Political News

వైసీపీకి మ‌రో చిక్కు..  ఈసీ సీరియ‌స్ అయితే క‌ష్ట‌మే

ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద చిక్కు ఎదురైంది. ఆ పార్టీ ప్ర‌స్తుత ఎన్నికల్లో జోరుగా ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలోనూ.. ప్ర‌ధాన మీడియా అయినా.. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లోనూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలో ఆయా ప్ర‌క‌ట‌న వ్య‌వ‌హారం గుదిబండ‌గా మారింది. ఈ ప్ర‌క‌ట‌న‌ల్లో ప్ర‌భుత్వ లోగోను వినియోగిస్తుండ‌డం వివాదానికి దారి తీసింది.

దీనిపై నేరుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ ఇస్తున్న ప్ర‌క‌ట‌న‌లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. వైసీపీ నేత‌లు, పార్టీ ఇస్తున్న ప్ర‌క‌ట‌న‌ల్లో.. ఎంసీఎంసీ లోగోలు ఉన్నా.. ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాల‌తో స‌హా ఫిర్యాదులు చేశారు. అంతేకాదు.. వైసీపీ ఇస్తున్న ప్ర‌చారాలు.. ప్ర‌భుత్వ‌మే ఇస్తున్న‌ట్టుగా పేర్కొంటున్న‌ట్టు అయింద‌న్నారు.

దీని ఖ‌ర్చు రూ.కోట్ల‌లో ఉంటుంద‌ని.. మ‌రి దానిని ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి ఖ‌ర్చు పెడుతున్నారా?  లేక‌.. వైసీపీ ఖ‌జానా నుంచి ఖ‌ర్చు పెడుతున్నారా? అనేది తేలాల్సి ఉంద‌న్నారు. దీనిపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకుని వైసీపీ నుంచి ఆ ఖ‌ర్చును రాబ‌ట్ట‌డంతోపాటు.. ఎంసీఎంసీ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంపై ప్ర‌భుత్వానికి జ‌రిమానా విధించాల‌ని.. సంబంధిత అధికారుల‌ను త‌క్ష‌ణ‌మే స‌స్పెండ్ చేయాల‌ని కోరారు. దీంతో ఈ వ్య‌వ‌హారం కీల‌క ఎన్నిక‌ల‌కు ముందు వివాదంగా మారింది. మ‌రి కేంద్ర ఎన్నిక‌ల సంఘం దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

45 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago