Political News

వైసీపీకి మ‌రో చిక్కు..  ఈసీ సీరియ‌స్ అయితే క‌ష్ట‌మే

ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద చిక్కు ఎదురైంది. ఆ పార్టీ ప్ర‌స్తుత ఎన్నికల్లో జోరుగా ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలోనూ.. ప్ర‌ధాన మీడియా అయినా.. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లోనూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలో ఆయా ప్ర‌క‌ట‌న వ్య‌వ‌హారం గుదిబండ‌గా మారింది. ఈ ప్ర‌క‌ట‌న‌ల్లో ప్ర‌భుత్వ లోగోను వినియోగిస్తుండ‌డం వివాదానికి దారి తీసింది.

దీనిపై నేరుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ ఇస్తున్న ప్ర‌క‌ట‌న‌లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. వైసీపీ నేత‌లు, పార్టీ ఇస్తున్న ప్ర‌క‌ట‌న‌ల్లో.. ఎంసీఎంసీ లోగోలు ఉన్నా.. ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాల‌తో స‌హా ఫిర్యాదులు చేశారు. అంతేకాదు.. వైసీపీ ఇస్తున్న ప్ర‌చారాలు.. ప్ర‌భుత్వ‌మే ఇస్తున్న‌ట్టుగా పేర్కొంటున్న‌ట్టు అయింద‌న్నారు.

దీని ఖ‌ర్చు రూ.కోట్ల‌లో ఉంటుంద‌ని.. మ‌రి దానిని ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి ఖ‌ర్చు పెడుతున్నారా?  లేక‌.. వైసీపీ ఖ‌జానా నుంచి ఖ‌ర్చు పెడుతున్నారా? అనేది తేలాల్సి ఉంద‌న్నారు. దీనిపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకుని వైసీపీ నుంచి ఆ ఖ‌ర్చును రాబ‌ట్ట‌డంతోపాటు.. ఎంసీఎంసీ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంపై ప్ర‌భుత్వానికి జ‌రిమానా విధించాల‌ని.. సంబంధిత అధికారుల‌ను త‌క్ష‌ణ‌మే స‌స్పెండ్ చేయాల‌ని కోరారు. దీంతో ఈ వ్య‌వ‌హారం కీల‌క ఎన్నిక‌ల‌కు ముందు వివాదంగా మారింది. మ‌రి కేంద్ర ఎన్నిక‌ల సంఘం దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on April 29, 2024 8:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బావగారు వివాదం….సుడిగాలి సుధీర్ మెడకు

యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…

3 minutes ago

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…

1 hour ago

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…

2 hours ago

కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికింది

ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…

2 hours ago

తారక్ & రజని రెండుసార్లు తలపడతారా

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…

2 hours ago

రెండు రాష్ట్రాల‌కూ ఊర‌ట‌.. విభ‌జ‌న చ‌ట్టంపై కేంద్రం క‌స‌రత్తు!

2014లో ఉమ్మ‌డి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆ త‌ర్వాత‌.. కేంద్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో..…

3 hours ago