ఏపీ అధికార పార్టీ వైసీపీ గురించి.. నిన్న మొన్నటి వరకు ఉన్న టాక్ ఒకటి. మరోసారి జగన్ వచ్చేస్తున్నా రని.. కూటమివచ్చినా.. ఆయన గెలుపు ఖాయమని.. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దీనికి కారణం కూటమిలో టికెట్ల కేటాయింపు నుంచి అభ్యర్థులను బరిలో నిలపడం వరకు పెద్ద ఎత్తున రగడ చోటు చేసుకోవడమే. అయితే. ఇది అయిపోయింది. ఇక, ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. వైసీపీ వస్తే.. పేదల బతుకులు మారిపోతాయని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకున్నారు.
అందుకే అనేక కష్టాలకు ఓర్చుకుని కూడా.. 2019లో మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశారని 99 శాతం పథకాలు అమలు చేశారని నాయకులు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. ఇక, కొత్త మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు.ఇక, ఇప్పుడు ఈ మేనిఫెస్టో – ఆ మేనిఫెస్టోలను పరిశీలించిన తర్వాత.. జగన్ గురించి జనం టాక్ మారిపోయింది. మద్య నిషేధం చేయలేదు. సీపీఎస్ రద్దు చేయలేదు. జాబ్ క్యాలెండర్ తీసుకురాలేదు. మెగా డీఎస్సీ వేయలేదు.
ఇవి పాత మేనిఫెస్టోలో సీఎం జగన్ చేయని హామీలు. వీటిని ఆయన కనీసం ప్రస్తావించలేకపోయారు. ఇదే విషయం సామాజిక మాధ్యమాల్లో చర్చగా మారింది. అంతేకాదు.. కేంద్రంతో పోరాడి సాధించే విషయాలు ఏవీ మేనిఫెస్టోలో పెట్టకపోవడం కూడా గమనార్హం. ఈ విషయం కూడా చర్చకు వస్తోంది. ఎందుకంటే. కనీసం.. ప్రత్యేకహోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటివాటికి ప్రాధాన్యం లేకుండా పోయాయి. ఇక, కడప ఉక్కు పరిస్థితి గందర గోళంగా మారింది.
ఈ పరిణామాలను అంచనా వేసుకున్న జనాలు.. జగన్లో పోరాడే శక్తి లేదని నిర్ణయించుకున్నట్టు తెలు స్తోంది. కేవలం అప్పులు చేయడం ద్వారా మాత్రమే పథకాలు అమలు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తు న్నారని జనాలు చెప్పుకొంటున్నారు. కనీసం ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని కానీ.. మెగా డీఎస్సీ వేస్తామన్న హామీని కానీ.. జగన్ ఇవ్వలేక పోయారు. మొత్తంగా చూస్తే.. మేనిఫెస్టోకు ముందు.. తర్వాత.. జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందనేది జనాల టాక్.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…