రోమ్లో ఉన్నపుడు రోమన్లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి వాళ్ల గురించి గొప్పగా మాట్లాడ్డం సహజం. తమిళ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు హైదరాబాద్కు వచ్చారంటే చాలు తెలుగు సినిమాల గురించి ఒక రేంజిలో మాట్లాడతారు.
అదే సమయంలో తెలుగులో కెరీర్ క్లోజ్ అయ్యాక బాలీవుడ్కు వెళ్లి ఇక్కడి సినిమాల గురించి తక్కువ చేసిన మాట్లాడిన హీరోయిన్లనూ చూడొచ్చు.
ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగి హాలీవుడ్కు వెళ్లిపోయాక బాలీవుడ్ గురించి నెగెటివ్గా మాట్లాడింది. ఇక్కడి రాజకీయాలతో విసిగిపోవడం వల్లే హిందీ సినిమాలు మానేసి హాలీవుడ్కు వెళ్లిపోయినట్లు ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఐతే కొన్నేళ్ల పాటు హాలీవుడ్లో సినిమాలు, టీవీ షోలు చేసి ఇప్పుడు తిరిగి బాలీవుడ్లో అడుగు పెట్టేందుకు సిద్ధమైన ప్రియాంక.. ఇప్పుడు హాలీవుడ్లో తన కష్టాల గురించి మాట్లాడుతోంది. ఇండియాలో ఉన్నపుడు హాలీవుడ్ మ్యాగజైన్లలో తన ఫొటో ఆరుసార్లు కవర్ ఫొటోగా వచ్చిందని.. కానీ నేరుగా హాలీవుడ్లో అడుగు పెట్టాక ఎవ్వరూ తనను పట్టించుకోలేదని ప్రియాంక చెప్పింది. ఎవ్వరూ తనతో ఒక్క మీటింగ్ కూడా నిర్వహించలేదని.. ఎన్నోచోట్ల రిజెక్షన్కు గురయ్యానని.. అవమానాలు తప్పలేదని ప్రియాంక వెల్లడించింది.
ఇండియా నుంచి హాలీవుడ్కు వచ్చినపుడు చాలా భయపడ్డానని.. తనతో మాట్లాడ్డానికి ఎవ్వరూ లేక ఇబ్బంది పడ్డానని.. ఒంటరితనంతో వేదన అనుభవించానని ఆమె చెప్పింది. అయినా సరే.. తనకు తాను ధైర్యాన్నిచ్చుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుని మౌనంగా పని చేసుకుపోయానని.. దీంతో గుర్తింపు వచ్చిందని ప్రియాంక తెలిపింది.
This post was last modified on April 27, 2024 5:11 pm
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…