ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోసారి జగనే అధికారంలోకి వస్తారని తన దగ్గర సమాచారం ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. విమర్శలు గుప్పించారు.
జూన్ 4వ తేదీ తర్వాత.. కేసీఆర్-జగన్ ఇద్దరూ చింతపిక్కల ఆట ఆడుకోవడమేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్కే దిక్కులేదు. ఆయనే ఫామ్ హౌస్లో పడుకున్నాడు. రేపు ఆ పక్కనే మరో రూమ్ రెడీ చేస్తే.. జగన్ కూడా అక్కడకు వస్తాడు. అధికారంలోలేని ఈ ఇద్దరూ అక్కడ చింతపిక్కలాట ఆడుకుంటారు. ఒకవైపు కేసీఆర్, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటారు
అని బొండా ఉమా విరుచుకుపడ్డారు.
అహంకారులకు ఈ ప్రజాస్వామ్యంలో చోటు ఉండదని ఉమా తేల్చి చెప్పారు. అహంకారులకు, దుర్మార్గులకు, చట్టాన్ని అతిక్రమించేవారికి.. ఈ ప్రజాస్వామ్యంలో చోటు ఉండదన్నారు. ఇప్పటికైనా తెలుసుకో జగన్. జూన్ 4వ తేదీనే నువ్వు ఈ రాష్ట్రంలో ఉండేందుకు ఆఖరి రోజు. జూన్ 5వ తేదీ నుంచి ఆయన ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోతాడు. కేసీఆరా, కేటీఆరా.. ఎవరైనా సరే రాసిపెట్టుకోవాలి. మీకు అంత అభిమానం ఉంటే.. మీ పక్క ఒక రూం ఇవ్వండి
అని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on April 24, 2024 9:51 pm
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…
టాలీవుడ్ గమనాన్ని ఆసాంతం మార్చిన అతి కొద్ది సినిమాల్లో బాహుబలి స్థానం చాలా ప్రత్యేకం. అప్పటిదాకా మహా అయితే వంద…
భావం మంచిదే అయినా.. మాట తీరు కూడా.. అంతే మంచిగా ఉండాలి. మాటలో ఏ చిన్న తేడా వచ్చినా.. భావం…
హాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న సినిమాటిక్ యునివర్స్ కాన్సెప్ట్ ని క్రమంగా మన దర్శకులు బాగా పుణికి పుచ్చుకుంటున్నారు.…
కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాస్ పోర్టును రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల…
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట రాజకీయ నేపథ్యం ఉన్న పలు చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర-2,…