నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ప్రచారం చాలా చాలా ఉధృతంగా కొనసాగిస్తున్నారు రఘురామకృష్ణరాజు.
వాస్తవానికి, రఘురామకు కూటమి తరఫున టిక్కెట్ రాదన్న ప్రచారం తొలుత జరిగింది. వైసీపీ అనుకూల మీడియా సంబరాలూ చేసుకోవడం చూశాం. అయితే, అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు రఘురామకృష్ణరాజు.
టీడీపీ అభ్యర్థి చివరి నిమిషంలో, రఘురామకి లైన్ క్లియర్ చేయడంతో, రఘురామ అభ్యర్థిత్వం ఓ సంచలనంగా మారింది. ఆ షాక్ నుంచి వైసీపీ ఇంకా తేరుకోలేదనడం నిర్వివాదాంశం.
కేవలం ఉండి నియోజకవర్గ పరిధిలోనే రఘురామకృష్ణరాజు ఎన్నికల ప్రచారం జరుగుతున్నా, మొత్తంగా నర్సాపురం పార్లమెంటు పరిధిలో, రఘురామ అనుచరులు, కూటమి అభ్యర్థుల తరఫున చాలా చాలా ఉధృతంగా పని చేస్తుండడం గమనార్హం.
మరీ ముఖ్యంగా, జనసేనతో ఆయన అనుచరులు కలిసి పని చేస్తున్న వైనం, మరో మిత్రపక్షం టీడీపీకి ఆశ్చర్యంతోపాటు అమితానందాన్నీ కలిగిస్తోంది. టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట కూడా రఘురామ అనుచరులు, గెలుపు కోసం శ్రమిస్తున్నారు.
నర్సాపురం లోక్ సభ సీటు రఘురామకి వచ్చి వుంటే, ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపు బాధ్యతనీ రఘురామ తీసుకునేవారే. ఇప్పుడూ ఏం తక్కువ కాదు, అంతకు మించే.. ఆయన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారుట.
ఉండి వరకూ తీసుకుంటే, మెజార్టీ గురించిన ఆలోచన మాత్రమే రఘురామకి వుందనీ, రికార్డు మెజార్టీ ఆయనకి ఖాయమనీ అంటున్నారు. మరోపక్క, నర్సాపురం అలాగే తాడేపల్లిగూడెం అసెంబ్లీ సిగ్మెంట్లలో రఘురామ ప్రభావం చాలా చాలా పాజిటివ్గా కూటమికి వుండబోతోందిట. ఈ ప్రభావం నర్సాపురం లోక్ సభ సీటుపైనా సానుకూలంగా వుండబోతోంది.
This post was last modified on April 28, 2024 11:30 am
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…