Political News

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే ప‌రిస్థితి ఉండేది. త‌ర్వాత వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. మూడు రాజ‌ధానులు అని ప్ర‌క‌టిం చారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్య‌మాలు జ‌రిగాయి. నిరాహార దీక్ష‌లు కూడా సాగాయి. 2020-22 మ‌ధ్య‌ పెను యుద్ధ‌మే సాగింది. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చాయి. మ‌రి ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? అంటే.. సీఎం జ‌గ‌న్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. తాము గెలిచిన త‌ర్వాత‌.. విశాఖ నుంచే పాల‌న సాగిస్తామ‌ని మేనిఫెస్టో విడుద‌ల సంద‌ర్భంగా తేల్చి చెప్పారు.

ఒక్క ఈ న‌గ‌రం గురించే కాదు.. క‌ర్నూలును న్యాయ‌రాజ‌ధానిగా కూడా చేస్తామ‌ని చెప్పారు. అంటే.. మొత్తంగా మూడు రాజ‌ధా నుల‌కే వైసీపీ క‌ట్టుబ‌డి ప‌నిచేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌ధానిని కేవ‌లం శాస‌న రాజ‌ధాని వ‌ర‌కే ప‌రిమితం చేయ‌నున్నారు. ఈ ప‌రిణామాల‌పై జ‌నాలు తేల్చుకోవాల్సి ఉంటుంది. సీఎం జ‌గ‌న్ చెప్పిన దాని ప్ర‌కారం.. వ‌చ్చే ఐదేళ్ల పాటు కూడా.. రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఎలాంటి మార్పులూ ఉండే అవ‌కాశం లేదు. ప్ర‌స్తుతం  ఎలాంటి ప‌రిస్థితి ఉంటుందో అదే కొన‌సాగ‌నుంది. అంతేకాదు.. సీఎం కార్యాల‌యం కూడా.. విశాఖ‌కు వెళ్లిపోనుంది.

ఈ ప‌రిణామంపై జ‌నాలు స్పందిస్తారా?  లేక‌.. జ‌గ‌న్ చెప్పిన‌ట్టే ఆయ‌న వెంట న‌డుస్తారా?  అనేది జూన్ 4న తేల‌నుంది. ఇదిలా వుంటే.. ఎన్డీయే కూట‌మి ప‌క్షాలు మాత్రం ముక్త‌కంఠంతో అమ‌రావ‌తినే రాజ‌ధానిని చేస్తామ‌ని.. అధికారం చేప‌ట్టిన మ‌రుక్ష‌ణం నుంచి కూడా.. అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులను ప‌రుగులు పెట్టిస్తామ‌ని చెబుతున్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు, నారా లోకేష్ , ప‌వ‌న్ కూడా చాలా సీరియ‌స్‌నేగా ఉన్నారు. వీరు చెబుతున్న‌ట్టు ఎన్నిక‌లు పూర్తిగానే పంతం పట్టిన‌ట్టు.. రాజ‌ధాని నిర్మాణం పూర్త‌యితే.. వ‌చ్చే మూడేళ్ల‌లోనే పూర్తిస్థాయిలో ఇది క‌ళ్ల ముందు క‌నిపించ‌నుంది. ఏదైనా.. ఇప్పుడు జ‌నం చేతిలో రాజ‌ధాని నిర్మాణం ఉంద‌నేది వాస్త‌వం.

This post was last modified on April 28, 2024 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

23 minutes ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

32 minutes ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

36 minutes ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

5 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

9 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

11 hours ago