Political News

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే ప‌రిస్థితి ఉండేది. త‌ర్వాత వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. మూడు రాజ‌ధానులు అని ప్ర‌క‌టిం చారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్య‌మాలు జ‌రిగాయి. నిరాహార దీక్ష‌లు కూడా సాగాయి. 2020-22 మ‌ధ్య‌ పెను యుద్ధ‌మే సాగింది. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చాయి. మ‌రి ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? అంటే.. సీఎం జ‌గ‌న్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. తాము గెలిచిన త‌ర్వాత‌.. విశాఖ నుంచే పాల‌న సాగిస్తామ‌ని మేనిఫెస్టో విడుద‌ల సంద‌ర్భంగా తేల్చి చెప్పారు.

ఒక్క ఈ న‌గ‌రం గురించే కాదు.. క‌ర్నూలును న్యాయ‌రాజ‌ధానిగా కూడా చేస్తామ‌ని చెప్పారు. అంటే.. మొత్తంగా మూడు రాజ‌ధా నుల‌కే వైసీపీ క‌ట్టుబ‌డి ప‌నిచేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌ధానిని కేవ‌లం శాస‌న రాజ‌ధాని వ‌ర‌కే ప‌రిమితం చేయ‌నున్నారు. ఈ ప‌రిణామాల‌పై జ‌నాలు తేల్చుకోవాల్సి ఉంటుంది. సీఎం జ‌గ‌న్ చెప్పిన దాని ప్ర‌కారం.. వ‌చ్చే ఐదేళ్ల పాటు కూడా.. రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఎలాంటి మార్పులూ ఉండే అవ‌కాశం లేదు. ప్ర‌స్తుతం  ఎలాంటి ప‌రిస్థితి ఉంటుందో అదే కొన‌సాగ‌నుంది. అంతేకాదు.. సీఎం కార్యాల‌యం కూడా.. విశాఖ‌కు వెళ్లిపోనుంది.

ఈ ప‌రిణామంపై జ‌నాలు స్పందిస్తారా?  లేక‌.. జ‌గ‌న్ చెప్పిన‌ట్టే ఆయ‌న వెంట న‌డుస్తారా?  అనేది జూన్ 4న తేల‌నుంది. ఇదిలా వుంటే.. ఎన్డీయే కూట‌మి ప‌క్షాలు మాత్రం ముక్త‌కంఠంతో అమ‌రావ‌తినే రాజ‌ధానిని చేస్తామ‌ని.. అధికారం చేప‌ట్టిన మ‌రుక్ష‌ణం నుంచి కూడా.. అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులను ప‌రుగులు పెట్టిస్తామ‌ని చెబుతున్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు, నారా లోకేష్ , ప‌వ‌న్ కూడా చాలా సీరియ‌స్‌నేగా ఉన్నారు. వీరు చెబుతున్న‌ట్టు ఎన్నిక‌లు పూర్తిగానే పంతం పట్టిన‌ట్టు.. రాజ‌ధాని నిర్మాణం పూర్త‌యితే.. వ‌చ్చే మూడేళ్ల‌లోనే పూర్తిస్థాయిలో ఇది క‌ళ్ల ముందు క‌నిపించ‌నుంది. ఏదైనా.. ఇప్పుడు జ‌నం చేతిలో రాజ‌ధాని నిర్మాణం ఉంద‌నేది వాస్త‌వం.

This post was last modified on April 28, 2024 12:03 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

1 hour ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

1 hour ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

1 hour ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

2 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

2 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

2 hours ago