Political News

మేనిఫెస్టో ఎఫెక్ట్‌: జ‌గ‌న్ గురించి జ‌నం టాక్ మారిందే!

ఏపీ అధికార పార్టీ వైసీపీ  గురించి.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న టాక్ ఒక‌టి. మ‌రోసారి జ‌గ‌న్ వ‌చ్చేస్తున్నా ర‌ని.. కూట‌మివ‌చ్చినా.. ఆయ‌న గెలుపు ఖాయ‌మ‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. దీనికి కార‌ణం కూట‌మిలో టికెట్ల కేటాయింపు నుంచి అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిల‌ప‌డం వ‌ర‌కు పెద్ద ఎత్తున ర‌గ‌డ చోటు చేసుకోవ‌డ‌మే. అయితే. ఇది అయిపోయింది. ఇక‌, ఇప్పుడు వైసీపీ వంతు వ‌చ్చింది. వైసీపీ వ‌స్తే.. పేద‌ల బ‌తుకులు మారిపోతాయ‌ని ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌చారం చేసుకున్నారు.

అందుకే అనేక క‌ష్టాల‌కు ఓర్చుకుని కూడా.. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన‌వ‌న్నీ చేశార‌ని 99 శాతం  ప‌థ‌కాలు అమ‌లు చేశార‌ని నాయ‌కులు చెప్పుకొచ్చారు. ఇదే విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ కూడా మేనిఫెస్టో విడుద‌ల కార్య‌క్ర‌మంలో చెప్పుకొచ్చారు. ఇక‌, కొత్త మేనిఫెస్టోను కూడా విడుద‌ల చేశారు.ఇక‌, ఇప్పుడు ఈ మేనిఫెస్టో – ఆ మేనిఫెస్టోల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ గురించి జ‌నం టాక్ మారిపోయింది. మ‌ద్య నిషేధం చేయ‌లేదు. సీపీఎస్ ర‌ద్దు చేయ‌లేదు. జాబ్ క్యాలెండ‌ర్ తీసుకురాలేదు. మెగా డీఎస్సీ వేయ‌లేదు.

ఇవి పాత మేనిఫెస్టోలో సీఎం జ‌గ‌న్ చేయ‌ని హామీలు. వీటిని ఆయన క‌నీసం ప్ర‌స్తావించ‌లేక‌పోయారు. ఇదే విషయం సామాజిక మాధ్య‌మాల్లో చ‌ర్చ‌గా మారింది. అంతేకాదు.. కేంద్రంతో పోరాడి సాధించే విష‌యాలు ఏవీ మేనిఫెస్టోలో పెట్ట‌క‌పోవ‌డం కూడా గ‌మ‌నార్హం. ఈ విష‌యం కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఎందుకంటే. క‌నీసం.. ప్ర‌త్యేక‌హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిలుపుద‌ల వంటివాటికి ప్రాధాన్యం లేకుండా పోయాయి. ఇక‌, క‌డ‌ప ఉక్కు ప‌రిస్థితి గంద‌ర గోళంగా మారింది.

ఈ ప‌రిణామాల‌ను అంచ‌నా వేసుకున్న జ‌నాలు.. జ‌గ‌న్‌లో పోరాడే శ‌క్తి లేద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలు స్తోంది. కేవ‌లం అప్పులు చేయ‌డం ద్వారా మాత్ర‌మే ప‌థ‌కాలు అమ‌లు చేసేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తు న్నార‌ని జ‌నాలు చెప్పుకొంటున్నారు. క‌నీసం ఉద్యోగ క్యాలెండ‌ర్ ఇస్తామ‌ని కానీ.. మెగా డీఎస్సీ వేస్తామ‌న్న హామీని కానీ.. జ‌గ‌న్ ఇవ్వ‌లేక పోయారు. మొత్తంగా చూస్తే.. మేనిఫెస్టోకు ముందు.. త‌ర్వాత‌.. జ‌గ‌న్ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయింద‌నేది జ‌నాల టాక్‌. 

This post was last modified on April 29, 2024 9:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

9 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago