Political News

బీఫారాలు ఇచ్చేశారు..జెండాల‌ను త‌గుల బెట్టారు

టీడీపీలో కీల‌క ఘ‌ట్టానికి పార్టీ అధినేత చంద్ర‌బాబు తెర‌దీశారు. కూట‌మిలో భాగంగా మొత్తం 144 అసెంబ్లీ స్థానాల‌కు టీడీపీ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా పార్టీ అధినేత చంద్ర‌బాబు 144 మంది అభ్య‌ర్థులకు పార్టీ త‌ర‌ఫున బీఫారాలు అందించారు. అదేవిధంగా 25 పార్ల‌మెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్న 17 స్థానాల‌కు కూడా.. ఆయ‌న ఆయా అభ్య‌ర్థుల‌కు బీఫారాలు అందించారు. ఉండ వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో జ‌రిగిన కార్యక్ర‌మంలో ఈ బీ ఫారాల‌ను అంద‌జేశారు.

అయితే.. వీరిలో కొంద‌రికి చ‌డీచ‌ప్పుడు లేకుండా.. ఈ రోజు ఉద‌య‌మే స‌మాచారం అందించి.. నియోజ క‌వ‌ర్గాల్లో మార్పులు చేయ‌డంతో ఆయా స్థానాల్లో మంట‌లు రేగాయి. మ‌డ‌క‌శిర‌, మాడుగుల‌, ఉండి, పాడేరులలో అభ్య‌ర్థుల‌ను మార్చారు. దీంతో ఆయా స్థానాల్లో ఇప్పటికే టికెట్ ప్ర‌క‌టించి.. ప్ర‌చారంలో ఉన్న అభ్య‌ర్థులు చంద్ర‌బాబు చిత్ర‌ప‌టాల‌పై రాళ్లు రువ్వి.. తీవ్ర ర‌చ్చ సాగించారు. బ్యాన‌ర్లు, పార్టీ జెండాల‌ను త‌గుల బెట్టారు.

మ‌డ‌క‌శిర‌లో సునీల్ ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు.. తాజాగా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఎంఎస్ రాజుకు అవ‌కాశం ఇచ్చారు. ఇది ఇక్క‌డ మంట‌లు రేపింది. ఇక‌, ఉండిలో ఇప్ప‌టికే ప్ర‌చారంలో దూకుడుగా ఉన్న మంతెన రామ‌రాజును ప‌క్క‌న పెట్టి ర‌ఘురామ‌రాజుకు అవ‌కాశం ఇచ్చారు. ఇది కూడా.. పార్టీలో మంట‌లు రేపింది. పార్టీ నాయ‌కులు కార్యాల‌యానికి తాళాలు వేసి.. జెండాలు పీకేసి వెళ్లిపోయారు. ఇక‌, పాడేరులోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ట‌కెట్‌ను చ‌డీ చ‌ప్పుడు లేకుండా.. గిడ్డి ఈశ్వ‌రికి ప్ర‌క‌టించారు.

ఇక‌, త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌న్న బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తికి.. తాజాగా విశాఖ జిల్లా మాడుగుల స్థానం ఇచ్చారు. అయితే.. ఇక్క‌డ ఆల్రెడీ ఎన్నారై పైలా ప్ర‌సాద్ రూ. కోట్లు ఖ‌ర్చు పెట్టుకుని ప్ర‌చార వాహ‌నాలు ఏర్పాటు చేసి.. ప్రచారంలో ఉన్నారు. దీంతో తాజా మార్పు ఆయ‌న‌లోనూ మంట‌లు రేపింది. దీనికితోడు.. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో కోడ‌లిని కాద‌ని.. మ‌ళ్లీ మామ‌కే కురుగుండ్ల రామ‌కృష్ణ‌కు చంద్ర‌బాబు చాన్సిచ్చారు. ఇక్క‌డ మాత్ర‌మే అసంతృప్తి లేదు. మ‌రి మిగిలిన‌ స్థానాల్లోనూ.. పార్టీలో అసంతృప్తి నెల‌కొంది. ఏదేమైనా చంద్ర‌బాబు అనుకున్న‌ది చేశారు. త‌మ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

పెద్దోళ్ల కమిటీ… జగన్ కు నచ్చట్లేదా?

వైసీపీలో పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజయం త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. పీఏసీకి…

1 hour ago

రణ్వీర్ నిషేధం… హీరోలకు ఒక పాఠం

రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…

3 hours ago

భార‌త్ బంగారం అమ్మేసిందా?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ఇంధ‌నం, బంగారం దిగుమ‌తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం భారీ స్థాయిలో విదేశీ మార‌క‌ద్ర‌వ్యాన్ని వెచ్చిస్తున్న విష‌యం…

4 hours ago

అమ్మ సెంటిమెంట్ జాన్వీకి కలిసొస్తుందా

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…

6 hours ago

ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…

7 hours ago

బాబు స్పందించారు… మిగిలింది ఇక రేవంతే!

పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…

7 hours ago