మనిషికి మరణం ఎక్కడి నుంచైనా, ఎవరి నుంచైనా రావచ్చు. కానీ జన్మ మాత్రం ఒక్క అమ్మ ద్వారానే సంభవిస్తుంది. అందుకే ఎంతటి వారికైనా అమ్మతో అనుబంధం ప్రత్యేకం. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న నానుడి వచ్చింది. దానికి ప్రధానమంత్రి మోడీ కూడా అతీతుడు కాదు. తల్లితో ఆయనది ప్రత్యేక అనుబంధం. అనేకమార్లు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు కూడా. 2022 డిసెంబర్ 30న మోడీ మాతృమూర్తి హీరాబెన్ 100 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని దమోహ్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక యువకుడు తీసుకొచ్చిన ఫొటోను చూసి మోదీ భావోద్వేగానికి గురై కొద్ది సేపు నోట మాటలు రాకుండా ఆగిపోయారు. ఆ యువకుడు ప్రదర్శించిన ఫోటో మోదీనా తల్లి హీరాబెన్ ఆశీర్వదిస్తున్న ఫోటో. పెన్సిల్ తో గీసిన ఆ చిత్రాన్ని చూసి మోడీ బావోద్వేగానికి గురయ్యాడు.
ఆ చిత్రాన్ని తెచ్చిన యువకుడికి అభినందనలు తెలిపిన మోడీ .. ఆ ఫొటో వెనుక అతని పేరు, చిరునామాను రాసివ్వాలని సూచించాలని… అతనికి తాను లేఖ రాస్తానని చెప్పారు. అమ్మతో అనుబంధం ఎంతటి వారికైనా ఒక కమ్మని జ్ఞాపకమేనని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది.
This post was last modified on April 22, 2024 12:27 am
ఇటీవలే ప్రమాదానికి గురై భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల…
నిన్న జరిగిన బండ్ల గణేష్ కూతురి వివాహ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి…
విశ్వనాథ్ అండ్ సన్స్ తో దర్శకుడు వెంకీ అట్లూరి దిగ్విజయంగా హ్యాట్రిక్ పూర్తి చేశారు. ఇంత స్థిరంగా బ్యాక్ టు…
లోకేష్ కనగరాజ్ హీరోగా వచ్చిన 'డీసీ' సినిమాకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఆగస్టు 7న రిలీజైన…
ఓటిటిలు ఇంత విస్తృతంగా పెరిగిన తర్వాత ఏదైనా హిట్ సినిమాని రీమేక్ చేయాలంటే సంవత్సరాలు కాకుండా నెలల్లోనే పూర్తి చేయాలి.…
దర్శకుడు కొరటాల శివ టైం అంత బాగా నడుస్తున్నట్టు లేదు. ఆచార్య మానని గాయం చేసింది. డిజాస్టర్లు అందరికీ వస్తాయి…