ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోసారి జగనే అధికారంలోకి వస్తారని తన దగ్గర సమాచారం ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. విమర్శలు గుప్పించారు.
జూన్ 4వ తేదీ తర్వాత.. కేసీఆర్-జగన్ ఇద్దరూ చింతపిక్కల ఆట ఆడుకోవడమేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్కే దిక్కులేదు. ఆయనే ఫామ్ హౌస్లో పడుకున్నాడు. రేపు ఆ పక్కనే మరో రూమ్ రెడీ చేస్తే.. జగన్ కూడా అక్కడకు వస్తాడు. అధికారంలోలేని ఈ ఇద్దరూ అక్కడ చింతపిక్కలాట ఆడుకుంటారు. ఒకవైపు కేసీఆర్, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటారు అని బొండా ఉమా విరుచుకుపడ్డారు.
అహంకారులకు ఈ ప్రజాస్వామ్యంలో చోటు ఉండదని ఉమా తేల్చి చెప్పారు. అహంకారులకు, దుర్మార్గులకు, చట్టాన్ని అతిక్రమించేవారికి.. ఈ ప్రజాస్వామ్యంలో చోటు ఉండదన్నారు. ఇప్పటికైనా తెలుసుకో జగన్. జూన్ 4వ తేదీనే నువ్వు ఈ రాష్ట్రంలో ఉండేందుకు ఆఖరి రోజు. జూన్ 5వ తేదీ నుంచి ఆయన ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోతాడు. కేసీఆరా, కేటీఆరా.. ఎవరైనా సరే రాసిపెట్టుకోవాలి. మీకు అంత అభిమానం ఉంటే.. మీ పక్క ఒక రూం ఇవ్వండి అని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on April 24, 2024 9:51 pm
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…
ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…