సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై ఆదారపడిన వారు.. ఈ పింఛను సొమ్మును పెంచాలని కోరుకుంటు న్నారు. ఈ విషయాన్ని పసి గట్టిన టీడీపీ అదినేత చంద్రబాబు.. ప్రస్తుతం ఉన్న పింఛనును రూ.3000 నుంచి 4000లకు పెంచుతామని.. అధికారంలోకి రాగానే ఇచ్చి తీరుతామని చెప్పారు. ఇంటింటికీ పంపిస్తామని.. ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని కూడా చెప్పారు.
ఈ విషయాన్ని కూటమి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్గా ఉంటుందని కూడా.. చంద్రబాబు తెలిపారు. అయితే .. దీనికి మరింతగా వైసీపీ మేనిఫెస్టో లో ప్రకటిస్తారని అందరూ ఆశించారు. చంద్రబాబు రూ.4 వేలు ప్రకటి స్తే.. జగన్ కనీసంలో కనీసం రూ.5 వేలైనా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. దీనిపైనే గ్రామీణ ప్రాంతాల్లోనూ చర్చ సాగింది. అయితే.. జగన్ మాత్రం ఈ పింఛన్ పెంపుపై బాంబు లాంటి వార్త పేల్చారు. ప్రస్తుతం ఇస్తున్న పింఛనును రూ.3000 అలానే కొనసాగిస్తామని చెప్పారు.
అయితే.. రూ.500 పెంచుతామనిచెప్పినా.. ఇప్పటికిప్పుడు మాత్రం పెంచేది లేదన్నారు. 2028వ సంవత్సరంలో రూ.250, 2029లో(ఎన్నికల సంవత్సరం) రూ.250 పెంచుతామని చెప్పారు. ఇది మెజారిటీ పింఛను దారుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. మరోవైపు.. చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాదు.. రాకుండానే ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని.. రూ.4000 చొప్పున సామాజిక పింఛనును అందిస్తా మని చెబుతున్నారు.
ఇక, దివ్యాంగుల పింఛన్లను చంద్రబాబు ప్రత్యేకంగా రూ.6లకు పెంచుతామని చెబితే.. జగన్ మాత్రం అసలు వీరి ఊసు కూడా ఎత్తకపోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. పింఛన్ల వ్యవహారం.. ఎ న్నికలను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఇప్పటి వరకు వైసీపీ వేసుకున్న గెలుపు అంచనాలను తలకిందలు చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో వైసీపీ ఈ పింఛన్ల పెంపుపైనే గెలుపు గుర్రం ఎక్కింది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టడంతో పార్టీకి ఇబ్బంది తప్పదనే అంటున్నారు పరిశీలకులు.
స్టార్ హీరోలను ఫ్యాన్స్ దేవుళ్లుగా భావించడం నిజమేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. స్వంత అభిమానిని హత్య చేసిన కేసులో…
అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా…
జపాన్ దేశాన్ని ఇప్పుడు ఓ భయంకరమైన వార్త వణికిస్తోంది. అధికారులు అరుదైన "మెగాక్వేక్ అడ్వైజరీ" జారీ చేయడంతో అక్కడి ప్రజలు…
తెలుగు సినీ పరిశ్రమకు ప్రస్తుతం అనధికార పెద్ద అంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. ఒకప్పుడు దాసరి నారాయణరావులా ఇప్పుడు…
గత రెండు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వేలాది మందికి సీఎం చంద్రబాబు తాజాగా చల్లని కబురు అందించారు. తమ…
చైనాలో అవినీతికి పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మరోసారి రుజువైంది. భారీగా లంచం తీసుకున్న బై తియాన్హుయి అనే…