Political News

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై ఆదార‌ప‌డిన వారు.. ఈ పింఛ‌ను సొమ్మును పెంచాల‌ని కోరుకుంటు న్నారు. ఈ విష‌యాన్ని ప‌సి గ‌ట్టిన టీడీపీ అదినేత‌ చంద్ర‌బాబు.. ప్ర‌స్తుతం ఉన్న పింఛ‌నును రూ.3000 నుంచి 4000ల‌కు పెంచుతామ‌ని.. అధికారంలోకి రాగానే ఇచ్చి తీరుతామ‌ని చెప్పారు. ఇంటింటికీ పంపిస్తామ‌ని.. ఏప్రిల్ నుంచే అమ‌లు చేస్తామ‌ని కూడా చెప్పారు.

ఈ విష‌యాన్ని కూట‌మి మేనిఫెస్టోలో సూప‌ర్ సిక్స్‌గా ఉంటుంద‌ని కూడా.. చంద్ర‌బాబు తెలిపారు. అయితే .. దీనికి మ‌రింత‌గా వైసీపీ మేనిఫెస్టో లో ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ ఆశించారు. చంద్ర‌బాబు రూ.4 వేలు ప్ర‌క‌టి స్తే.. జ‌గ‌న్ క‌నీసంలో క‌నీసం రూ.5 వేలైనా ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. దీనిపైనే గ్రామీణ ప్రాంతాల్లోనూ చ‌ర్చ సాగింది. అయితే.. జ‌గ‌న్ మాత్రం ఈ పింఛ‌న్ పెంపుపై బాంబు లాంటి వార్త పేల్చారు. ప్ర‌స్తుతం ఇస్తున్న పింఛ‌నును రూ.3000 అలానే కొన‌సాగిస్తామ‌ని చెప్పారు.

అయితే.. రూ.500 పెంచుతామ‌నిచెప్పినా.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం పెంచేది లేదన్నారు. 2028వ సంవ‌త్సరంలో రూ.250, 2029లో(ఎన్నిక‌ల సంవ‌త్స‌రం) రూ.250 పెంచుతామ‌ని చెప్పారు. ఇది మెజారిటీ పింఛ‌ను దారుల ఆశ‌ల‌పై నీళ్లు కుమ్మ‌రించింది. మ‌రోవైపు.. చంద్ర‌బాబు తాను అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కాదు.. రాకుండానే ఏప్రిల్‌ నుంచి అమ‌లు చేస్తామ‌ని.. రూ.4000 చొప్పున సామాజిక పింఛ‌నును అందిస్తా మని చెబుతున్నారు.

ఇక‌, దివ్యాంగుల పింఛ‌న్ల‌ను చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా రూ.6ల‌కు పెంచుతామ‌ని చెబితే.. జ‌గ‌న్ మాత్రం అసలు వీరి ఊసు కూడా ఎత్త‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. పింఛ‌న్ల వ్య‌వ‌హారం.. ఎ న్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ వేసుకున్న గెలుపు అంచ‌నాలను త‌ల‌కింద‌లు చేసినా ఆశ్చర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఈ పింఛ‌న్ల పెంపుపైనే గెలుపు గుర్రం ఎక్కింది. ఇప్పుడు వీటిని ప‌క్క‌న పెట్ట‌డంతో పార్టీకి ఇబ్బంది త‌ప్ప‌ద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share

Recent Posts

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

45 minutes ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

2 hours ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

3 hours ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

3 hours ago

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

3 hours ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

3 hours ago