న్నారు.
పరుచూరు విషయాన్ని తీసుకుంటే.. ప్రజలతో మమేకం కావడం.. ప్రజలతోనే ఉండడం.. కరోనా సమయం లోనూ వారికి అండగా నిలిచిన పరిస్థితి ఏలూరికి ప్లస్ అవుతోంది. అంతేకాదు.. వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం కావడంతో ఆయన పోకస్ కూడా ఎక్కువగా రైతులపైనే చేశారు. వారికి అండగా ఉన్నారు. ప్రతి విషయంలోనూ నేనున్నానంటూ.. ముందుకు వచ్చారు. నీటి నుంచి విత్తనాలు.. పురుగుల మందుల దాకా.. రైతలను చేయి పట్టినడిపిస్తున్నారు. కరోనా టైంలో రైతులకు ఉచితంగా మందు స్పేయర్లు పంపిణీ చేశారు.
దీంతో ఏలూరిపై అన్ని వర్గాల్లోనూ అభిమానం పెరిగింది. పైగా వివాదాలకు దూరంగా ఉండడం ఆయనకు కలిసి వచ్చిన అంశం. ఇక, అద్దంకిలో గొట్టిపాటి రవి కూడా సొంత ఇమేజ్ ను నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. 2014లో వైసీపీ తరఫున ఆయన పోటీ చేసి విజయం దక్కించుకున్నా.. తర్వాత పరిణామాలతో టీడీపీకి జై కొట్టినా.. ప్రజలు ఆయనను 2019లో విజయం దక్కేలా చేశారు. ఇక, ఇది వ్యక్తిగత ఇమేజ్తోనే సాధ్యమైందన్న విషయంలో సందేహం లేదు.
అదేవిధంగా స్తానికులు.. పిలిస్తే పలుకుతాడు.. అనే మాట ప్రతి గడపలోనూ వినిపిస్తోంది. వైసీపీ ఈ రెండు నియోజకవర్గాల్లోనూ వీరి హవా తగ్గించేందుకు కేసులు పెట్టినా.. కోర్టులకు వెళ్లిన తీరు.. నిలబడిన తీరు వంటివి.. వారిని హీరోలుగా నే నిలబెట్టింది. మొత్తంగా చూస్తే.. ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపు వీరిదేనని స్థానికంగా వినిపిస్తున్న మాట.
This post was last modified on April 30, 2024 11:58 am
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…