సినిమాల్లోకి వచ్చే ముందు అందరు నటులకు అభిమాన తారలని ఉంటారు. వాళ్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినపుడు ఎగ్జైట్మెంట్ వేరుగా ఉంటుంది. ప్రతి మూమెంట్ను ప్రత్యేకంగా మార్చుకుంటారు ఐతే తాము ఎంతగానో అభిమానించే ఆర్టిస్టును సన్నివేశంలో భాగంగా గట్టిగా కొట్టాల్సి వస్తే..? తనకు ఇదే అనుభవం ఎదురైతే చాలా ఇబ్బంది పడిపోయానని అంటోంది టాలీవుడ్లో వెలిగిపోతున్న బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. తనకు షాహిద్ కపూర్ అంటే చాలా ఇష్టమని ఆమె కెరీర్ ఆరంభం నుంచే చెబుతోంది. ఆ హీరోతో కలిసి ఆమె హిందీ ‘జెర్సీ’ చేసింది. ఇందులో ఒక చోట హీరోను హీరోయిన్ చెంపదెబ్బ కొడుతుందన్న సంగతి తెలిసిందే. తెలుగులో నాని-శ్రద్ధ మధ్య వచ్చే ఆ సన్నివేశం బాగా పండింది.
ఐతే హిందీలో తాను ఈ సన్నివేశం చేయడం చాలా కష్టమైందని మృణాల్ చెప్పింది. “నేను షాహిద్ కపూర్ ఫ్యాన్. ఆయనతో కలిసి నటించే అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పేశా. మొదాటి రోజు షూటింగ్లో ఆయన నవ్వు చూస్తూ అలా ఉండిపోయాను. మీ నవ్వు తెరపై ఎలా ఉందో నిజంగా కూడా అంతే బాగుందని ఆయనకు చెప్పా. షాహిద్తో కలిసి నటించిన క్షణాలను మరిచిపోలేను. అంత పెద్ద స్టార్తో నటించాలంటే మొదట ఇబ్బందిగా అనిపించింది. వారం రోజుల తర్వాత కొంచెం అలవాటు పడ్డాను. కానీ ఒక సన్నివేశంలో షాహిద్ను కొట్టాలని అనగానే భయపడ్డాను. నేను నెమ్మదిగా కొడతా ఎడిటింగ్లో చూసుకోండి అని చెప్పా. కానీ దర్శకుడు మాత్రం నిజంగా గట్టిగా కొట్టాలని అన్నాడు. ‘మీ మాజీ బాయ్ ఫ్రెండ్ను గుర్తు చేసుకుని నన్ను కొట్టండి’ అని షాహిద్ జోక్ చేశాడు. ఆ సీన్ తీయడానికి మూడు గంటలు పట్టింది. ఎలాగోలా పూర్తి చేశా” అని మృణాల్ చెప్పింది.
This post was last modified on April 25, 2024 6:16 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…