Political News

జగన్ తరువాత మోడీ ని ఎటాక్ చేస్తున్న షర్మిల

ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై అత్యంత సంచ‌ల‌న, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన గోద్రా అల్ల‌ర్ల విష‌యాన్ని కూడా ష‌ర్మిల ప్ర‌స్తావించారు. అంతేకాదు.. మ‌హిళ‌ల‌ మంగ‌ళ‌ల సూత్రాలు తెంపిన నాయ‌కుడు అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ లెక్క చెప్ప‌గ‌ల‌రా? న‌న్ను చెప్ప‌మంటారా? అని ప్ర‌శ్నించారు. తాజాగా బాప‌ట్ల పార్ల‌మెంటు ప‌రిధిలో ప‌ర్య‌టించిన ష‌ర్మిల‌.. ఇక్క‌డి కాంగ్రెస్ అభ్య‌ర్థి జేడీ శీలం త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు.

ఈసంద‌ర్భంగా ష‌ర్మిల మాట్లాడుతూ.. మోడీ సెంట్రిక్‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటీవల రాజ‌స్థాన్‌లో ప్ర‌ధాని మోడీ మాట్లాడు తూ.. కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. హిందువుల ఆస్తుల‌ను దోచేసి.. ముస్లింల‌కు పంచుతుం దని.. దీంతో హిందువుల మంగ‌ళ‌సూత్రాలు కూడా మిగల‌వ‌ని.. తెంచేస్తార‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. దీనిపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పైనే ష‌ర్మిల కౌంట‌ర్ ఇచ్చారు. మోడీ ప‌దే ప‌దే కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్న‌ట్టు ఆమె ఆరోపించారు.

మోడీ హ‌యాంలో గుజ‌రాత్ మ‌హిళ‌ల మంగ‌ళ‌సూత్రాలు ఎన్ని తెగిప‌డ్డాయో.. ఆయ‌న‌కు గుర్తు లేదా? మ‌మ్మ‌ల్ని చెప్పమంటా రా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. గోద్రా అల్ల‌ర్ల ఘ‌ట‌న‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోయార‌ని.. వారి ఇళ్ల‌లో మ‌హిళ‌ల మంగ‌ళ సూత్రాలు తెగ‌లేదా? అని ప్ర‌శ్నించారు. మ‌ణిపూర్‌(ఈశాన్య‌రాష్ట్రం)లో గ‌త ఏడాది తెర‌మీద‌కి వ‌చ్చిన అల్ల‌ర్ల‌లో అనేక మంది చ‌నిపోయారని.. వారి భార్య‌ల మంగ‌ళ‌సూత్రాలు తెంచ‌లేదా? అని అన్నారు. ఇంకా ఎన్ని మంగ‌ళ‌సూత్రాలు తెంచాల‌ని మోడీ భావిస్తున్నార‌ని నిల‌దీశారు. మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టి.. మంగ‌ళ‌సూత్రాలు తెంచే ప‌థ‌కాన్ని ఆయ‌న తెస్తున్నార‌ని తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

This post was last modified on April 24, 2024 6:22 am

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

3 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

3 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

3 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

4 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

4 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

4 hours ago