Political News

పెమ్మ‌సాని కి చాలా పౌరుషం గురూ

జ‌గ‌న్ .. సంపాద‌న‌ను నా సంపాద‌న‌తో పోల్చ‌వ‌ద్దు. ఆయ‌నది అక్ర‌మ సంపాద‌న అని అంతా(సీబీఐ) అంటున్నారు. నాది అలా కాదు. నేను ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాయించుకున్నా. సో.. ఆయ‌న‌తో న‌న్ను పోల్చ‌వ‌ద్దు అని టీడీపీ ఎన్నారై నాయ‌కుడు, గుంటూరు పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్నిక‌ల్లో దిగేందుకు.. త‌నకు మాతృభూమిపై ఉన్న ఆపేక్షే కార‌ణ‌మ‌ని తెలిపారు. అందుకే..తాను మూడు ద‌శాబ్దాలుగా అమెరికాలో ఉన్నప్ప‌టికీ.. అక్క‌డ గ్రీన్ కార్డు కోసం అప్ల‌య్ చేయలేద‌న్నారు.

రాజ‌కీయాల్లో ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు ఉండ‌డం స‌హ‌జ‌మే అయినా.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు స‌రికాద‌ని పెమ్మ‌సాని చెప్పారు. చంద్ర‌బాబు పై వైసీపీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు వింటే న‌రాలు తెగేంత కోపం వ‌స్తోంద‌న్నారు. రాజ‌కీయాల్లో ఒక‌రికొక‌రు గౌర‌వించుకునే వాతావర‌ణం ఒక‌ప్పుడు ఉండేద‌ని.. కానీ, ఇప్పుడు కొంద‌రు నాయ‌కులు, కొన్ని పార్టీల కార‌ణంగా ఈ వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింద‌న్నారు. ఎన్నిక‌ల్లో తాను గెలుస్తాన‌న్న న‌మ్మకం ఉంద‌ని.. ఒక ల‌క్ష్యంతో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నాన‌ని పెమ్మ‌సాని చెప్పారు. అయితే.. ఆ ల‌క్ష్యం ఏంటో ఎన్నిక‌లు అయ్యాక చెబుతాన‌న్నారు. గుంటూరును అన్ని విధాలా అభివృద్ధి చేసే ప‌క్కా ప్ర‌ణాళిక త‌న ద‌గ్గ‌ర ఉంద‌న్నారు.

రాజ‌కీయాల్లో నోరుంద‌ని.. అధికారం ఉంద‌ని.. నాయ‌కులు రెచ్చిపోతే.. వారికి స‌రైన స‌మాధానం చెప్పేందుకు వ్య‌వ‌స్థ‌లు కూడా ఉన్నాయ‌ని.. గ‌త ఐదేళ్ల‌లో అనేక సంద‌ర్భాల‌లో నిరూపితం అయింద‌న్నారు. ర‌ఘురామ‌కృష్ణ‌రాజును కొట్టిన‌ట్టు.. త‌న‌పై ఎవ‌రైనా చేయేస్తే.. వారి చెయ్యి న‌రికేసిన త‌ర్వాత‌.. స‌మాధానం చెబుతాన‌ని ఘాటుగా వ్యాఖ్యానించారు. వ్య‌క్తిని కొట్టడం అనేది చట్టానికి వ్యతిరేకం. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి న‌న్ను కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తే.. వాడి చెయ్యి తీసేసిన త‌ర్వాత‌.. స‌మాధానం చెబుతా అని పెమ్మ‌సాని హెచ్చ‌రించారు.

త‌న ద‌గ్గ‌ర డ‌బ్బుంద‌ని ఎన్నిక‌ల పోరులో పాల్గొన‌లేద‌ని.. ఒక అవ‌కాశం వ‌చ్చింది కాబ‌ట్టి.. సొంత భూమికి ఏమైనా చేయాల‌న్న ఉద్దేశంతోనే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చంద్ర‌శేఖ‌ర్ చెప్పారు. గ‌త 2019లోనే తాను ప్ర‌య‌త్నించాన‌ని.. కానీ, అప్ప‌ట్లో కుద‌ర‌లేద‌న్నారు. త‌న‌కు రాజ‌కీయాల్లో ఎవ‌రూ శ‌త్రువులు లేర‌న్నారు. త‌న స్నేహితులు గుంటూరు ప్ర‌జ‌లు, ఏపీ ప్ర‌జ‌లేన‌ని, వారికి సేవ చేసేందుకే తాను వ‌చ్చాన‌ని పెమ్మ‌సాని వివ‌రించారు. ఈ పోరులో గెలుపు ఓట‌ముల కంటే కూడా.. ప్ర‌జ‌ల కోసం ఎవరు ప‌నిచేస్తున్నార‌న్న విష‌యాన్ని ప‌రిశీలించాలి. వారిని గెలిపించాలి అని పెమ్మ‌సాని పిలుపునిచ్చారు.

This post was last modified on April 24, 2024 9:48 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pemmasani

Recent Posts

అమ‌రావ‌తి బిల్లు… తెర‌వెనుక యోధులు ఎవరు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. వాస్త‌వానికి ఇప్ప‌టికే చాలా బిల్లులు పెండింగులో ఉండ‌గా..…

34 minutes ago

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

2 hours ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

2 hours ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

4 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

5 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

6 hours ago