మే 1వ తేదీకి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడం.. ఇంటింటికీ వెళ్లి ఇచ్చే పింఛన్ల వ్యవహారం నిలిచిపోవడం నేపథ్యంలో మరోసారి ఈ వ్యవహారం రాజకీయంగా వివాదానికి దారితీసింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థను ప్రస్తుతం సస్పెండ్ చేశారు. దీంతో ఏప్రిల్లో పింఛన్ల వ్యవహారం.. నానా ఇబ్బందులుగా మారింది. ఎండలు తట్టుకోలేక.. పింఛన్ల కోసం వచ్చిన వారు.. దాదాపు 32 మంది మరణించారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
పైగా ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. మరణాలు.. మా లెక్క కాదు.. టీడీపీ పాపమేనని వైసీపీ చెబితే.. మాది కాదువారిదే అని ఎదురుదాడి టీడీపీ నుంచి వ్యక్తమైంది. ఎలా చూసుకున్నా.. నష్టపోయింది మాత్రం ఆయా కుటుంబాలే. ఇక, ఇప్పుడు మే 1వచ్చింది. ఈ క్రమంలో విపక్షాల నుంచి ఇంటింటికీ తీసుకువెళ్లి పింఛన్లు ఇవ్వాలనే డిమాండ్ తెరమీదికి వచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచే ప్రతిపక్షాలు ఈ విషయంపై ఇటు ఎన్నికల సంఘానికి, అటు ప్రభుత్వానికి కూడా విన్నవించాయి.
కానీ, ప్రతిపక్షాలు చెప్పినట్టు ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. కేవలం మంచంలో ఉన్న రోగులకు మాత్రమే ఇంటింటి పంపిణీ చేస్తామని తెలిపింది. మిగిలిన వారికి బ్యాంకుల్లో వేస్తామని చెప్పింది. అయితే.. అసలు మతలబు అంతా ఇక్కడే ఉంది. గతంలో సచివాలయాల్లో ఇచ్చినప్పుడే.. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. ఇక, ఇప్పుడు బ్యాంకులో వేయడం అంటే. మరింత నరకం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
బాబు.. కొత్త పాయింట్ లేవనెత్తారు. రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది పింఛను దారులు ఉన్నారని.. వారి బ్యాంకు అకౌంట్లు తమ వద్దలేవని.. గత నెలలోనే ప్రభుత్వం చెప్పిందని.. కానీ, ఇప్పుడు 48 లక్షల మంది బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు ఎలా చెబుతుందన్నది బాబు ప్రశ్న. కాబట్టి ఇదంతా ఉద్దేశ పూర్వకమే నని.. ఇంటింటికీ వెళ్లి ఇవ్వాలన్న.. తమ డిమాండ్ నెరవేర్చి తీరాల్సిందేనని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, ఎన్నికల సంఘం తమకు ఇంటింటికీ వెళ్లి ఇవ్వాలని చెప్పలేదన్నది ప్రభుత్వ వాదన. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 29, 2024 1:35 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…