ఎన్నికల్లో వ్యూహాలు ఉండడం వేరు.. ఎదుటి పార్టీలను దెబ్బ కొట్టాలన్న కుయుక్తులు ఉండడం వేరు. వ్యూహాలు ఎన్నయినా.. ప్రత్యర్థులు ప్రతివ్యూహాలతో విరుచుకుపడే అవకాశం ఉంటుంది. దీంతో రాజకీ యాలు రాజకీయాలుగానే కొనసాగుతాయి. కానీ, కుయుక్తులు పన్ని.. ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహాలు వేసినప్పుడు మాత్రం.. ఇబ్బందులు తప్పవు. ఇలాంటి రాజకీయాల్లో బీజేపీ ఆరితేరిపోయింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ను దెబ్బ కొట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అయితే.. ఇవి భౌతికంగా కొన్ని చోట్ల కనిపిస్తే.. లోపాయికారీగా మరికొన్ని చోట్ల కనిపిస్తోంది. ఇలాంటి వాటి నుంచి కాంగ్రెస్ బయట పడే పరిస్థితి లేకపోవడం గమనార్హం. అంటే.. ఎన్నికల్లో నామినేషన్లు వేసిన తర్వాత.. కూడా బీజేపీ తన రాజకీయలను కొనసాగిస్తోంది. కీలక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నామినేషన్లు వేసిన తర్వాత కూడా.. లోబరుచుకుంటోంది. ఫలితంగా ఆయా నియోజకవర్గాల్లో అసలు పోటీ నే లేకుండా పోతోంది. బీజేపీ ఏకపక్షంగా విజయందక్కించుకుంటోంది.
మొన్న గుజరాత్ రాష్ట్రంలోని వజ్రాల వ్యాపారం జరిగే.. సూరత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వేసిన నామినేషన్ను తిరస్కరించారు. ఆయనకు మద్దతుగా సంతకాలు చేసిన వారు.. సరిగా చేయలేదన్న కారణంతో ఆయనను పక్కన పెట్టారు. ఇదే నిజమని అనుకుంటే.. సదరు కాంగ్రెస్ అభ్యర్థి బయటకు వచ్చి.. ఆందోళన చేయాలి.. నిజానిజాలు తెలియజేయాలని కోరాలి. కానీ, అలాంటిదేమీ లేకుండా.. సదరు అభ్యర్థి.. బ్రిటన్ పర్యటనకు వెళ్లిపోయారు. అంటే.. ఏం జరిగిందో అందరకి తెలుస్తోంది.
కట్ చేస్తే.. ఈ రోజు మధ్యప్రదేశ్లోని అత్యంత కీలకమైన వస్త్ర వ్యాపారం ఇండోర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అబ్యర్థి అక్షయ్ కాంతి బమ్.. తన నామినేషన్ను ఎలాంటి కారణం లేకుండా వెనక్కి తీసుకున్నారు. అంతేకాదు.. దీనిని వెనక్కి తీసుకునేందుకు ఆయన కలెక్టర్ కార్యాలయానికి బీజేపీ నాయకులతో కలిసి వెళ్లారు. అనంతరం అటు నుంచి అటే.. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా ఇండోర్ కూడా.. దాదాపు ఏకపక్షంగా బీజేపీకి దక్కనుందన్న మాట.
This post was last modified on April 29, 2024 5:27 pm
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…