ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద చిక్కు ఎదురైంది. ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ.. ప్రధాన మీడియా అయినా.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ఆయా ప్రకటన వ్యవహారం గుదిబండగా మారింది. ఈ ప్రకటనల్లో ప్రభుత్వ లోగోను వినియోగిస్తుండడం వివాదానికి దారి తీసింది.
దీనిపై నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ ఇస్తున్న ప్రకటనలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) పక్షపాతంగా వ్యవహరిస్తోందని.. వైసీపీ నేతలు, పార్టీ ఇస్తున్న ప్రకటనల్లో.. ఎంసీఎంసీ లోగోలు ఉన్నా.. పట్టించుకోవడం లేదని.. ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. అంతేకాదు.. వైసీపీ ఇస్తున్న ప్రచారాలు.. ప్రభుత్వమే ఇస్తున్నట్టుగా పేర్కొంటున్నట్టు అయిందన్నారు.
దీని ఖర్చు రూ.కోట్లలో ఉంటుందని.. మరి దానిని ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నారా? లేక.. వైసీపీ ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నారా? అనేది తేలాల్సి ఉందన్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని వైసీపీ నుంచి ఆ ఖర్చును రాబట్టడంతోపాటు.. ఎంసీఎంసీ నిబంధనలు పాటించకపోవడంపై ప్రభుత్వానికి జరిమానా విధించాలని.. సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో ఈ వ్యవహారం కీలక ఎన్నికలకు ముందు వివాదంగా మారింది. మరి కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on April 29, 2024 8:05 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…