సినిమాల్లోకి వచ్చే ముందు అందరు నటులకు అభిమాన తారలని ఉంటారు. వాళ్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినపుడు ఎగ్జైట్మెంట్ వేరుగా ఉంటుంది. ప్రతి మూమెంట్ను ప్రత్యేకంగా మార్చుకుంటారు ఐతే తాము ఎంతగానో అభిమానించే ఆర్టిస్టును సన్నివేశంలో భాగంగా గట్టిగా కొట్టాల్సి వస్తే..? తనకు ఇదే అనుభవం ఎదురైతే చాలా ఇబ్బంది పడిపోయానని అంటోంది టాలీవుడ్లో వెలిగిపోతున్న బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. తనకు షాహిద్ కపూర్ అంటే చాలా ఇష్టమని ఆమె కెరీర్ ఆరంభం నుంచే చెబుతోంది. ఆ హీరోతో కలిసి ఆమె హిందీ ‘జెర్సీ’ చేసింది. ఇందులో ఒక చోట హీరోను హీరోయిన్ చెంపదెబ్బ కొడుతుందన్న సంగతి తెలిసిందే. తెలుగులో నాని-శ్రద్ధ మధ్య వచ్చే ఆ సన్నివేశం బాగా పండింది.
ఐతే హిందీలో తాను ఈ సన్నివేశం చేయడం చాలా కష్టమైందని మృణాల్ చెప్పింది. “నేను షాహిద్ కపూర్ ఫ్యాన్. ఆయనతో కలిసి నటించే అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పేశా. మొదాటి రోజు షూటింగ్లో ఆయన నవ్వు చూస్తూ అలా ఉండిపోయాను. మీ నవ్వు తెరపై ఎలా ఉందో నిజంగా కూడా అంతే బాగుందని ఆయనకు చెప్పా. షాహిద్తో కలిసి నటించిన క్షణాలను మరిచిపోలేను. అంత పెద్ద స్టార్తో నటించాలంటే మొదట ఇబ్బందిగా అనిపించింది. వారం రోజుల తర్వాత కొంచెం అలవాటు పడ్డాను. కానీ ఒక సన్నివేశంలో షాహిద్ను కొట్టాలని అనగానే భయపడ్డాను. నేను నెమ్మదిగా కొడతా ఎడిటింగ్లో చూసుకోండి అని చెప్పా. కానీ దర్శకుడు మాత్రం నిజంగా గట్టిగా కొట్టాలని అన్నాడు. ‘మీ మాజీ బాయ్ ఫ్రెండ్ను గుర్తు చేసుకుని నన్ను కొట్టండి’ అని షాహిద్ జోక్ చేశాడు. ఆ సీన్ తీయడానికి మూడు గంటలు పట్టింది. ఎలాగోలా పూర్తి చేశా” అని మృణాల్ చెప్పింది.
This post was last modified on April 25, 2024 6:16 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…