ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే పరిస్థితి ఉండేది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక.. పరిస్థితి యూటర్న్ తీసుకుంది. మూడు రాజధానులు అని ప్రకటిం చారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. నిరాహార దీక్షలు కూడా సాగాయి. 2020-22 మధ్య పెను యుద్ధమే సాగింది. ఇక, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంటే.. సీఎం జగన్ కుండబద్దలు కొట్టారు. తాము గెలిచిన తర్వాత.. విశాఖ నుంచే పాలన సాగిస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా తేల్చి చెప్పారు.
ఒక్క ఈ నగరం గురించే కాదు.. కర్నూలును న్యాయరాజధానిగా కూడా చేస్తామని చెప్పారు. అంటే.. మొత్తంగా మూడు రాజధా నులకే వైసీపీ కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న రాజధానిని కేవలం శాసన రాజధాని వరకే పరిమితం చేయనున్నారు. ఈ పరిణామాలపై జనాలు తేల్చుకోవాల్సి ఉంటుంది. సీఎం జగన్ చెప్పిన దాని ప్రకారం.. వచ్చే ఐదేళ్ల పాటు కూడా.. రాజధాని అమరావతిలో ఎలాంటి మార్పులూ ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంటుందో అదే కొనసాగనుంది. అంతేకాదు.. సీఎం కార్యాలయం కూడా.. విశాఖకు వెళ్లిపోనుంది.
ఈ పరిణామంపై జనాలు స్పందిస్తారా? లేక.. జగన్ చెప్పినట్టే ఆయన వెంట నడుస్తారా? అనేది జూన్ 4న తేలనుంది. ఇదిలా వుంటే.. ఎన్డీయే కూటమి పక్షాలు మాత్రం ముక్తకంఠంతో అమరావతినే రాజధానిని చేస్తామని.. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి కూడా.. అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తామని చెబుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు, నారా లోకేష్ , పవన్ కూడా చాలా సీరియస్నేగా ఉన్నారు. వీరు చెబుతున్నట్టు ఎన్నికలు పూర్తిగానే పంతం పట్టినట్టు.. రాజధాని నిర్మాణం పూర్తయితే.. వచ్చే మూడేళ్లలోనే పూర్తిస్థాయిలో ఇది కళ్ల ముందు కనిపించనుంది. ఏదైనా.. ఇప్పుడు జనం చేతిలో రాజధాని నిర్మాణం ఉందనేది వాస్తవం.
This post was last modified on April 28, 2024 12:03 pm
జపాన్ దేశాన్ని ఇప్పుడు ఓ భయంకరమైన వార్త వణికిస్తోంది. అధికారులు అరుదైన "మెగాక్వేక్ అడ్వైజరీ" జారీ చేయడంతో అక్కడి ప్రజలు…
చైనాలో అవినీతికి పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మరోసారి రుజువైంది. భారీగా లంచం తీసుకున్న బై తియాన్హుయి అనే…
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…