Political News

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై ఆదార‌ప‌డిన వారు.. ఈ పింఛ‌ను సొమ్మును పెంచాల‌ని కోరుకుంటు న్నారు. ఈ విష‌యాన్ని ప‌సి గ‌ట్టిన టీడీపీ అదినేత‌ చంద్ర‌బాబు.. ప్ర‌స్తుతం ఉన్న పింఛ‌నును రూ.3000 నుంచి 4000ల‌కు పెంచుతామ‌ని.. అధికారంలోకి రాగానే ఇచ్చి తీరుతామ‌ని చెప్పారు. ఇంటింటికీ పంపిస్తామ‌ని.. ఏప్రిల్ నుంచే అమ‌లు చేస్తామ‌ని కూడా చెప్పారు.

ఈ విష‌యాన్ని కూట‌మి మేనిఫెస్టోలో సూప‌ర్ సిక్స్‌గా ఉంటుంద‌ని కూడా.. చంద్ర‌బాబు తెలిపారు. అయితే .. దీనికి మ‌రింత‌గా వైసీపీ మేనిఫెస్టో లో ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ ఆశించారు. చంద్ర‌బాబు రూ.4 వేలు ప్ర‌క‌టి స్తే.. జ‌గ‌న్ క‌నీసంలో క‌నీసం రూ.5 వేలైనా ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. దీనిపైనే గ్రామీణ ప్రాంతాల్లోనూ చ‌ర్చ సాగింది. అయితే.. జ‌గ‌న్ మాత్రం ఈ పింఛ‌న్ పెంపుపై బాంబు లాంటి వార్త పేల్చారు. ప్ర‌స్తుతం ఇస్తున్న పింఛ‌నును రూ.3000 అలానే కొన‌సాగిస్తామ‌ని చెప్పారు.

అయితే.. రూ.500 పెంచుతామ‌నిచెప్పినా.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం పెంచేది లేదన్నారు. 2028వ సంవ‌త్సరంలో రూ.250, 2029లో(ఎన్నిక‌ల సంవ‌త్స‌రం) రూ.250 పెంచుతామ‌ని చెప్పారు. ఇది మెజారిటీ పింఛ‌ను దారుల ఆశ‌ల‌పై నీళ్లు కుమ్మ‌రించింది. మ‌రోవైపు.. చంద్ర‌బాబు తాను అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కాదు.. రాకుండానే ఏప్రిల్‌ నుంచి అమ‌లు చేస్తామ‌ని.. రూ.4000 చొప్పున సామాజిక పింఛ‌నును అందిస్తా మని చెబుతున్నారు.

ఇక‌, దివ్యాంగుల పింఛ‌న్ల‌ను చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా రూ.6ల‌కు పెంచుతామ‌ని చెబితే.. జ‌గ‌న్ మాత్రం అసలు వీరి ఊసు కూడా ఎత్త‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. పింఛ‌న్ల వ్య‌వ‌హారం.. ఎ న్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ వేసుకున్న గెలుపు అంచ‌నాలను త‌ల‌కింద‌లు చేసినా ఆశ్చర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఈ పింఛ‌న్ల పెంపుపైనే గెలుపు గుర్రం ఎక్కింది. ఇప్పుడు వీటిని ప‌క్క‌న పెట్ట‌డంతో పార్టీకి ఇబ్బంది త‌ప్ప‌ద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

2 minutes ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

1 hour ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

2 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

2 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

2 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

6 hours ago