జగన్ అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్కు విముక్తి కల్పించడమే లక్ష్యంగా, ఏపీ అభివృద్ధే అజెండాగా తాము కూటమిగా ఏర్పడ్డామని జనసేన, టీడీపీ, బీజేపీ చెబుతున్నాయి. ఈ సారి ఏపీలో కూటమిదే అధికారం అని ధీమాతో ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా కూటమికి మద్దతు తెలపడంతో ఈ మూడు పార్టీలు మరింత సంతోషంలో మునిగిపోతున్నాయి. పద్మభూషణ్ చిరంజీవి లాంటి వ్యక్తి అండగా నిలిస్తే అంతకంటే కావాల్సింది ఇంకేం ఉంటుందని అంతా అనుకుంటున్నారు.
ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో రాజకీయాలకు చిరంజీవి గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. మళ్లీ సినిమాలు చేసుకుంటూ ఆయన పొలిటికల్ స్టేజీకి దూరమయ్యారు. కానీ ఇప్పుడు కూటమి విజయం కోసం మళ్లీ చిరంజీవి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనలాంటి వాళ్లకు రాజకీయాలు అచ్చిరావని ఇటీవల వ్యాఖ్యానించిన ఆయన.. ఇప్పుడు కూటమికి మద్దతు తెలిపారు. ఈ మేరకు తనను కలిసిన సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్లతో చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. ఏపీకి మంచి చేసేందుకు మూడు పార్టీలు ముందుకు రావడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. ”తమ్ముడు పవన్ కల్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకత్వం ఒక కూటమిగా రావడం మంచి పరిణామం. అలాగే సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్ లు మంచి వ్యక్తులు. వారిని గెలిపించండి” అని చిరు ఎక్స్లోనూ పోస్టు చేశారు.
ఇటీవల జనసేనకు రూ.5 కోట్ల విరాళం ఇచ్చి తమ్ముడు పవన్కు అండగా నిలబడ్డ అన్నయ్య.. ఇప్పుడు కూటమికి మద్దతు పలకడం విశేషం. ఇప్పటికే కూటమి నేతలు చిరంజీవి ఆశీర్వాదం కోసం క్యూ కడుతున్నారు. ఇకపై ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కూటమికి మద్దతుగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులపై, ప్రజలపై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకుని సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన జగన్పై సినిమా కుటుంబం పూర్తి వ్యతిరేకంగా ఉందనే చెప్పాలి. అందుకే జగన్ పక్కన సినిమా రంగానికి చెందిన వాళ్లు పెద్దగా నిలబడటం లేదు. ఇక ఇప్పుడు సినిమా రంగానికి పెద్ద దిక్కులాంటి చిరంజీవి కూటమికి మద్దతు తెలపడం జగన్కు దెబ్బే అని అంటున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…