కాంగ్రెస్ పార్టీ మారింది. అవును.. దేశంలో ఇతర చోట్ల ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం వేరే లెవల్ అనే చెప్పాలి. ఇది ఒకప్పటి కాంగ్రెస్ కాదు. ఇప్పుడు మాటకు మాట సమాధానం ఇస్తూ.. ప్రతిపక్షాలకు బలంగా కౌంటర్ ఇస్తూ.. ప్రజల్లో ఆదరణ పెంచుకుంటూ.. బలోపేతమవుతూ తెలంగాణలో పార్టీ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ముందుండి నడిపిస్తుండగా.. ఇతర సీనియర్ నాయకులు కూడా అండగా నిలబడుతుండటంతో పార్టీ పరిస్థితి మెరుగుపడుతోందనే చెప్పాలి.
తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా ఇక్కడి ప్రజలకు చేరవయేందుకు కాంగ్రెస్కు సమయం పట్టింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్కు జనాలు జై కొట్టారు. అప్పుడు కాంగ్రెస్లో పోరాట పటిమ కొరవడింది.
ప్రజల ఆదరణ తిరిగి సంపాదించడంలో వెనుకబడింది. పార్టీలోని సీనియర్ల మధ్య ఐక్యత లేకపోవడం, అంతర్గత విభేదాలతో మరింతగా బ్యాడ్ అయింది. ఇదే అదనుగా కేసీఆర్ ఆ పార్టీని ఖాళీ చేసేందుకూ చూశారనే టాక్ ఉంది. ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగాయి. కానీ కాలం ఒకేలా ఉండదు కదా.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మారింది. కార్యకర్తల్లో జోష్ నింపి, సీనియర్ నాయకులను ఒక్కతాటిపైకి తెచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చేయడంలో రేవంత్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కు రాష్ట్రంలో తిరుగనేది లేకుండా చేయాలని రేవంత్ సాగుతున్నారు. అందుకే బీఆర్ఎస్ నుంచి నాయకులను చేర్చుకుంటున్నారు.
సభల్లో మాటల తూటాలతో కార్యకర్తల రక్తాన్ని మరిగిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా రేవంత్కు మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ సమర్థంగా పనిచేస్తున్నాడని కితాబిస్తూనే బీఆర్ఎస్పై విమర్శల దాడి చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ హైటెన్షన్ వైర్లా తాను ఉన్నానని, ముట్టుకోవాలని చూస్తే మాడిపోతారని బీఆర్ఎస్కు రేవంత్ ఇచ్చిన మాస్ వార్నింగ్ వైరల్గా మారింది. ఇలా పార్టీ నాయకులకు భరోసానిస్తూ, కార్యకర్తలకు నమ్మకాన్ని కలిగిస్తూ పార్టీని స్ట్రాంగ్గా చేస్తూ సాగుతున్నారు.
This post was last modified on April 21, 2024 11:53 am
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…