Political News

వైసీపీకి మ‌రో చిక్కు..  ఈసీ సీరియ‌స్ అయితే క‌ష్ట‌మే

ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద చిక్కు ఎదురైంది. ఆ పార్టీ ప్ర‌స్తుత ఎన్నికల్లో జోరుగా ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలోనూ.. ప్ర‌ధాన మీడియా అయినా.. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లోనూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలో ఆయా ప్ర‌క‌ట‌న వ్య‌వ‌హారం గుదిబండ‌గా మారింది. ఈ ప్ర‌క‌ట‌న‌ల్లో ప్ర‌భుత్వ లోగోను వినియోగిస్తుండ‌డం వివాదానికి దారి తీసింది.

దీనిపై నేరుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ ఇస్తున్న ప్ర‌క‌ట‌న‌లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. వైసీపీ నేత‌లు, పార్టీ ఇస్తున్న ప్ర‌క‌ట‌న‌ల్లో.. ఎంసీఎంసీ లోగోలు ఉన్నా.. ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాల‌తో స‌హా ఫిర్యాదులు చేశారు. అంతేకాదు.. వైసీపీ ఇస్తున్న ప్ర‌చారాలు.. ప్ర‌భుత్వ‌మే ఇస్తున్న‌ట్టుగా పేర్కొంటున్న‌ట్టు అయింద‌న్నారు.

దీని ఖ‌ర్చు రూ.కోట్ల‌లో ఉంటుంద‌ని.. మ‌రి దానిని ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి ఖ‌ర్చు పెడుతున్నారా?  లేక‌.. వైసీపీ ఖ‌జానా నుంచి ఖ‌ర్చు పెడుతున్నారా? అనేది తేలాల్సి ఉంద‌న్నారు. దీనిపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకుని వైసీపీ నుంచి ఆ ఖ‌ర్చును రాబ‌ట్ట‌డంతోపాటు.. ఎంసీఎంసీ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంపై ప్ర‌భుత్వానికి జ‌రిమానా విధించాల‌ని.. సంబంధిత అధికారుల‌ను త‌క్ష‌ణ‌మే స‌స్పెండ్ చేయాల‌ని కోరారు. దీంతో ఈ వ్య‌వ‌హారం కీల‌క ఎన్నిక‌ల‌కు ముందు వివాదంగా మారింది. మ‌రి కేంద్ర ఎన్నిక‌ల సంఘం దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on April 29, 2024 8:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

7 minutes ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

22 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago