రోమ్లో ఉన్నపుడు రోమన్లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి వాళ్ల గురించి గొప్పగా మాట్లాడ్డం సహజం. తమిళ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు హైదరాబాద్కు వచ్చారంటే చాలు తెలుగు సినిమాల గురించి ఒక రేంజిలో మాట్లాడతారు.
అదే సమయంలో తెలుగులో కెరీర్ క్లోజ్ అయ్యాక బాలీవుడ్కు వెళ్లి ఇక్కడి సినిమాల గురించి తక్కువ చేసిన మాట్లాడిన హీరోయిన్లనూ చూడొచ్చు.
ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగి హాలీవుడ్కు వెళ్లిపోయాక బాలీవుడ్ గురించి నెగెటివ్గా మాట్లాడింది. ఇక్కడి రాజకీయాలతో విసిగిపోవడం వల్లే హిందీ సినిమాలు మానేసి హాలీవుడ్కు వెళ్లిపోయినట్లు ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఐతే కొన్నేళ్ల పాటు హాలీవుడ్లో సినిమాలు, టీవీ షోలు చేసి ఇప్పుడు తిరిగి బాలీవుడ్లో అడుగు పెట్టేందుకు సిద్ధమైన ప్రియాంక.. ఇప్పుడు హాలీవుడ్లో తన కష్టాల గురించి మాట్లాడుతోంది. ఇండియాలో ఉన్నపుడు హాలీవుడ్ మ్యాగజైన్లలో తన ఫొటో ఆరుసార్లు కవర్ ఫొటోగా వచ్చిందని.. కానీ నేరుగా హాలీవుడ్లో అడుగు పెట్టాక ఎవ్వరూ తనను పట్టించుకోలేదని ప్రియాంక చెప్పింది. ఎవ్వరూ తనతో ఒక్క మీటింగ్ కూడా నిర్వహించలేదని.. ఎన్నోచోట్ల రిజెక్షన్కు గురయ్యానని.. అవమానాలు తప్పలేదని ప్రియాంక వెల్లడించింది.
ఇండియా నుంచి హాలీవుడ్కు వచ్చినపుడు చాలా భయపడ్డానని.. తనతో మాట్లాడ్డానికి ఎవ్వరూ లేక ఇబ్బంది పడ్డానని.. ఒంటరితనంతో వేదన అనుభవించానని ఆమె చెప్పింది. అయినా సరే.. తనకు తాను ధైర్యాన్నిచ్చుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుని మౌనంగా పని చేసుకుపోయానని.. దీంతో గుర్తింపు వచ్చిందని ప్రియాంక తెలిపింది.
This post was last modified on April 27, 2024 5:11 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…