ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే పరిస్థితి ఉండేది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక.. పరిస్థితి యూటర్న్ తీసుకుంది. మూడు రాజధానులు అని ప్రకటిం చారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. నిరాహార దీక్షలు కూడా సాగాయి. 2020-22 మధ్య పెను యుద్ధమే సాగింది. ఇక, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంటే.. సీఎం జగన్ కుండబద్దలు కొట్టారు. తాము గెలిచిన తర్వాత.. విశాఖ నుంచే పాలన సాగిస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా తేల్చి చెప్పారు.
ఒక్క ఈ నగరం గురించే కాదు.. కర్నూలును న్యాయరాజధానిగా కూడా చేస్తామని చెప్పారు. అంటే.. మొత్తంగా మూడు రాజధా నులకే వైసీపీ కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న రాజధానిని కేవలం శాసన రాజధాని వరకే పరిమితం చేయనున్నారు. ఈ పరిణామాలపై జనాలు తేల్చుకోవాల్సి ఉంటుంది. సీఎం జగన్ చెప్పిన దాని ప్రకారం.. వచ్చే ఐదేళ్ల పాటు కూడా.. రాజధాని అమరావతిలో ఎలాంటి మార్పులూ ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంటుందో అదే కొనసాగనుంది. అంతేకాదు.. సీఎం కార్యాలయం కూడా.. విశాఖకు వెళ్లిపోనుంది.
ఈ పరిణామంపై జనాలు స్పందిస్తారా? లేక.. జగన్ చెప్పినట్టే ఆయన వెంట నడుస్తారా? అనేది జూన్ 4న తేలనుంది. ఇదిలా వుంటే.. ఎన్డీయే కూటమి పక్షాలు మాత్రం ముక్తకంఠంతో అమరావతినే రాజధానిని చేస్తామని.. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి కూడా.. అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తామని చెబుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు, నారా లోకేష్ , పవన్ కూడా చాలా సీరియస్నేగా ఉన్నారు. వీరు చెబుతున్నట్టు ఎన్నికలు పూర్తిగానే పంతం పట్టినట్టు.. రాజధాని నిర్మాణం పూర్తయితే.. వచ్చే మూడేళ్లలోనే పూర్తిస్థాయిలో ఇది కళ్ల ముందు కనిపించనుంది. ఏదైనా.. ఇప్పుడు జనం చేతిలో రాజధాని నిర్మాణం ఉందనేది వాస్తవం.
This post was last modified on April 28, 2024 12:03 pm
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…
ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…