సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై ఆదారపడిన వారు.. ఈ పింఛను సొమ్మును పెంచాలని కోరుకుంటు న్నారు. ఈ విషయాన్ని పసి గట్టిన టీడీపీ అదినేత చంద్రబాబు.. ప్రస్తుతం ఉన్న పింఛనును రూ.3000 నుంచి 4000లకు పెంచుతామని.. అధికారంలోకి రాగానే ఇచ్చి తీరుతామని చెప్పారు. ఇంటింటికీ పంపిస్తామని.. ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని కూడా చెప్పారు.
ఈ విషయాన్ని కూటమి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్గా ఉంటుందని కూడా.. చంద్రబాబు తెలిపారు. అయితే .. దీనికి మరింతగా వైసీపీ మేనిఫెస్టో లో ప్రకటిస్తారని అందరూ ఆశించారు. చంద్రబాబు రూ.4 వేలు ప్రకటి స్తే.. జగన్ కనీసంలో కనీసం రూ.5 వేలైనా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. దీనిపైనే గ్రామీణ ప్రాంతాల్లోనూ చర్చ సాగింది. అయితే.. జగన్ మాత్రం ఈ పింఛన్ పెంపుపై బాంబు లాంటి వార్త పేల్చారు. ప్రస్తుతం ఇస్తున్న పింఛనును రూ.3000 అలానే కొనసాగిస్తామని చెప్పారు.
అయితే.. రూ.500 పెంచుతామనిచెప్పినా.. ఇప్పటికిప్పుడు మాత్రం పెంచేది లేదన్నారు. 2028వ సంవత్సరంలో రూ.250, 2029లో(ఎన్నికల సంవత్సరం) రూ.250 పెంచుతామని చెప్పారు. ఇది మెజారిటీ పింఛను దారుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. మరోవైపు.. చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాదు.. రాకుండానే ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని.. రూ.4000 చొప్పున సామాజిక పింఛనును అందిస్తా మని చెబుతున్నారు.
ఇక, దివ్యాంగుల పింఛన్లను చంద్రబాబు ప్రత్యేకంగా రూ.6లకు పెంచుతామని చెబితే.. జగన్ మాత్రం అసలు వీరి ఊసు కూడా ఎత్తకపోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. పింఛన్ల వ్యవహారం.. ఎ న్నికలను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఇప్పటి వరకు వైసీపీ వేసుకున్న గెలుపు అంచనాలను తలకిందలు చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో వైసీపీ ఈ పింఛన్ల పెంపుపైనే గెలుపు గుర్రం ఎక్కింది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టడంతో పార్టీకి ఇబ్బంది తప్పదనే అంటున్నారు పరిశీలకులు.
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…