Political News

ఉండి పై రఘురామ ఉడుం పట్టు.!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ప్రచారం చాలా చాలా ఉధృతంగా కొనసాగిస్తున్నారు రఘురామకృష్ణరాజు.

వాస్తవానికి, రఘురామకు కూటమి తరఫున టిక్కెట్ రాదన్న ప్రచారం తొలుత జరిగింది. వైసీపీ అనుకూల మీడియా సంబరాలూ చేసుకోవడం చూశాం. అయితే, అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు రఘురామకృష్ణరాజు.

టీడీపీ అభ్యర్థి చివరి నిమిషంలో, రఘురామకి లైన్ క్లియర్ చేయడంతో, రఘురామ అభ్యర్థిత్వం ఓ సంచలనంగా మారింది. ఆ షాక్ నుంచి వైసీపీ ఇంకా తేరుకోలేదనడం నిర్వివాదాంశం.

కేవలం ఉండి నియోజకవర్గ పరిధిలోనే రఘురామకృష్ణరాజు ఎన్నికల ప్రచారం జరుగుతున్నా, మొత్తంగా నర్సాపురం పార్లమెంటు పరిధిలో, రఘురామ అనుచరులు, కూటమి అభ్యర్థుల తరఫున చాలా చాలా ఉధృతంగా పని చేస్తుండడం గమనార్హం.

మరీ ముఖ్యంగా, జనసేనతో ఆయన అనుచరులు కలిసి పని చేస్తున్న వైనం, మరో మిత్రపక్షం టీడీపీకి ఆశ్చర్యంతోపాటు అమితానందాన్నీ కలిగిస్తోంది. టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట కూడా రఘురామ అనుచరులు, గెలుపు కోసం శ్రమిస్తున్నారు.

నర్సాపురం లోక్ సభ సీటు రఘురామకి వచ్చి వుంటే, ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపు బాధ్యతనీ రఘురామ తీసుకునేవారే. ఇప్పుడూ ఏం తక్కువ కాదు, అంతకు మించే.. ఆయన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారుట.

ఉండి వరకూ తీసుకుంటే, మెజార్టీ గురించిన ఆలోచన మాత్రమే రఘురామకి వుందనీ, రికార్డు మెజార్టీ ఆయనకి ఖాయమనీ అంటున్నారు. మరోపక్క, నర్సాపురం అలాగే తాడేపల్లిగూడెం అసెంబ్లీ సిగ్మెంట్లలో రఘురామ ప్రభావం చాలా చాలా పాజిటివ్‌గా కూటమికి వుండబోతోందిట. ఈ ప్రభావం నర్సాపురం లోక్ సభ సీటుపైనా సానుకూలంగా వుండబోతోంది.

This post was last modified on April 28, 2024 11:30 am

Share
Show comments
Published by
satya

Recent Posts

రెబ‌ల్ స్టార్ స‌తీమ‌ణి.. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు విన్న‌పం

రెబ‌ల్ స్టార్, దివంగ‌త కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి అనూహ్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజు రాజ‌కీయ ప్ర‌చారం…

3 hours ago

పంతంగి ప్యాక్ అయింది !

సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…

4 hours ago

మీ శ్రేయోభిలాషి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు లేఖ‌..!

"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన మ‌రుక్ష‌ణం…

4 hours ago

ఏపీలో ఏం జ‌రుగుతోంది.. నిమ్మ‌గ‌డ్డకు టెన్ష‌న్ ఎందుకు?

ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యేందుకు మ‌రికొద్ది గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. కానీ.. ఇంత‌లోనే ఏపీలో ఏదో జ‌రుగుతోంద‌నే…

4 hours ago

బ్రహ్మరథం బన్నీకా.. వైసీపీకా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. రెండు రోజుల కిందటే…

6 hours ago

అదే కథ.. టాక్ ఉంది కలెక్షన్లు లేవు

టాలీవుడ్ బాక్సాఫీస్‌లో పరిస్థితులు రోజు రోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఈసారి వేసవిలో పెద్ద సినిమాలు లేకపోవడం పెద్ద మైనస్ కాగా..…

7 hours ago