Political News

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.! భారీ అంచనాల నడుమ, ‘నవ రత్నాలు ప్లస్’ మేనిఫెస్టోని వైసీపీ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

సామాజిక పెన్షన్లు ఐదు వేలు చేస్తారా.? అమ్మ ఒడి మొత్తం పెంచుతారా.? ఇలా చాలా ఉత్కంఠభరితమైన ప్రశ్నలు వైసీపీ అభిమానుల నుంచి పుట్టుకొచ్చాయ్. రైతు రుణమాఫి అంశమొకటి చర్చలోకి వచ్చింది. కానీ, తూతూ మంత్రంగా అమ్మ ఒడి మొత్తాన్ని రెండు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించి వైసీపీ చేతులు దులుపుకుంది మేనిఫెస్టోలో.

సామాజిక పెన్షన్లు మరో ఐదొందల రూపాయలు మాత్రమే పెంచుతామని వైసీపీ తన మేనిఫెస్టోలో పేర్కొనడం, వైసీపీ అభిమానులైన లబ్దిదారుల్లో తీవ్ర నిరాశకు గురిచేసింది. తాము అధికారంలోకి వస్తే, పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది కూడా. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంశం కూడా జనాల్లోకి వెళ్ళింది.

టీడీపీ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు, వైసీపీ ‘నవ రత్నాలు ప్లస్’ తర్వాత క్రేజ్ అనూహ్యంగా పెరిగిందనేది తాజా గ్రౌండ్ రిపోర్ట్. ఈ విషయమై వైసీపీ శ్రేణుల్లోనే తీవ్ర ఆందోళన కనిపిస్తోంది.

‘కూటమికి గెలుపుని మనమే కానుకగా ఇచ్చేస్తున్నట్టున్నాం.. వైసీపీ ఓటమి ఖాయం..’ అని నిన్న మొన్నటిదాకా వైసీపీకి మద్దతుగా నిలిచిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

డ్యామేజ్ కంట్రోల్ ఎలా.? ఇప్పుడిదే చర్చ వైసీపీలో జరుగుతోందిట. మ్యానిఫెస్టోలో మార్పులు తప్పకపోవచ్చని అంటున్నారు. రెండు మూడు రోజుల్లోనే సవరించిన ఇంకో మేనిఫెస్టో వైసీపీ నుంచి విడుదల కావొచ్చునట.

This post was last modified on April 28, 2024 11:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

11 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago