Political News

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.! భారీ అంచనాల నడుమ, ‘నవ రత్నాలు ప్లస్’ మేనిఫెస్టోని వైసీపీ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

సామాజిక పెన్షన్లు ఐదు వేలు చేస్తారా.? అమ్మ ఒడి మొత్తం పెంచుతారా.? ఇలా చాలా ఉత్కంఠభరితమైన ప్రశ్నలు వైసీపీ అభిమానుల నుంచి పుట్టుకొచ్చాయ్. రైతు రుణమాఫి అంశమొకటి చర్చలోకి వచ్చింది. కానీ, తూతూ మంత్రంగా అమ్మ ఒడి మొత్తాన్ని రెండు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించి వైసీపీ చేతులు దులుపుకుంది మేనిఫెస్టోలో.

సామాజిక పెన్షన్లు మరో ఐదొందల రూపాయలు మాత్రమే పెంచుతామని వైసీపీ తన మేనిఫెస్టోలో పేర్కొనడం, వైసీపీ అభిమానులైన లబ్దిదారుల్లో తీవ్ర నిరాశకు గురిచేసింది. తాము అధికారంలోకి వస్తే, పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది కూడా. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంశం కూడా జనాల్లోకి వెళ్ళింది.

టీడీపీ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు, వైసీపీ ‘నవ రత్నాలు ప్లస్’ తర్వాత క్రేజ్ అనూహ్యంగా పెరిగిందనేది తాజా గ్రౌండ్ రిపోర్ట్. ఈ విషయమై వైసీపీ శ్రేణుల్లోనే తీవ్ర ఆందోళన కనిపిస్తోంది.

‘కూటమికి గెలుపుని మనమే కానుకగా ఇచ్చేస్తున్నట్టున్నాం.. వైసీపీ ఓటమి ఖాయం..’ అని నిన్న మొన్నటిదాకా వైసీపీకి మద్దతుగా నిలిచిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

డ్యామేజ్ కంట్రోల్ ఎలా.? ఇప్పుడిదే చర్చ వైసీపీలో జరుగుతోందిట. మ్యానిఫెస్టోలో మార్పులు తప్పకపోవచ్చని అంటున్నారు. రెండు మూడు రోజుల్లోనే సవరించిన ఇంకో మేనిఫెస్టో వైసీపీ నుంచి విడుదల కావొచ్చునట.

This post was last modified on April 28, 2024 11:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…

6 hours ago

మూడో స్పీడ్ బ్రేకర్ ఏం చెబుతోంది

గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…

7 hours ago

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

8 hours ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

10 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

10 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

10 hours ago