Political News

ఏపీలో పింఛ‌న్ల ర‌గ‌డ‌.. చంద్ర‌బాబు కొత్త పాయింట్ !

మే 1వ తేదీకి మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉండ‌డం.. ఇంటింటికీ వెళ్లి  ఇచ్చే పింఛ‌న్ల వ్య‌వ‌హారం నిలిచిపోవ‌డం నేప‌థ్యంలో మ‌రోసారి ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా వివాదానికి దారితీసింది. ఎన్నిక‌ల సంఘం ఆదేశాల నేప‌థ్యంలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ప్ర‌స్తుతం స‌స్పెండ్ చేశారు. దీంతో ఏప్రిల్‌లో పింఛ‌న్ల వ్య‌వ‌హారం.. నానా ఇబ్బందులుగా మారింది. ఎండ‌లు త‌ట్టుకోలేక‌.. పింఛ‌న్ల కోసం వ‌చ్చిన వారు.. దాదాపు 32 మంది మ‌ర‌ణించార‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలే చెబుతున్నాయి.

పైగా ఈ వ్య‌వ‌హారం రాజకీయ దుమారం రేపింది. మ‌ర‌ణాలు.. మా లెక్క కాదు.. టీడీపీ పాప‌మేన‌ని వైసీపీ చెబితే.. మాది కాదువారిదే అని ఎదురుదాడి టీడీపీ నుంచి వ్య‌క్త‌మైంది. ఎలా చూసుకున్నా.. న‌ష్ట‌పోయింది మాత్రం ఆయా కుటుంబాలే. ఇక‌, ఇప్పుడు మే 1వ‌చ్చింది. ఈ క్ర‌మంలో విపక్షాల నుంచి ఇంటింటికీ తీసుకువెళ్లి పింఛ‌న్లు ఇవ్వాల‌నే డిమాండ్ తెర‌మీదికి వ‌చ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచే ప్ర‌తిప‌క్షాలు ఈ విష‌యంపై ఇటు ఎన్నిక‌ల సంఘానికి, అటు ప్ర‌భుత్వానికి కూడా విన్న‌వించాయి.

కానీ, ప్ర‌తిప‌క్షాలు చెప్పిన‌ట్టు ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ఒప్పుకోలేదు. కేవ‌లం మంచంలో ఉన్న రోగుల‌కు మాత్ర‌మే ఇంటింటి పంపిణీ చేస్తామ‌ని తెలిపింది. మిగిలిన వారికి బ్యాంకుల్లో వేస్తామ‌ని చెప్పింది. అయితే.. అస‌లు మ‌త‌ల‌బు అంతా ఇక్క‌డే ఉంది. గ‌తంలో స‌చివాల‌యాల్లో ఇచ్చిన‌ప్పుడే.. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు ప‌డ్డారు. ఇక‌, ఇప్పుడు బ్యాంకులో వేయ‌డం అంటే. మ‌రింత న‌ర‌కం క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్పందించారు.

బాబు.. కొత్త పాయింట్ లేవ‌నెత్తారు. రాష్ట్రంలో సుమారు 65 ల‌క్ష‌ల మంది పింఛ‌ను దారులు ఉన్నార‌ని.. వారి బ్యాంకు అకౌంట్లు త‌మ వ‌ద్ద‌లేవ‌ని.. గ‌త నెల‌లోనే ప్ర‌భుత్వం చెప్పింద‌ని.. కానీ, ఇప్పుడు 48 ల‌క్ష‌ల మంది బ్యాంకు ఖాతాలు ఉన్న‌ట్టు ఎలా చెబుతుంద‌న్న‌ది బాబు ప్ర‌శ్న‌. కాబ‌ట్టి ఇదంతా ఉద్దేశ పూర్వ‌క‌మే నని.. ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల‌న్న‌.. త‌మ డిమాండ్ నెర‌వేర్చి తీరాల్సిందేన‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. కానీ, ఎన్నిక‌ల సంఘం త‌మ‌కు ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల‌ని చెప్ప‌లేద‌న్న‌ది ప్ర‌భుత్వ వాద‌న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on April 29, 2024 1:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

3 minutes ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

1 hour ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

2 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

2 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

2 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

6 hours ago