ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే పరిస్థితి ఉండేది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక.. పరిస్థితి యూటర్న్ తీసుకుంది. మూడు రాజధానులు అని ప్రకటిం చారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. నిరాహార దీక్షలు కూడా సాగాయి. 2020-22 మధ్య పెను యుద్ధమే సాగింది. ఇక, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంటే.. సీఎం జగన్ కుండబద్దలు కొట్టారు. తాము గెలిచిన తర్వాత.. విశాఖ నుంచే పాలన సాగిస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా తేల్చి చెప్పారు.
ఒక్క ఈ నగరం గురించే కాదు.. కర్నూలును న్యాయరాజధానిగా కూడా చేస్తామని చెప్పారు. అంటే.. మొత్తంగా మూడు రాజధా నులకే వైసీపీ కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న రాజధానిని కేవలం శాసన రాజధాని వరకే పరిమితం చేయనున్నారు. ఈ పరిణామాలపై జనాలు తేల్చుకోవాల్సి ఉంటుంది. సీఎం జగన్ చెప్పిన దాని ప్రకారం.. వచ్చే ఐదేళ్ల పాటు కూడా.. రాజధాని అమరావతిలో ఎలాంటి మార్పులూ ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంటుందో అదే కొనసాగనుంది. అంతేకాదు.. సీఎం కార్యాలయం కూడా.. విశాఖకు వెళ్లిపోనుంది.
ఈ పరిణామంపై జనాలు స్పందిస్తారా? లేక.. జగన్ చెప్పినట్టే ఆయన వెంట నడుస్తారా? అనేది జూన్ 4న తేలనుంది. ఇదిలా వుంటే.. ఎన్డీయే కూటమి పక్షాలు మాత్రం ముక్తకంఠంతో అమరావతినే రాజధానిని చేస్తామని.. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి కూడా.. అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తామని చెబుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు, నారా లోకేష్ , పవన్ కూడా చాలా సీరియస్నేగా ఉన్నారు. వీరు చెబుతున్నట్టు ఎన్నికలు పూర్తిగానే పంతం పట్టినట్టు.. రాజధాని నిర్మాణం పూర్తయితే.. వచ్చే మూడేళ్లలోనే పూర్తిస్థాయిలో ఇది కళ్ల ముందు కనిపించనుంది. ఏదైనా.. ఇప్పుడు జనం చేతిలో రాజధాని నిర్మాణం ఉందనేది వాస్తవం.
This post was last modified on April 28, 2024 12:03 pm
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…