Political News

కేసీఆర్ కి AP నుండి కౌంటర్ పడింది

ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోసారి జ‌గ‌నే అధికారంలోకి వ‌స్తార‌ని త‌న ద‌గ్గ‌ర స‌మాచారం ఉంద‌ని కేసీఆర్ చెప్పారు. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన టీడీపీ నేత‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. విమ‌ర్శలు గుప్పించారు.

జూన్ 4వ తేదీ త‌ర్వాత‌.. కేసీఆర్‌-జ‌గ‌న్ ఇద్ద‌రూ చింత‌పిక్క‌ల ఆట ఆడుకోవ‌డ‌మేన‌ని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కే దిక్కులేదు. ఆయ‌నే ఫామ్ హౌస్‌లో ప‌డుకున్నాడు. రేపు ఆ ప‌క్క‌నే మ‌రో రూమ్ రెడీ చేస్తే.. జ‌గ‌న్ కూడా అక్క‌డ‌కు వ‌స్తాడు. అధికారంలోలేని ఈ ఇద్ద‌రూ అక్క‌డ చింత‌పిక్క‌లాట ఆడుకుంటారు. ఒక‌వైపు కేసీఆర్‌, ఇంకోవైపు జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆడుకుంటారు అని బొండా ఉమా విరుచుకుప‌డ్డారు.

అహంకారుల‌కు ఈ ప్ర‌జాస్వామ్యంలో చోటు ఉండ‌ద‌ని ఉమా తేల్చి చెప్పారు. అహంకారుల‌కు, దుర్మార్గుల‌కు, చ‌ట్టాన్ని అతిక్ర‌మించేవారికి.. ఈ ప్ర‌జాస్వామ్యంలో చోటు ఉండ‌ద‌న్నారు. ఇప్ప‌టికైనా తెలుసుకో జ‌గ‌న్‌. జూన్ 4వ తేదీనే నువ్వు ఈ రాష్ట్రంలో ఉండేందుకు ఆఖ‌రి రోజు. జూన్ 5వ తేదీ నుంచి ఆయ‌న ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోతాడు. కేసీఆరా, కేటీఆరా.. ఎవ‌రైనా స‌రే రాసిపెట్టుకోవాలి. మీకు అంత అభిమానం ఉంటే.. మీ ప‌క్క ఒక రూం ఇవ్వండి అని ఉమా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

This post was last modified on April 24, 2024 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నానిని టార్గెట్ చేయడం రైటేనా

సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…

1 hour ago

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

2 hours ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

3 hours ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

3 hours ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

6 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

6 hours ago