Political News

వైసీపీకి మ‌రో చిక్కు..  ఈసీ సీరియ‌స్ అయితే క‌ష్ట‌మే

ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద చిక్కు ఎదురైంది. ఆ పార్టీ ప్ర‌స్తుత ఎన్నికల్లో జోరుగా ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలోనూ.. ప్ర‌ధాన మీడియా అయినా.. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లోనూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలో ఆయా ప్ర‌క‌ట‌న వ్య‌వ‌హారం గుదిబండ‌గా మారింది. ఈ ప్ర‌క‌ట‌న‌ల్లో ప్ర‌భుత్వ లోగోను వినియోగిస్తుండ‌డం వివాదానికి దారి తీసింది.

దీనిపై నేరుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ ఇస్తున్న ప్ర‌క‌ట‌న‌లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. వైసీపీ నేత‌లు, పార్టీ ఇస్తున్న ప్ర‌క‌ట‌న‌ల్లో.. ఎంసీఎంసీ లోగోలు ఉన్నా.. ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాల‌తో స‌హా ఫిర్యాదులు చేశారు. అంతేకాదు.. వైసీపీ ఇస్తున్న ప్ర‌చారాలు.. ప్ర‌భుత్వ‌మే ఇస్తున్న‌ట్టుగా పేర్కొంటున్న‌ట్టు అయింద‌న్నారు.

దీని ఖ‌ర్చు రూ.కోట్ల‌లో ఉంటుంద‌ని.. మ‌రి దానిని ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి ఖ‌ర్చు పెడుతున్నారా?  లేక‌.. వైసీపీ ఖ‌జానా నుంచి ఖ‌ర్చు పెడుతున్నారా? అనేది తేలాల్సి ఉంద‌న్నారు. దీనిపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకుని వైసీపీ నుంచి ఆ ఖ‌ర్చును రాబ‌ట్ట‌డంతోపాటు.. ఎంసీఎంసీ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంపై ప్ర‌భుత్వానికి జ‌రిమానా విధించాల‌ని.. సంబంధిత అధికారుల‌ను త‌క్ష‌ణ‌మే స‌స్పెండ్ చేయాల‌ని కోరారు. దీంతో ఈ వ్య‌వ‌హారం కీల‌క ఎన్నిక‌ల‌కు ముందు వివాదంగా మారింది. మ‌రి కేంద్ర ఎన్నిక‌ల సంఘం దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on April 29, 2024 8:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 minutes ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

2 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

2 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

2 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

2 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

6 hours ago