Political News

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే ప‌రిస్థితి ఉండేది. త‌ర్వాత వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. మూడు రాజ‌ధానులు అని ప్ర‌క‌టిం చారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్య‌మాలు జ‌రిగాయి. నిరాహార దీక్ష‌లు కూడా సాగాయి. 2020-22 మ‌ధ్య‌ పెను యుద్ధ‌మే సాగింది. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చాయి. మ‌రి ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? అంటే.. సీఎం జ‌గ‌న్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. తాము గెలిచిన త‌ర్వాత‌.. విశాఖ నుంచే పాల‌న సాగిస్తామ‌ని మేనిఫెస్టో విడుద‌ల సంద‌ర్భంగా తేల్చి చెప్పారు.

ఒక్క ఈ న‌గ‌రం గురించే కాదు.. క‌ర్నూలును న్యాయ‌రాజ‌ధానిగా కూడా చేస్తామ‌ని చెప్పారు. అంటే.. మొత్తంగా మూడు రాజ‌ధా నుల‌కే వైసీపీ క‌ట్టుబ‌డి ప‌నిచేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌ధానిని కేవ‌లం శాస‌న రాజ‌ధాని వ‌ర‌కే ప‌రిమితం చేయ‌నున్నారు. ఈ ప‌రిణామాల‌పై జ‌నాలు తేల్చుకోవాల్సి ఉంటుంది. సీఎం జ‌గ‌న్ చెప్పిన దాని ప్ర‌కారం.. వ‌చ్చే ఐదేళ్ల పాటు కూడా.. రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఎలాంటి మార్పులూ ఉండే అవ‌కాశం లేదు. ప్ర‌స్తుతం  ఎలాంటి ప‌రిస్థితి ఉంటుందో అదే కొన‌సాగ‌నుంది. అంతేకాదు.. సీఎం కార్యాల‌యం కూడా.. విశాఖ‌కు వెళ్లిపోనుంది.

ఈ ప‌రిణామంపై జ‌నాలు స్పందిస్తారా?  లేక‌.. జ‌గ‌న్ చెప్పిన‌ట్టే ఆయ‌న వెంట న‌డుస్తారా?  అనేది జూన్ 4న తేల‌నుంది. ఇదిలా వుంటే.. ఎన్డీయే కూట‌మి ప‌క్షాలు మాత్రం ముక్త‌కంఠంతో అమ‌రావ‌తినే రాజ‌ధానిని చేస్తామ‌ని.. అధికారం చేప‌ట్టిన మ‌రుక్ష‌ణం నుంచి కూడా.. అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులను ప‌రుగులు పెట్టిస్తామ‌ని చెబుతున్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు, నారా లోకేష్ , ప‌వ‌న్ కూడా చాలా సీరియ‌స్‌నేగా ఉన్నారు. వీరు చెబుతున్న‌ట్టు ఎన్నిక‌లు పూర్తిగానే పంతం పట్టిన‌ట్టు.. రాజ‌ధాని నిర్మాణం పూర్త‌యితే.. వ‌చ్చే మూడేళ్ల‌లోనే పూర్తిస్థాయిలో ఇది క‌ళ్ల ముందు క‌నిపించ‌నుంది. ఏదైనా.. ఇప్పుడు జ‌నం చేతిలో రాజ‌ధాని నిర్మాణం ఉంద‌నేది వాస్త‌వం.

This post was last modified on April 28, 2024 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

1 hour ago

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

3 hours ago

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

4 hours ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

5 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

5 hours ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

6 hours ago