Political News

జగన్ స్పీచ్‌లో వివేకా రెండో పెళ్లి

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకా హత్య ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అప్పుడు అది ఎన్నికల అంశంగా మారి.. జగన్ పట్ల సానుభూతికి కారణమైంది. ఐతే ఇప్పుడు కూడా వివేకా హత్య కేసు ఎన్నికల అంశమే. కాకపోతే అప్పుడు జగన్‌కు కలిసొచ్చిన ఆ కేసు.. ఇప్పుడు ఆయనకు ప్రతికూలంగా మారింది. జగన్ సోదరుడైన అవినాష్‌పై ఈ కేసుకు సంబంధించి తీవ్ర అభియోగాలు రావడం.. జగన్ మద్దతుతోనే అవినాష్ ఈ హత్య చేయించినట్లు ఆరోపణలు రావడం రాజకీయంగా వైసీపీకి ఇబ్బందిగా మారుతోంది. కడప పార్లమెంట్ స్థానంలో అవినాష్ మీద పోటీ చేస్తున్న వైఎస్ షర్మిళ ఇదే అంశాన్ని పదే పదే లేవనెత్తుతూ వైసీపీలో గుబులు రేపుతోంది.

ఈ నేపథ్యంలో జగన్ తన తాజా ప్రసంగంలో షర్మిళతో పాటు వివేకా తనయురాలైన సునీత తీరును తీవ్రంగా తప్పుబట్టారు. వారి పేర్లు ఎత్తకుండా.. ప్రత్యర్థులతో చేతులు కలిపిన తన చెల్లెళ్లు వైఎస్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని జగన్ ఆరోపించారు. వివేకాను హత్య చేయించింది ఎవరో కడప జిల్లా ప్రజలందరికీ తెలుసన్న జగన్.. ఆ హత్య చేసిన వ్యక్తికే తన చెల్లెళ్లు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు జగన్. ఇదే సందర్భంలో వివేకాకు రెండో పెళ్లి జరగడం, ఆ పెళ్లి ద్వారా ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్న విషయాన్ని జగన్ లేవనెత్తి.. ఆయన హత్యకు రెండో పెళ్లికి సంబంధం ఉందనే కోణంలో మాట్లాడారు.

వైఎస్ బతికున్నంత కాలం ఆయన, తన అభిమానులు ఎవరితో అయితే పోరాడారో ఆ చంద్రబాబు కోసం ఇప్పుడు తన చెల్లెళ్లు ఇద్దరూ కలిసి పని చేస్తున్నారని.. రాజకీయాల్లో ఇంతకంటే దిగజారుడుతనం ఇంకోటి ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ కడప జిల్లాలో ఓట్లు చీల్చి.. వైఎస్ పేరుతో నెలకొల్పి, ఆయన్ని అన్ని రకాలుగా గౌరవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని చూస్తోందంటూ తన చెల్లెలి తీరును జగన్ తప్పుబట్టారు.

This post was last modified on April 25, 2024 6:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

7 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

4 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

4 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

5 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago