జగన్ అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్కు విముక్తి కల్పించడమే లక్ష్యంగా, ఏపీ అభివృద్ధే అజెండాగా తాము కూటమిగా ఏర్పడ్డామని జనసేన, టీడీపీ, బీజేపీ చెబుతున్నాయి. ఈ సారి ఏపీలో కూటమిదే అధికారం అని ధీమాతో ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా కూటమికి మద్దతు తెలపడంతో ఈ మూడు పార్టీలు మరింత సంతోషంలో మునిగిపోతున్నాయి. పద్మభూషణ్ చిరంజీవి లాంటి వ్యక్తి అండగా నిలిస్తే అంతకంటే కావాల్సింది ఇంకేం ఉంటుందని అంతా అనుకుంటున్నారు.
ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో రాజకీయాలకు చిరంజీవి గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. మళ్లీ సినిమాలు చేసుకుంటూ ఆయన పొలిటికల్ స్టేజీకి దూరమయ్యారు. కానీ ఇప్పుడు కూటమి విజయం కోసం మళ్లీ చిరంజీవి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనలాంటి వాళ్లకు రాజకీయాలు అచ్చిరావని ఇటీవల వ్యాఖ్యానించిన ఆయన.. ఇప్పుడు కూటమికి మద్దతు తెలిపారు. ఈ మేరకు తనను కలిసిన సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్లతో చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. ఏపీకి మంచి చేసేందుకు మూడు పార్టీలు ముందుకు రావడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. ”తమ్ముడు పవన్ కల్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకత్వం ఒక కూటమిగా రావడం మంచి పరిణామం. అలాగే సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్ లు మంచి వ్యక్తులు. వారిని గెలిపించండి” అని చిరు ఎక్స్లోనూ పోస్టు చేశారు.
ఇటీవల జనసేనకు రూ.5 కోట్ల విరాళం ఇచ్చి తమ్ముడు పవన్కు అండగా నిలబడ్డ అన్నయ్య.. ఇప్పుడు కూటమికి మద్దతు పలకడం విశేషం. ఇప్పటికే కూటమి నేతలు చిరంజీవి ఆశీర్వాదం కోసం క్యూ కడుతున్నారు. ఇకపై ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కూటమికి మద్దతుగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులపై, ప్రజలపై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకుని సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన జగన్పై సినిమా కుటుంబం పూర్తి వ్యతిరేకంగా ఉందనే చెప్పాలి. అందుకే జగన్ పక్కన సినిమా రంగానికి చెందిన వాళ్లు పెద్దగా నిలబడటం లేదు. ఇక ఇప్పుడు సినిమా రంగానికి పెద్ద దిక్కులాంటి చిరంజీవి కూటమికి మద్దతు తెలపడం జగన్కు దెబ్బే అని అంటున్నారు.
This post was last modified on April 22, 2024 11:39 am
ఇటీవలే ప్రమాదానికి గురై భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల…
నిన్న జరిగిన బండ్ల గణేష్ కూతురి వివాహ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి…
విశ్వనాథ్ అండ్ సన్స్ తో దర్శకుడు వెంకీ అట్లూరి దిగ్విజయంగా హ్యాట్రిక్ పూర్తి చేశారు. ఇంత స్థిరంగా బ్యాక్ టు…
లోకేష్ కనగరాజ్ హీరోగా వచ్చిన 'డీసీ' సినిమాకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఆగస్టు 7న రిలీజైన…
ఓటిటిలు ఇంత విస్తృతంగా పెరిగిన తర్వాత ఏదైనా హిట్ సినిమాని రీమేక్ చేయాలంటే సంవత్సరాలు కాకుండా నెలల్లోనే పూర్తి చేయాలి.…
దర్శకుడు కొరటాల శివ టైం అంత బాగా నడుస్తున్నట్టు లేదు. ఆచార్య మానని గాయం చేసింది. డిజాస్టర్లు అందరికీ వస్తాయి…