ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోసారి జగనే అధికారంలోకి వస్తారని తన దగ్గర సమాచారం ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. విమర్శలు గుప్పించారు.
జూన్ 4వ తేదీ తర్వాత.. కేసీఆర్-జగన్ ఇద్దరూ చింతపిక్కల ఆట ఆడుకోవడమేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్కే దిక్కులేదు. ఆయనే ఫామ్ హౌస్లో పడుకున్నాడు. రేపు ఆ పక్కనే మరో రూమ్ రెడీ చేస్తే.. జగన్ కూడా అక్కడకు వస్తాడు. అధికారంలోలేని ఈ ఇద్దరూ అక్కడ చింతపిక్కలాట ఆడుకుంటారు. ఒకవైపు కేసీఆర్, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటారు అని బొండా ఉమా విరుచుకుపడ్డారు.
అహంకారులకు ఈ ప్రజాస్వామ్యంలో చోటు ఉండదని ఉమా తేల్చి చెప్పారు. అహంకారులకు, దుర్మార్గులకు, చట్టాన్ని అతిక్రమించేవారికి.. ఈ ప్రజాస్వామ్యంలో చోటు ఉండదన్నారు. ఇప్పటికైనా తెలుసుకో జగన్. జూన్ 4వ తేదీనే నువ్వు ఈ రాష్ట్రంలో ఉండేందుకు ఆఖరి రోజు. జూన్ 5వ తేదీ నుంచి ఆయన ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోతాడు. కేసీఆరా, కేటీఆరా.. ఎవరైనా సరే రాసిపెట్టుకోవాలి. మీకు అంత అభిమానం ఉంటే.. మీ పక్క ఒక రూం ఇవ్వండి అని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on April 24, 2024 9:51 pm
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…
గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…