తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ సీనియర్ నేత హరీష్ రావు.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సటైర్లు పేల్చారు. “హరీష్ రావు రాసింది రాజీనామా కాదు.. సీసపద్యం” అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. గన్ పార్కు వద్ద హరీష్రావు.. తన రాజీనామా పత్రాన్ని మీడియాకు వెల్లడించడాన్ని రేవంత్ తప్పుబట్టారు. “సీస పద్యం రాసుకొచ్చి.. మీడియా ముందు వదిలిండు. ఇక, దీన్ని.. ఎన్నికల్ల ప్రచారం చేస్తుండు” అని వ్యాఖ్యానించారు.
రాజీనామా ఎలా చేయాలో ఆ మాత్రం హరీష్రావుకు తెలియదా? అని రేవంత్ అన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో ఒక్క అక్షరం కూడా తప్పులేకుండా.. సొద లేకుండా సోది లేకుండా రాయేల! కానీ, హరీష్ మాత్రం సీస పద్యం లెక్క రాసుకొచ్చిండు. దీన్ని రాజీనామా అంటుండు. వినోటోళ్లుంటే ఇంకేమైనా కూడా చెబుతడు! అని అన్నారు. వచ్చే ఆగస్టు 15వ తేదీలోగా.. రుణమాఫీ చేసేందుకు కట్టబడి ఉన్నామని రేవంత్ చెప్పారు. అందుకే తమకు ప్రజలు అధికారం ఇచ్చారని వ్యాఖ్యానించారు.
“రుణమాఫీ చేయనప్పుడు.. ఇంక మాకు అధికారం ఇచ్చి ఏం ప్రయోజనం?” అని రేవంత్ సంచలన వ్యా ఖ్యలు చేశారు. 2 లక్షల లోపు అప్పులు ఉన్న రైతుల జాబితాలను సిద్ధం చేస్తున్నామని.. అందరికీ ఒకే విడతలో రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ఆరు నూరైనా ఆగస్టు 15 లోపు రైతుల రుణాలు రూ.2 లక్షల లోపున్న వాటిని ఒక్కసారే మాఫీ చేస్తామన్నారు. “అరుకోన్రి, గింజుకోన్రి.. తలకిందలు తపస్సు చెయ్యని.. వాళ్లకు దక్కేది ఒకటో రెండో..” అని కేసీఆర్ను ఉద్దేశించి పార్లమెంటు సీట్ల విజయంపై తేల్చి చెప్పారు. కాంగ్రెస్ 14-15 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందన్నారు.
This post was last modified on April 26, 2024 2:42 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…